Tuesday, October 6, 2009

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం - 5 అక్టోబర్

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం - 5 అక్టోబర్




ఆచార్య దేవోభవ!


జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుడు, అతిధిలకు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది మన భారతీయ హైందవ సంస్కౄతి. ఆచార్యుడు, గురువు, ఉపాధ్యాయుడు ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. 'ఆచార్య దేవోభవా అన్న వేద హితోపదేశాన్ని అనుసరించి ప్రతి విద్యార్ధి గురువును దైవంగా భావించాలి. సేవించాలి.



గురువు అంటే ఎవరు ?



"గుశబ్దస్తు అంధకారస్యాత్ రుశబ్దస్తన్నిరోధక:

అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే"



అంటే - 'గూ అను శబ్దానికి అజ్ణానమనియు, 'రూ అను శబ్దానికి విజ్ణానమనియు అర్ధం. విజ్ణానంతో, అజ్ణానాన్ని తొలగించడం చేతనే 'గురూ వనేది సిద్ధించిందని శాస్త్రప్రమాణం. మనం అందరూ చిన్నప్పుటినుంచి ప్రతినిత్యం చదువుకునే శ్లోకం - గురుర్బ్రహ్మ: గురుర్విశ్ణు: గురుర్దేవో మహేశ్వర:, గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై: శ్రీ గురవేనమ:" అన్నది కుడ మన సంస్కౄతీపరంపరకు తార్కాణం. గురువు అంటే - ఉపాధ్యాయుడు, బౄహస్పతి, తండ్రి, కులము పెద్ద, కాపాడువాడు అని శబ్దరత్నాకరం విపులీకరించింది. గురువుల్లో - బాధగురువు, బోధగురువు అనికూడ వర్గీకరించారు. గురువు వ్ద్దకూ, తండ్రి ఇంటికీ, సుహౄజ్జనుల ఇండ్లకూ పిలవకుండానే వెళ్ళవచ్చు అని భాగవతం ఘోషెస్తోంది. అంతేకాదు, గురువుకు పూర్తిగా విధేయుడైవుంటే శిష్యుడు తప్పక విజయం సాధిస్తాడు అని స్వామి వివేకానంద చెప్పారు.



ఉపాధ్యాయుడు



ఉపాధ్యాయుడు అంటే - చదువు చెప్పువాడు అనే సామాన్యార్ధముతో పాటు, వేదమును చదివించువాడు అన్ని నిఘంటుకారుడు వివరణ యివ్వడం జరిగింది. ఉపాధ్యాయి, ఉపాధ్యాయ అని కూడ స్త్రీలింగ భావనలో తెలియజేశారు. ఉపాధ్యాయుడు తానింకా నేర్చుకుంటూ ఉంటే తప్ప యధార్ధంగా చ్దువు చెప్పలేడు, దీపం తాను వెలుగుతూ ఉజ్జ్వలంగా ఉంటేతప్ప మరొక దేపాన్ని వెలింగలేదు.



గురుభక్తి ప్రదర్షన



ఉపాధ్యాయుడు లౌకిక జీవనంలో విద్యార్థి దషలో గురుభక్తికి గురవడం సర్వసహజం. నేటి యాంత్రిక జీవన స్థితిగతులలో పరిపూర్ణతనిచ్చే భక్తితత్వాలు ఐదు విధాలుగా చెప్పబడుతున్నాయి. అవి, మాతౄదేవోభవ, పితౄదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న వేదమంత్రత్రయం, నిత్య ఆరాధనీయులై విశిష్టతని చాటుతున్నాయి. అజ్ౙాన తిమిరాంధస్య జ్ౙానాంజన షలాకయాఅ, చక్షురున్మీలితం యేన, తస్మైష్రీ గురవేనమ: అన్నది ప్రాచీన సూక్తి సర్వులకూ విదితమే. అలాగే, గురవే సర్వలోకానం అన్నది కూడ, సర్వలోకాలకు గురువు, భవరోగములకు వైద్యుడు, సర్వవిద్యులకు నిధి అయిన దక్షిణామూర్తికి వందనం అంటూ గురుస్తుతి ప్రాధాన్యతను వివరిస్తోంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అన్న ష్లోకం ద్వారా జ్ౙాన సౄష్టికర్త, ఆర్తత్రాణుడైన విష్ణువు, అజ్ౙాన తిమిరాన్ని తొలగించే పరమేష్వరుని తనయందు నిలుపుకున్నవాడే గురువు అని తెలుస్తోంది.



మన సంస్కౄతి నేర్పిన గురు-షిష్య సత్సమిత్రుడు - ష్రీరాముడు, ద్రోణాచార్యుడు - అర్జునుడు, సమర్థ రామదాసు - ఛత్రపతి షివాజీ, ష్రీ రామకౄష్ణ పరమహంస - స్వామి వివేకానంద, యిలా ఎన్నో మనకు గోచరిస్తాయి.



గురువును విజ్ౙాన కల్పతరువుగా భావించి, వినయంతో, విధేయతతో సేవించి, మన జీవితాలను సాటివారి జీవితాలను చక్కదిద్దితే ఆ దివ్యగురువులనుండి నేర్చుకున్న విద్యకు సార్థకత లభిస్తుంది. అందుకే మనం ష్రీ గురవే నమ: అని మనం జీవితంలోని తొలిగురువు అయిన ఉపాధ్యాయుని నిత్యం భక్తి విష్వాసాలతో గౌరవించడం, వారి బాటలో ఆచరించుకోవడం, జీవితానికి అర్థం, పరమార్థం సంతరించుకోవడం లో ఉపాధ్యాయుని పాత్రం అమోఘం అని మాత్రం చెప్పవలసివస్తుంది.



అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (అక్టోబర్ 6) సందర్భంగా గురుమూర్తులైన ఉపాధ్యాయులకీ, షిష్యగణం అయిన విద్యార్థులకీ అభినందనలని తెలుగురథం సమర్పించుకుంటోంది.



కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురథం.

No comments: