బాలల దినోత్సవం - 14 నవంబర్
విశ్వవ్యాప్తంగా పిల్లల సంబరాలు
పలు దేశాలు, అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. జెనీవా - స్విట్జిర్లాండ్ లో 1925 లో బాలల సంక్షేమాన్ని దౄష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి సమావేశం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని చైనా రాయబారి కార్యాలయం చైనా దేశపు అనాధ పిల్లలకోసం 1925 లోనే డ్రాగన్ పడవల ఉత్సవాన్ని జరపడం, అదేరోజు జూన్ 1 న బాలలకోసం సమావేశం జరపడం యాదౄచ్చకంగా జరిగిపోయాయి. యిదేరోజు అంతర్జాతీయ బాలల సంవత్సరం అనేక దేశాలు జరుపుతుండగా, పశ్చిమప్రాంతపు కమ్యునిష్టు దేశాలు వేర్వేరు తేదీన జరుపుకోవడం, కమ్యూనిష్టు దేశాల సంప్రదాయంగా కూడ ప్రారంభం అయింది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అమెరికాలోని అధికరాజ్యాలు కూడ జరుపుకోవడం సంతోషించతగ్గది. యునెస్కో పిల్లలకి అంకితభావాలు యునెస్కో సంస్థ పిల్లలకు ప్రత్యేకంగా 1954 లో 20 నవంబర్ రోజుని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి, యునెస్కో సంయుక్తంగా పిల్లలకోసం సౌహార్ద్రతకై ప్రత్యేకతని వివరించారు. బాలల సంక్షేమాన్ని దౄష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించేందుకు తొలిప్రయత్నాలను చేశారు. భారతదేశంలో నవంబర్ 14 నే జరుపుకోవడం, ఆనాడు భారత తొలి ప్రధాని నెహ్రూ జన్మదినం కావడం విశేషంగా భావించబడుతోంది. మనదేశంలో ముందడుగు - 14 నవంబరు పిల్లల పండగ భారతదేశపు తొలిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన - 14 నవంబరు న జరుపుకోవడం సదాచారంగా వస్తున్నది. పిల్లలంటే ఆయనకు పంచప్రాణాలు, ఎప్పుడూ పిల్లలతో సరదాగా గడపడం, పిల్లలకు కూడ అంతకన్న అధిక సంతోషంగా గడిపేవారు. 1963 లో ఆయన మరణాంతరం, చాచా నెహ్రూ పుట్టినరోజు సంబరాలతో పిల్లలకు కూడ పండగ జరుపుకోవడం భారతీయసంప్రదాయం. బాలలు దేవుని ప్రతిరూపాలు హైందవ ధర్మసంస్కౄతీపరంపరలో మానవజన్మకు సార్ధకమైనవి చతురావస్థలు - బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య దశలు. మానవుడి జీవితంలో మధురాతిమధురమైనది బాల్యదశ. బాలల గురించి అల్పంలో అనల్ప భావనను వర్ణించాలంటే, మహాకవి శ్రీశ్రీ, ఒక బాలలసంవత్సరం రోజున ఆయన వర్ణించిన కవితను - బాలలే విజ్ణాన కేతువులు, నేడు రేపుల మధ్య సేతువులు, చంద్రబంధుర సుధాశీతువులు, మానవత్వ వికాస హేతువులు, అన్న భావన అపూర్వమనే చెప్పాలి. కవిత్రయంలో మధ్యకవి, తిక్కన, మహాభారతం, ఉద్యోగపర్వంలో, తొలి తొలి గోరికొనన్ బాలునికి దగుం బాడిమెయిన్ అంటాడు. నేటి బాలలే రేపటి పౌరులు. దేశభవిష్యత్తు వారిమీద ఆధారపడింది. పిన్నలను తీర్చిదిద్దడం పెద్దల కర్తవ్యం. చిన్నప్పుడే బాలలు తమ వ్యక్తిత్వాలను రూపొందించుకునే వాతావరణాన్ని, ప్రోత్సాహాన్ని సమాజం కల్పించాలి. బాలల్లో ఉన్న కళలూ తెలివితేటలూ నిర్మాణాత్మకంగా దేశానికి ఉపయోగపడేటట్లు అవకాశాలు రూపొందించాలి. అన్ని రంగాల్లోవలనే, బాలలలోని సౄజనాత్మకశక్తినీ, కళాతౄష్ణనూ, ప్రతిభావికాసాలనూ పరిపోషించటానికి విశ్వవ్యాప్తంగా ముందంజ వేయాలి. చదువుతోపాటు బాలల సాహిత్య సాంస్కౄతిక కళావికాసాలకు కౄషిచేసే సంస్థలూ, పత్రికలూ ఎన్నో ఉన్నాయి. ఆ రంగాలలో వ్యష్టిగా జరుగుతున్న కౄషిని సమీకరించి సమిష్టిగా సమాజానికుపయోగపడే విధంగా, మరింత విస్తౄత ప్రాతిపదికతో కార్యక్రమాల్ని చేపట్టి బాలల సర్వతోముఖ వికాసానికి తోడ్పడే వ్యవస్థ నొకదానిని సుస్థిరంగా ఏర్పాటు చేయడానికి మరింత సంకల్పం, దీక్ష వహించాలి. బాలల అకాడమీలు, బాలసదనాలు, మరింత అర్ధవంతంగా, సార్ధకతను పెంపొందించేలా, కార్యకలాపాలు నిర్వహించి, బాలల విజ్ణాన, వినోద, వికాసాలకు మరింత సహాయపడాలి. బాలల అకాడమీలు కూడ విశ్వవిద్యాలయాలే! అఖిలభారతదేశంలో బాలల అకాడమీ ని స్థాపించిన గౌరవం మొదటి సారి మన రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ కే దక్కింది. అందుకు మనల్ని మనమే అభినందించుకోవచ్చు. మనం ఈ మధ్య కాలంలోనే తరచు కనీసం చర్చించుకుంటున్న ఆత్మగౌరవం పదాన్ని కనీసం యిటువంటి ప్రయత్నాలకు అన్వయించుకోవచ్చు. కాని మన పూర్వీకులు అన్నట్లు, అంధ్రులకు ఆలోచన కన్న ఆవేశం ఎక్కువ. ఆరంభశూరులు, వెంటనే చతికిలబడతారు, లేదా నత్తనడక నడుస్తారు. బాలలలో నిత్యనూతన వికాసాన్ని కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి. వాటిల్లో బాలల ప్రత్యక్ష ప్రమేయాన్ని కలిగించాలి. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో తాము చిన్నప్పటినుంచీ పాల్గొంటున్నామన్న ఆత్మవిశ్వాసాన్ని బాలలలో కలిగించాలి. నడుస్తున్న చరిత్రలో వారుకూడా భాగస్వాములు కావాలి. చదువుతున్న పుస్తకాలెంత విజ్ణానాన్ని యిస్తాయో చూస్తున్న సమకాలీన సమాజం కూడా అంత విజ్ణానాన్నిస్తుంది, యిస్తోంది అన్న భావనను అందరూ గ్రహించి, దోహదపడాలి. బాలలు గతంలోనుంచి గొప్పతనాన్ని గ్రహించాలి. వర్తమానంలోనుంచి సత్తువను పెంచుకోవాలి. భవిష్యత్తుకు కావలసిన ముందుచూపును అలవరచుకోవాలి. అన్ని రంగాల్లో నాయకత్వాన్ని వహించే సమగ్ర వ్యక్తిత్వాలను పిన్న వయసులోనే సాధించాలి. అటువంటి అవకాశాలను కల్పించే సంకల్పంలో ప్రభుత్వాలు బాలల అకాడమీలను, సదనాల్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళాలి. బాలల సమస్యల్ని చర్చించుకోవటానికీ, నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్ని బాలల సలహాసంప్రదింపులతో, రూపొందించుకోవడానికి, బాలల కళాసాహిత్య ప్రతిభలను ప్రదర్శింపచేయడానికీ, సభలను, సమావేశాలను తరచుగా, సక్రమంగా నిర్వహించుకోవాలి. పాఠశాలల్లో బాలబాలికలను సంఘాలుగా ఏర్పాటు చేయించి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దల సహాయసహకారాలతో, లలితకళలపైన, క్రీడలపైన, వినోదోల్లాసభరిత కార్యక్రమాలను నిర్వహించి, ప్రతిభావంతులకు బహుమతులు, ప్రోత్సాహాలు అందజేయాలి. బాలల అకాడమీలను కూడ విశ్వవిద్యాలయాలుగా భావించి తగు ప్రణాళికలను నిర్మాణం చేసి, ఆచరణలద్వారా సత్ఫలితాలను పొందాలన్నది నేటి తీర్మానంగా పరిగణించాలి. బాలభారతీయం ఫలించిన స్వప్నాలకి ఆకౄతులు కలకలలాడే పిల్లలు. వాళ్ళ ఉజ్జ్వల భవిష్యత్తు జాతి భవిష్యత్తు బాల్యంలోనే వాళ్ళ ఆలోచనలకు పదును, హౄదయాలకు వికాసోల్లాసాలు అవసరం. వయోమర్యాదలకు అనుగుణంగా సాహితీకళారంగాల్లో కౄషి విదేశాల్లో విజయవంతంగా శతాబ్దాలుగా సాగుతున్నది. పండితులు, నాగరికులు వయస్తారతమ్యంతో నిమిత్తం లేకుండా బరువైన ప్రౌఢసాహిత్యాన్ని తమ పిల్లలకు కధలతోనూ, పొడుపుకధలతోనూ, పాటలతోనూ, ఆటలతోనూ అలరిస్తూ బాలసాహిత్యంలో మెదళ్ళకు పదునుపెట్టే విజ్ణానంతో పాలు తక్కువ. ఈ కాలంలో వినోదంతో పాటు వైజ్ణానిక, సాంకేతిక దౄష్టి, పరిసరాలను గురించిన పరిజ్ణానం అత్యావశ్యకం. బాల్యముననున్న గుణములు వయస్సు ముదిరినను పోవు; బాల్యయవ్వనాలని బేఖాతరుగా తిరిగిన వాళ్ళూ ఎంతటి ఇంటబుట్టినా కౌమార వార్ధక్యాలలో కష్టపడక తప్పదు అన్న నగ్నసత్యాన్ని బాలలబాషలో తెలియజేయాలి. చిన్నపిల్లల స్థాయినుంచీ బాల్యస్నేహం గురించి వారి హౄదయాల్లో నాటుకునేట్లు వివరించాలి. చిన్నపిల్లల స్నేహం బీరకాయ పీచులాంటివి; అవి అతి విచిత్రంగా ఒక వీధినుండి ఇంకోవీధికి, ఒక పేటనుండి ఇంకో పేటకూ విస్తరిస్తాయి అని అంటారు, కొడవటిగంటివారి ప్రముఖ నవల చదువు లో. బాలలు, పిల్లలు ... వీరి దృౠష్టిలో ? ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు బాలలకధల్ని సౄష్టించిన అతివౄద్ధుల్లో ప్రముఖులు. సత్యం, శివం, సుందరం అని గర్వంతో చెప్పగల, అన్నివయసులవారు ఎల్లపుడూ చదివే పెద్దలపాఠకులుకూడ ఆదరించే చందమామ పత్రికలో, ప్రముఖ బాలలకధలను అందించిన వీరు, బాలల గురించి చాలా మంచి అభిప్రాయాలు చెప్పారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళయినా వాళ్ళకెటువంటి సదుద్దేశాలున్నా, కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల జీవితం గురించి వాళ్ళ నిర్ణయాలు చెయ్యలేరు. చిన్నపిల్ల విశ్వాసాలు పెద్దవాళ్ళ విశ్వాసాలంత జ్ణానయుతంగా ఉండవుగాని, అంత మూఢంగా కూడా వుండవు. కొందరు పిల్లలకు బొమ్మలు ఎట్లా కావాలో, కొందరు పెద్దలకు కూడా పిల్లలు అట్లాగే కావాలి ఆడుకోవడానికి. పెద్దవాళ్ళను అంచనాకట్టే శక్తి పిల్లలకు అపారంగా వుంటుంది. పిల్లల ఉద్రేకాలను కూడా పాటించడంవల్ల జీవితం బాగుపడుతుందేకాని చెడిపోదు. చిన్నపిల్లలకు రుచిలోగాని, అభిరుచిలోగాని వ్యత్యాసాలు తెలియవు, పట్టవు కూడా. చేరదేసిన వారిని పాకులాడతారు పిల్లలు. అందువల్లనే, ప్రధమ శైశవదశలో, పిల్లలు కొందమంది పెద్దవాళ్ళదగ్గరికే వెళ్ళడం, మిగతావారిదగ్గరకు, వారిలో ఏ భూతాన్ని చూస్తారో తెలియదు కాని, ఎంతమాత్రమూ వారిదరికి చేరరు. మనకు తెలియని తేడా, పిల్లలకు వారి భాషలో, భావనలో తెలిసితీరుతుంది. బాల్యం అమూల్యం - పిల్లదనాలే గొప్పదనాలు నేటి బాలలే రేపటి పౌరులు. శిశువుల చిరునవ్వు ముందు పశువు కొమ్ము వంచునులే అంటారు సినారె. కేవలం చిరునవ్వేమిటి, అసలు బ్రతుక్కి ఆనందపు పొలిమేర పసితనంకాక మరేముంది చెప్పండి అని దాశరధి సూటిగా, గ్రుచ్చిమరీ ప్రశ్నించారు. బిడ్డలకు వర్ణమాల నేర్పుటకు ముందు ముఖత: ఎన్నియో విషయములను నేర్పవలసియుండును. వ్రాత నేర్పకపూర్వమే వారికి చదువుట నేర్పవలెను అన్ని బాలనీతిచంద్రికను వివరించారు, జాతిపిత, మహాత్ముడు, ముసిముసి బోసిబోసి నవ్వుల నాణ్యమైన నజరానా. ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువూ అంతకు ముందు పుట్టిన దానికన్నా గొప్పగా వుంటుంది. బాల్యంలో వున్నంతటి స్వచ్చమైన సంతోషమూ, తాత్కాలికమైన విచారమూ మరెక్కడైనా వుంటాయా! బాల్యంలో ఒకానొక ప్రత్యేక క్షణం వుంటుంది. ఆ క్షణం తలుపులు తెరుచుకుని భవిష్యత్తు లోపలికి అడుగుపెడుతుంది. బాలుడు కేవలం బాలుడేకాదు, వ్యక్తికి తండ్రి అని అన్నాడు వర్డ్స్క్ వర్త్. పుట్టుకతోనే పిల్లల విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. పిల్లల్ని బాగుచేయాలంటే వాళ్ళను సంతోషపెట్టడమే ఉత్తమ పద్ధతి. పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని కించపరచినా వారిని మనలో భాగంగానే చూస్తాం. ఉదయం రోజును ప్రతిబింబించినట్టు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది. అన్నింటినీ ఆమోదించే వయసు బాల్యం అంటాడు, ప్రముఖ కవి ముల్క్ రాజ్ ఆనంద్. మనకు విశ్వంలోని వింతల మాదిరి పిల్లల కన్నులో ఏడు వింతలు కాదు ఏడు లక్షల వింతలున్నాయన్న అద్భుతభావనని చక్కగా వెలిబుచ్చాడు, వాల్ట్ స్ట్రెయిటిఫ్ అన్న కవి. దేవ్వుడికి మనిషిమీద ఇంకా ఆశ పోలేదనే సందేశంతో ప్రతి పిల్లవాడూ ఈ భూమ్మీదకొస్తాడు, అంటాడు ఠాగూర్. మనం తరచు గమనిస్తూంటాము, పెద్దవాళ్ళ మాటలతో పిల్లలూ, వయసు మీదపడుతున్నా పిన్నచేష్టల్లా కనిపించే వౄద్ధచేతలు. అందుకే, పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని కించపరచినా వారిని మనలో భాగంగానే చూస్తాం. పిల్లలే రేపటి ఆశలు; వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించు; వాళ్ళకన్నా గొప్పవాడినని అనుకోకు; నిజానికి నువ్వు కావుకూడా అని అంటాడు రాబర్ట్ హెన్రీ. అందుకే, కరుణామయుడు క్రీస్తు, తన సందేశంలో, "నేను చిన్నపిల్లాడిగా వున్నప్పుడు చిన్నపిల్లాడిలానే ఆలోచించాను; చిన్నపిల్లాడిలానే అర్ధం చేసుకున్నాను; చిన్నపిల్లాడిలానే ప్రవర్తించాను; పెద్దయ్యాక చిన్న తరహా పనులు మానేశాను. ఈ భావనాపరంపరను అందరూ అర్ధంచేసుకుని, ముఖ్యంగా తల్లిదండ్రులు, ప్రవర్తిస్తే, పిల్లలకు, పెద్దలకు మధ్య అవగాహనారాహిత్యధోరణి, అయోమయదుస్థితి, వార్ధక్య ఛాందసప్రవౄత్తి, పుట్టినప్పటి బుద్ధి పుడకలతోనే కాని పోదు అన్న ప్రవర్తన, తరం మారుతున్నా మనమే గత్యంతరం అన్న భావన మాసిపోనంతకాలం పెద్దరికాలు యిలా చెలామణీ అవుతునేవుంటాయి. చిచ్చరపిడుగుల్లాంటి పిల్లలు చేయలేని పనులు లేనేలేవు. వారు పెద్దవాళ్ళమాట విననన్నా ఈ వౄద్ధతరం చేసేదె ఏమీలేదు. చరమదశలో మరింత ఆవేదనలు, ఆందోళనలు కూడపెట్టుకుని, అంతంతమాత్రంగా వున్న ఆరోగ్యాన్ని మరింత తగ్గించుకోవడమే కాదు. పెద్దతనానికి ఒక ప్రవేశపరీక్ష పెట్టి అర్హతను నిర్ణయించాలి. ఆ సమయం రాకమానదు. అందుకే బాల్యం, వయ్యనానికుండే లక్ష్యాలే మానవజాతి లక్ష్యాలు అన్నాడు ఓ కవి. బాల్యం అన్న సామ్రాజ్యంలో మరణాలు వుండవు అంటాడు లాంగ్ ఫెలో. తెల్లకాగితం లాంటి పిల్లల మనసుని అర్ధం చేసుకోవాలి. అల్లరి, కోతిచేష్టలు చేసినా పిల్లలు, మనిషి కోతిలోంచి పుట్టిన సంగతి ప్రతి చేష్టలో ప్రత్యక్షం చేస్తారు మన పిల్లలు. పిల్లలు తమకి అన్నం పెట్టేవారికన్న మిఠాయి కొనిపెట్టి తమతో ఆడుకునేవారిమీద యెక్కువ ప్రేమ చూపుతారని, బిడ్డలశిక్షణ అని అనూహ్యమైన కరదీపికను రచించిన చలం తన మ్యూజింగ్స్ లో అంటాడు. పిల్లలకు నా, నీ సొమ్మని భేదాలుండవు, అంతా తమ స్వంతంగా వాడుకుంటారు. అందుకే, పిల్లలు ఎవరింటికెళ్ళినా, వాళ్ళకు నచ్చినవి ఏమైనా కనిపిస్తే, అమాంతం వాటిని స్వంతం చేసేసుకుంటారు. పిల్లలు ఒక్కోసారి ప్రదర్శించే ఉద్రేకాలు కూడ వారి జీవితం బాగుపడుతుందే కాని నిరర్ధకం కావు. పిల్లలలో కొంతమంది భిన్నులు కూడా వుంటారు. పిల్లలంత మోసగాండ్రు పెద్దవారు కారు సుమా అని అంటారు, సాక్షి రచయిత పానుగంటి వారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళయినా, వాళ్ళకెటువంటి సదుద్దేశాలున్నా కొన్నికొన్ని విషయాల్లో పిల్లల జీవితం గురించి వాళ్ళ నిర్ణయాలు చెయ్యలేరు అని కూడా కొడవటిగంటి వారు అన్నారు. పిల్లలను భరించలేకపోతున్నామనే తల్లిదండ్రులు అసంఖ్యాకం. పుట్టేంతవరకూ ఆరాటం. పుట్టాకా మొదటి దశలో పరిష్వంగసుఖసారం. కాస్త తెలివి, చురుకుతనం వస్తే, అల్లరి పిడుగుని భరించలేనితనం. అదే పిల్లలు అతిగా ప్రవర్తిస్తే, తప్పుదారులు పట్టితే, పెద్దయ్యాక తల్లిదండ్రులమాటని ఖాతరు చేయనంతగా ప్రవర్తిస్తే, ఆవేదన, తిరిగి ఆరాటం. కనుక, ఆరాటం నుంచి ఆరాటం వరకు తల్లిదండ్రుల పాత్ర అని చెప్పాలి. ఓషధులే తండ్రులుగా, రసవిషాలు తల్లులుగా, తయారవుతున్నారు శిశువులు అంటాడు బైరాగి. అవస్థాబాల్యం ఎదగడానికెందుకురా తొందర, ఎదర వయసంతా చిందర వందర అన్నాడో చిత్రకవి. బాల్యం నుంచే అవస్థలు, భరించలేని చదువులు, పుస్తకాల బరువులు, యింట్లో తల్లిదండ్రుల దరువులు, వెరసి ప్రేమాభిమానకరువులు. బ్రతకలేని, పూట గడవని కుటుంబాల్లో, పిల్లలే పనులకు వలసలు. సంపాదన మాట ఎలా వున్నా, పసితనంలోనే పనులభారం అమానుషం. ఎన్ని బాలకార్మికచట్టాలు వచ్చినా కంటితుడుపే. చట్టాలు కట్టలు కట్టలే తప్ప, పిల్లలకు పనికిమాలిన శాసనాలు. పిల్లల మనసులను భావాలాను రెచ్చగొట్టే విధానాలు యింతలు, మరింతలు అయితే, బాలలు హత్యలు చేయక మానతారా, జైళ్ళకు వెళ్ళి గడుపుతూ చదవక మానతారా. బాల్య వివాహాల నుంచి బయటపడినా, అవస్థాబాల్యం నుంచి బయటకు రాలేని దుస్థితి, అయోమయం లో కూరుకుపోయాము. ఆధునికత, నవీనభావుకత, మన నడకను, నడతను వక్రీకరించబడుతూ, నాణ్యత, నీతి పర్వాలకు భరతవాక్యాలను పలికిస్తున్నాయి. ప్రస్తుతకాలం, కేవలం పది వసంతాలకే బాల్యం పూర్తవుతోంది. ప్రాచీనకాలం, పుర్ణాయువు ద్విశతవసంతాలుగా చెలామణి అయినప్పుడు, బాల్యం మూడు పదులప్రాయం వరకూ గుర్తింపబడేది. నేటి బాల్యం బాల్యంగా ఎప్పుడూ రాణించడంలేదు. బాల్యావస్థని గ్రహించి అనుభూతి చెందేలోపున, దురవస్థగా మారి దుస్థితిపాలవుతోంది. కన్నలకు కష్టాలకడలి రివ్వురివ్వున వస్తోంది. బాలారిష్టాలకు బాలలే గురవుతున్నారు అప్రమేయంగా. నవమాసాల అంతర్జీవనం మాతౄగర్భంలో ఒజ్జగిలి గడిపి, పున్నామ నరక విముక్తికోసం పోరాటమే కనిపిస్తోంది. అయినా, తల్లి గర్భంలో అసౌకర్యంతో ఒదిగున్నా, నునువెచ్చని రక్తస్పర్శ నవలోకంలోకి నరింపచేస్తోంది, ప్రేమాభిమానబంధమై కలకాలం నిలుస్తోంది. ఆ బంధమే మాతౄ, పితౄ దేవోభవ రూపాన జననీజనకులకు గురుభారయోగమౌతోంది. ఓం నమశ్శివాయ అంటూ విద్యాభ్యాసం ప్రారంభించిన వెంటనే విద్యార్జన యజ్ణంలో సమిధలై విన్నూత్న ఘర్షణలకు లోనై, నిరాశానిస్పౄహలతో నిర్జీవులవుతున్నారు, మన శిశువులు, బాలమహేశ్వరులు, కుర్రలు, సుందరీబాలలు, రమణీమణులు, బాలగణపతులు, మన కుమారస్వాములు. నమ్మక వాస్తవాలమధ్య నలిగిపోతున్న మన శిశూదయావస్థలు. జన్మనిచ్చినంతమాత్రాన వారిని శాశించి, హింసించే అధికారం, హక్కులు లేనేలేవు, రావు, రాకూడదు. పిల్లలను నిత్య నరకప్రాయం చేయకండి. వారి మానాన వారిని వదలాడి, మెదలండి. వారి ఆశల అభిరుచుల చాయలనే కదలాడి కేవలం ఆర్ధికసాయం చేసే సువిధలవ్వండి. కడు హార్దికంగా మెలగవలసిన తల్లిదండ్రులైన వ్యక్తులని మరువకండి. పాపం, భూమిమీద పడినంతనే అఖండభారాలు, వెంట వెంటనే వీడిని పెద్దను చేసే రెండవప్రసవాలు. లేదా బారెడు ఎడాలు. చిన్నవాడినే పెద్దవాడిని చేసే హోదాలు, లేదా పంచవర్షప్రణాలికలు. చంటాడికి తోడులేని కడువంటరితనాలు. బాలజీవితాలకు మరింత జీవన్ టోను నివ్వండి. పెద్దరికపు గద్దెలెక్కి, అర్ధంలేని ఆజ్ణలనివ్వకండి. వారి మానాన వారిని వదలక అవమానాలపాలు కాకండి. తల్లిదండ్రులారా, గురువులారా, యిరుగుపొరుగు పెద్దలారా, అవసానదశలో అపహాస్యాన్ని ఆహ్వానించకండి. ఆబాల గోపాలాన్ని ఆనందడోలికల్లో ముంచండి. సుఖానుభూతుల్లో తిరిగి తిరిగి తేలియాడెంచండి. ఆనందోబ్రహ్మ అన్న సూత్రంతో బాలచిదానందమూర్తులను భావిభారతపౌరులని మరువక, భాగ్యవంతుల్ని, ప్రేమాభిమానభరితసుసంపన్నులని కావించండి. శతమానం భవతి అని మనసా వాచా కర్మణా ఆశీర్వచనాక్షతల్ని వారి శిశుశిరస్సులపై పేర్చండి. భావితరపు ప్రతినిధులని, భావిభారతీయతకు కర్త, కర్మ, క్రియ, నేటి శిశువులు, బాలలు అని మరవకండి. నిత్యం ఈ భావనే సదా స్మరించంది. సుఖపడండి. మీ పిల్లల్ని సుఖపెట్టండి. సత్యం, శివం, సుందరం అన్న తత్వాన్ని ఆచరించండి. బాలలకు ప్రత్యేకంగా వేదోపనిషత్తులను సౄష్టించండి. బాలరామాయణాలు, బాలభారతాల్ని నిజంగా రచించండి. బాలప్రబంధ రత్నావళి కి పుటల్ని పేర్చండి. ఆ దిశలో దశలో తరలండి, తరలిరండి, దండిగా, దండిగా. నాణ్యమైన నాలుగు సూత్రాలు ప్రముఖ శిక్షకులు, వ్యక్తిత్వ వికాస నిష్ణాతులు, బి.వి.పట్టాభిరాం గారు పిల్లల అభివౄద్ధికి, వికాసానికి, నాలుగే నాలుగు సూత్రాలను వివరించారు. 1, అంతరంగంలోని స్వఛ్ఛమైన కోరికను గ్రహించి నిర్ణయం చేసుకోవాలి. 2. ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నంలో అంకితభావాన్ని ప్రదర్శించాలి. 3. పిల్లలకున్న చిన్నదైనా, చింతలులేని జీవనంలో క్రమశిక్షని - ముఖ్యంగా వ్యక్తిగతపరంగా, పాటించాలి. 4. సంకల్పం, దీక్ష వహించి వారి ఆశయాన్ని, ఆకాంక్షని సాధించాలి. బాల్యంలోనే, ఎదురైన అవకాశాలపై మురిసిపోయి అన్నీ తెలుసునన్న ధోరణిలోకి పోరాదు. ఏమీ తెలియదే అని గ్రహించి, అన్ని విషయాలు, క్రమక్రమంగా, తెలుసుకొని బాలప్రజ్ణానిగా మారేందుకు మీశైలిలో కౄషి చేయాలి. బాలసాహిత్యం లో మచ్చుతునకలు మన సాహితీపరంపరలో బాలలకు కూడ గణనీయమైన సారస్వతాన్ని ప్రసాదించారు మన సాహితీమూర్తులు. ఆ సాహితీమాధుర్యాన్ని - మహాకవి శ్రీశ్రీ, తన రచన 'శైశవగీతీలో 'ఐదారాడులా పసిపాపలను వర్ణించాడు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలు, ఏవీ ఎరుగని పూవుల్లారా, ఐదారేడుల పాపల్లారా. మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే, 'అవి మాకే' అని ఆనందించే కూనల్లారా. పిల్లలకే అల్లరి తెలుసు, పిల్లలదే మల్లెల మనసు, అల్లరి మల్లెలు కొల్లగ జల్లీ ఎల్లరినీ రంజించుట తెలుసు. (అజ్ణాత శైశవం - ఒక బాల సాహితీవేత్త). బాల ప్రపంచం - పాల ప్రపంచం, పాలవలె తెల్లనిది, పాలవలె తియ్యనిది, పాలవలె చిక్కనిది. (ఏడిద కామేశ్వరరావు). తెలుగు దేశపు తెలుగు పిల్లలు, తెలుగు వెలుగులండీ, తెలుగు బాలురు తెలుగు