త్రివేణీకళాసంగమం - బాపిరాజు
శ్రీ బాపిరాజుగారు కవి, గాయకుడు, చిత్రకారుడు. మూడు కళలను ముద్దచేసి ఆయన అద్భుతాలైన గేయాలను రచించారు. గానంలో స్థాయిని ప్రేరేపించి, కవితలో భావాన్ని పోషించి, చిత్రంలో రూపాన్ని నిరూపించిన సంపూర్ణమైన కళాస్వరూపాన్ని తయారుచేశారు. వాక్కునకందని రూపాన్ని చిత్రంలో, చిత్రానికందని భావాన్ని వాక్కులో పట్టి యివ్వగల నేర్పాయనకు సహజసిద్ధం. ఆయన వరద-గోదావరి అద్భుత ఖండకావ్యం. ఆస్వాల్డు కూల్డ్రే దొర అంతేవాసిగా సాహిత్యం, చిత్రకళల్లో ప్రావీణ్యమే కాక ప్రభావాన్ని కూడ అధికంగా పొందారు.
మన బాపిబావ
ప్రముఖగీతం 'బావా బావా పన్నీరూ అన్నపాట స్మరించని తెలుగుగుండె లేనేలేదని చెప్పవచ్చు. ఆ పాట రాసిన తీరు యిలా వుంటుంది.
బావా! బావా! పన్నీరు
"బావా! బావా! పన్నీరు
బావను పట్టుక తన్నేరు
మూడు గుద్దులు గుద్దేరు
మూలన మంచం వేసేరు
ముంతెడు గంజి యిచ్చేరు. బావా
వీధి వీధి తిప్పేరు
వీశెడు గంధం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు బావా
పల్లేరు తెప్పించి పక్క వేయండీ
నల్లేరు తెప్పించి నలిచి విడువండీ
నల్లేరు చేతాను నయము కాకుండీ
దూలగొండి తెచ్చి దులిపి పంపండీ బావా
సన్నిహితులు, తోటి కళాకారులు బాపిరాజుగారిని, బాపిబావ అని ముద్దుగా పిలుచుకోవడంలో వెనుక దాగివున్న రహస్యం - బావా బావా పన్నీరు అని బావలను పట్టించే హాస్య రసగుళిక.
బాపిరాజు జీవనప్రస్థానం
పాత్రికేయుడు, రచయిత, చిత్రకళాకారుడు, గాయకుడు, నాటకకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, వెరసి అడవి బాపిరాజుగారిని బహుముఖప్రతిభాసంపన్నుడు అని ఖచ్చితంగా చెప్పితీరాలి.
కౄష్ణయ్య-సుబ్బమ్మ దంపతులకు 8 అక్టోబర్ 1895 న జన్మించారు. పశ్చిమగోదావరిజిల్లా, భీమవరం లో జన్మించగా, హైస్కూలులో చదివుతోపాటు బి.ఎ. తర్వాత బి.యల్. చదివారు. 1920లో సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం న్యాయవాది వౄత్తిని నిర్వహించారు. యితర రంగాలలో కౄషి చేయాలన్న ఉద్దేశ్యంతో న్యాయవాది వౄత్తిని విరమించారట. బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకత్వం (1934-39), హైదరాబాదు ప్రచురణ - మీజన్ తెలుగు దినపత్రిక కు సంపాదకునిగా, విజయవాడ-ఆకాశవాణి లో కేంద్ర సలహాదారుగా, నవ్యసాహిత్య పరిషత్తుని స్థాపించిన వారిలో ప్రముఖులు, చిత్రకళను అభ్యసించడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ను స్థాపించారు.
బహుముఖ కళాధారణం
1922 లో సహకార నిరాకరణోద్యమంలో ఏడాదిపాటు జైలులో వున్నారు. ఈ కాలపు జైలు అనుభవాలను తమ రచన 'తొలకరీ నవలలో ప్రతిబింబనం చేశారు. జైలులోనే శాతవాహనుల కాలంనాటి కధలను తీసుకుని తమ సుప్రసిద్ధ ఆంధ్ర చారిత్రక నవలను 'హిమబిందూ రచనను ప్రారంభించారు. ఈ ధారావాహికకధనం 1924-25 లో 'శారదా పత్రికలో వెలువడింది అని ఆరుద్రగారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో చెప్పడం కూడ జరిగింది. నూరు అధ్యాయాల నవల అవడం విశేషమే. నవలాకారునిగా బాపిరాజుగారు ఆధునికయుగంలో అజరామరమైన ప్రతిభను ప్రదర్శించారు. కవిగా, చిత్రకారునిగా, కధారచయితగా అందించిన రచనలు జమీందారీయుగంలో లబ్ధప్రతిష్ఠులవడం జరిగింది. ఈ వ్యవధిలో వ్రాసి, ప్రచురణ జరిగిన కధలు - పేరులేని పాప, యుగములనుండి నీకొరకు కనిపెట్టుకొని యుంటిని, నాగరాజు, నరపతి, గుడ్డిపిల్ల కధలు ఆనాటి ప్రముఖప్రచురణలైన, భారతి, ఆంధ్రపత్రిక లో దర్శనం యిచ్చాయి. అంతే కాక, 'అంజలీ, 'రాగమాలికా, 'తరంగిణీ పేర్లతో బాపిరాజుగారి కధాసంపుటాలు వచ్చాయి.
ఎంకి, కిన్నెరసాని చిత్రణారూపాలు
బాపిరాజుగారిలోని చిత్రకళాకారుడు, ప్రముఖులు నండూరి సుబ్బారావు గారి 'ఎంకిపాటలూ, విశ్వనాధ సత్యనారాయణ గారి 'కిన్నెరసాని పాటలూ అంశాలకు విలువను పెంచేరీతిలో చిత్రాలను ఆనాటి బాపుశైలిలో వేశారు అన్నదాంట్లో సంశయం లేదు. బాపిరాజుగారికి చిన్నవయసునుంచే కవితలు వ్రాసే అభిరుచి వుండేదిట.
బాపిరాజు గారి రచనలు
అడవి బాపిరాజుగారు అన్నవెంటనే, మనకు తెలుగుసాహిత్యంలో, సాహితీరసికులకు వెనువెంటనే స్ఫురించే రచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా నవలలు స్మరణకు రాకమానవు.
నవలలు - నారాయణరావు, తుఫాన్, గోనగన్నారెడ్డి, కోనంగి, హిమబిందు.
నారాయణరావు నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు పురస్కారం లభించింది.
రేడియో నాటికలు - దుక్కిటెద్దులు, ఉషాసుందరి, భోగిరలోయ.
కధలు - తూలికానౄత్యం, హంపీశిధిలాలు, శిల్పబాల, వీణ.
చిత్రదర్శకత్వం వహించినవి - మీరాబాయి, అనసూయ, ధ్రువవిజయం. అన్నీ పౌరణీకాలు అన్నది గమనించదగ్గది.
బాపిరాజుగారి ఎన్నో కధలు, గేయాలు రచించారు. కనడభాషలోకి కూడ అనువాదం చెంది పేరుపొందాయి. తొలకరి, గోధూళి అను పేర పదకవితలను, శశికళ అను పేర పద్యకౄతులను రచించారు.
అడవి బాపిరాజు గారి సాహితీప్రతిభను ఆధునిక యుగపు సాహిత్యంతో అనుసంధానించి, సరియైన విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది అని ఆరుద్ర ప్రగాఢంగా చెప్పారు.
ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయాలు, ప్రయోగాలు లో బాపిరాజు సాహితీ విష్లేషణ
ప్రముఖ కవి డా. సి. నారాయణ రెడ్డిగారు బాపిరాజు గారి సాహిత్యం గురించి కావించిన ప్రస్తావన, విష్లేషణ పరిషీలంచదగ్గది.
భావకవిత్వంలో కవులు రూపొందించుకున్న ఉహాప్రేయసీసౄష్టి 'షషికళాగా బాపిరాజు గారిని కూడ వరించింది అన్నారు. షషికళ పై రెడ్డిగారు సుదీర్ఘ విష్లేషణ కావించారు.