బాలికలు, తెలుగు సొమ్ములండీ. (రేడెయో అన్నయ్య - న్యాయపతి రాఘవరావు) బాల సాహిత్యంలో తొలి వెలుగులుగా - ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు, పండుగ పాటలు, ఆటల పాటలు, ఎగతాళి పాటలు, పిల్లల రచనలు, బాలల కావ్యాలు, గేయాలు, కధలు, నవలలు, నాటికలు, నాటకాలు ఎన్నో అవతరించాయి. సాహిత్యంతో పాటు, సంగీతం, సంస్కౄతి వెలుగులోకి వచ్చాయి. బాలల దినోత్సవం నాడు పెద్దలకు సలహా నీకు క్షణం తీరిక చిక్కితే, నీ బిడ్డ కేదైనా బోధించు. నీ చేతిలో ఒక్క కాసుంటే అది నీ బిడ్డకై వెచ్చించు. నేటి బాలలే రేపటి పౌరులు. అంతేకాదు, ఫలించిన స్వప్నాలకు ఆకౄతులు, కలకలలాడే పిల్లలు. ఈ బిడ్డలకు వున్న బుద్ధే పెద్దలకు వుంటే ఈ యుద్ధాలు, ఈ కల్లోలాలూ లేని ... అంటూ ఒక పిల్లల బహుమతి ప్రదాన కార్యక్రమంలో, మహనీయుడు, పిలలలో పిల్లవాడు, నిన్నటిదాకా గౌరవంగా, గర్వంగా రాష్ట్రపతి పదవిని - నభూతో న భవిష్యతి - అని, డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ గారి తర్వాత, అత్యంత ప్రతిభావంతంగా, ప్రేరణాత్మకంగా, నిర్వహించిన వ్యక్తి - డా. అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేసుకోవాలసిన శుభతరుణం ఈ రోజు కాక వేరే ఏముంటుంది? కల్లకపటం, అసూయ, ద్వేషం, రెండర్ధాల మాటలూ ఇవేవి తెలియని దేవుని ప్రతిరూపాలు బాలలు. అందుకే, 'పెద్దలు దేవుని వెదుక్కొంటూ గుడికి వెళితే ఆయన బయట పిల్లలతో ఆడుకుంటూ వుంటారూ అంటూ గుడిలోని ప్రభువును నడివీధిలోకి తెచ్చి పిల్లలతో బిళ్ళంగోడో, దాగుడుమూత దండాకోరో ఆడించారు - గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్. బాల్యం ఓ మరపురాని మధురానుభూతి. బాల్యం ఓ అందమైన కల. బాల్యం ఓ వరం. ఈ దశలో 'మనం మన బిడ్డలకు ఇవ్వగలిగినవి రెండేరెండు బహుమతులు. ఒకటి వేళ్ళు, రెండు రెక్కలు. (కార్టర్ రూట్స్). ఈ లోకాన్ని చూసి, అర్ధమయ్యీ, అర్ధం కాక తనతో దోబూచులాడే ఈ మహాఛ్ఛాయల్లోని ఇంద్రజాలానికి అధ్బుతపడి, దాన్నంతా తనలోకి తీసుకోవాలని చూసే పసిబిడ్డ ఆతౄతని ఏ కవి జీవించగలడు? (చలం). విషాదం ఏమిటంటే, మనిషి పెరుగుతూ వుంటే తన బాల్యాన్ని చేజారిపోకుండా పొదివి పట్టుకోలేకపోతున్నాడు. (పాబ్లో పికాసో). పైవి నిగ్గు తేలిన నగ్న సత్యాలు. భారత తొలి ప్రధాని నెహ్రూజీ జయంతి సందర్భంగాను, ఆయన జన్మదినోత్సవాల మధ్య జరిగే బాలలదినోత్సవాల సందర్భంగా, భారతీయ బాలపౌరులను చాచాజీలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుముందుకు దూసుకుపోవాలనీ, రివ్వురివ్వున రెపరెపలాడుతూ, ఎగిరిపోతూండాలనీ, ఆశీస్సులనీ, అభినందనలనీ తెలుగు రథం తెలియపరుస్తూ ... బాలల విద్వత్తుకు మోకరిల్లుతూ ... కొంపెల్ల శర్మ - తెలుగురథం
విశ్వవ్యాప్తంగా పిల్లల సంబరాలు


No comments:
Post a Comment