బాపిరాజుగారి స్వప్నమూర్తి సౌందర్యావధియైన షషికళ ఒకవిధముగా ఈ కవికీమె ఇష్టదేవత. భావకవులలో వారి హితులందరికి ఇష్టదేవతలున్నారని, తనబ్రతుకు ష్రుతికలిపి వలపించు చతుర 'షషికళా యని వారే వ్రాసుకొన్నారు. 'ఎండిమియాన్క్'
అను షీర్షిక క్రింద వారు వ్రాసిన గేయములో 'షషికళా' సాక్షాత్కార వౄత్తాంతమున్నది. తమ గురువగు కూల్డ్రే గారితో బాపిరాజుగారు తీర్థయాత్రలు చేయుచుండగా ఒక సంఘటన జరిగిందట. నదిలోయలో, వెన్నెలలో బండమీద మేనువాల్చి నిదురపోవు బాపిరాజుగారి పై ఒకానొక వెన్నెల వెలుగో, అప్సరసయో వ్రాలినది. దానినే కూల్డ్రేగారు చిత్రముగా రచించి 'ఎండిమియాన్క్' అని పేరుపెట్టారట. ఎండిమియాన్ గ్రీకుదేషపు గోపబాలుడు, అతి సుందరుడు, ఒంటరిగా నిద్రించుచున్నప్పుడు ఒక అప్సరస అతనిని ఫ్వలచివచ్చి అతనిపై వ్రాలినదట. ఈ కథను కీట్స్ మున్నగు కాల్పనికకవులు కావ్యరూపమున చిత్రించినారు. బాపిరాజుకు జరిగిన వౄత్తాంతము దీని పోలియుంది. కలలో తనమీద వ్రాలిన ఆ దివ్యసుందరికే, ఆ అపూర్వ సౌందర్యరేఖకే బాపిరాజు గారు 'షషికళా అని పేరు పెట్టుకున్నారు. ఆమె కొరకొక చిన్నలోకాన్ని సౄష్టించుకున్నారు.
చంద్రలోకం తూర్పుదెసలో, సూర్యలోకం పష్చిమంలో, చిన్నిలోకం ఒకటీ ఉన్నదే, ఓనా వెన్నేల చిన్నారి పడుచా పడుచా, ఆ లోకమేలే కన్నెరాణివి నువ్వే నువ్వేనే.
లోకాన పూజాపీఠం అపర్చి, ఆసీనురాలినిజేసి, పట్టంగట్టి, 'నా అమౄతమూర్తిని, ఆత్మమధ్యవు నీవే' అని కీర్తించడం కూడ జరిగింది.
ఆమె ప్రియురాలే కాదు, గురువు, షిష్యురాలు, సూర్యసుత, చంద్రబాల, గానషిల్పచిత్రాదికళామూర్తి. నగలలంకరించని కల, బాణి, వాణి, రాణి.
కొండలుకోనల్లో గాలింపులు, దేవాలయం నిర్మించుకోని ఆమెకొరకు ఎదురుచూపులు, కాని సాక్షాత్కరించలేదు, బ్రతుకు అన్వేషణగా మారింది, భౌతిక రూపబంధాల్ని తెరగా భావించుకున్నాడు, బాపిరాజు.
ధవళమైనదీ, తలపుదాటినది, దానికి మొదలూ చివరాలేనిది, నీకు ఇవతల, నాకు అవతల, తెర ఉన్నాది బాలా - అని బాధపడినాడు.
కాలాన్ని కట్టేసి కాలికిందనురాతు నాలోన నీవు నిత్య యౌవనపు అంటూ ఆమె దివ్యలీలనే సందర్షించినాడు.
బాపిరాజుగారి షషికళ లొ, స్వప్నదర్షనం, దివ్య సౌందర్యం, సంయోగవియోగానుభవాలు, సమస్త కళాప్రసూనమలతో ఆరాధనతో తాదాత్మ్యంఅ చెందిన వైనం మనకు కనిపిస్తుంది.
అడవి బాపిరాజు గారి కావ్యమాల నుండి మచ్చుతునకలు :
గోధూళి నుండి :
1.చెరువుమెట్లు
చకన్ని చిన్నది చుక్కలరాణై
పాటపాడుతూ పడతి నిలిచినది
తెల్లనిచీరా మెల్లని నడకా
మెళ్ళోహారం తెల్లనిపూవులు
చక్కని చిన్నది
బిందె బుజాన సందెనీటికై
చెర్లో కలువలు నల్లనికన్నులు
కంఠమెత్తినదికలచుపాటలవి
పాటలుపాడుతూ పడతి నిలచినది
చెరువు మెట్లపై చెలియ నిలిచినది
బంగరునీటిలో ప్రతిఫలించినది
సందెచీకటిలో చక్షులుకలిసెను
ఎర్రని పడమట ఇంతివెనుకనే
పాటేభామై భామైపాటై
పాటా భామా పడమటిరంగై
బంగరునీరై పొంగెడి ప్రేమై
చెరువుమెట్లపై చిత్రాలైరీ
చక్కని చిన్నది
2. వరద గోదావరి
ఉప్పొంగిపోయింది గోదావరి తాను
తెప్పన్న యెగసింది గోదావరీ
కొండల్లొ ఉరికింది కోనల్లు నిండింది
ఆకాశగంగతో హస్తాలు కలిపింది
ఉప్పొంగి
అడవిచెట్లన్నీని జడలలో తురిమింది
ఊళ్ళు దండలుగుచ్చి మెళ్ళోన తాల్చింది
వడులతో సుడులతో గరువాల నడలతో
పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తువచ్చింది
శంఖాలుపూరించి కిన్నెర్లు మీటించి
శంకరాభరణరాగాలాపకంఠియై
నరమానవుడి పనులు శిరమొగ్గి వణికాయి
కరమెత్తిదీవించి కదలికే నడిచింది
ఉప్పొంగిపోయింది గోదావరి తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
ఉప్పొంగి
కాటూరి వారు అన్నట్లు, అడవి బాపిరాజు గారి ఆత్మ యందలి సౌందర్యబోధయే షశికళ. ఆమె నారాధిస్తూ తన బ్రతుకును, లోకాన్ని సౌందర్యంతో నింపాలనేదే అతని జీవితాషయం.
ఇతర వౄత్తులు
పల్లెవాసుల బ్రతుకులను చిత్రించిన వారిలో బాపిరాజు ముఖ్యులు. గోధూళి అను పాటల సంపుటిలో ఆకుమళ్ళలో పనిచేయు భార్యాభర్తలు (ప్రేయసీప్రియులు) జీవితరేఖలను రమ్యంగా చిత్రించారు.
యెయ్యవేగూడ నా పిల్లా, యెయ్యరోయి గూడ యెయ్యరా ఓ సిన్నిబావా (గూడ వేయడం ఘట్టం).
పాలమ్మపాఆలు తియ్యనిపాలు (గొల్లభామలు), తోటమాలి కూతురు, గౌళ్ళసెల్లాయి కూతురు, గంగిరెద్దులవాడు, ఒంటెద్దుబండివాడు, యిలా ఎన్నో ఉన్నాయి. యెంకి పాటలతో సరిసమంగా ఉంటాయి అనేవి సత్యాలు.
వేయి సంవత్సరాల్క్ వెనకాల కవినోయ్ - అని అనుకున్నా, నిత్య నూతనకవి అడవి బాపిరాజు.
తెలుగుసాహితీకళారంగాన్ని తనదైన ప్రతిభాపాటవాలతో అలరించిన బహుముఖప్రతిభాశాలి - అడవి బాపిరాజుగారు - మన బాపిబావ - 22 సెప్టెంబర్ 1952 న భౌతికలోకాన్ని వీడినా, తెలుగుసాహితీజగతి ఎల్లప్పుడూ ప్రముఖ స్థానాన్నివ్వడమేకాక, దాన్ని భద్రంగా పరిరక్షిస్తోంది అని చెప్పాలి. బాపిరాజుగారి జయంతి సందర్భంగా 'తెలుగురథం' సాహితీ నీరాజనాలను సమర్పిస్తూ ...
కొంపెల్ల షర్మ - అధ్యక్షులు - తెలుగురథం.
No comments:
Post a Comment