Tuesday, June 10, 2008

క్రోధం - ఉపాఖ్యానం

క్రోధోపఖ్యానం
సమాజానికి మంచిని పెంచగలిగే క్రోధం అవసరం - ఓంకారానంద
క్రోధం మొదలైన దుర్గుణాలవల్ల ఉద్రేక, ఉద్వేగ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, వీటిని నియంత్రించేందుకు వివిధ రంగాల్లో అనుభవమున్న పండితుల సలహాలను స్వీకరించి, ఆచరించాల్సిన అవసరం ఎంతైనా వుంది అన్నదాంట్లో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఒకరి యిష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, మానవ జీవితంలో ఉద్రేకాలు ముఖ్యమైన, అనివార్యమైన అంశాలు. క్రోధం, గర్వం, అతివిధేయత, కొన్ని కొన్ని సంధర్భాల్లో కొంతవరకూ అవసరమనిపించవచ్చు. అవసర సమంజసాలతో కూడిన క్రోధం సరిగా అవసరమైన ఉద్రేక, ఉద్వేగాల్ని ప్రసాదిస్తుంది అని అనుభవవేత్తలు చెప్తారు. మానవుల్లో దాగిన క్రోధాది అంత:శతౄవులను ప్రకటింక్ష్చడం ద్వారా, బహిర్గతమైన అవాంఛనీయమైన ఉద్రేకాల్ని ఎదుర్కోవాలి కదా. సందేశ, సలహాలను అవసరమైన మేరకు అందిస్తే, చాలామందిలో క్రోధాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చునేమో. మానవులకు సహజసిద్ధమైన క్రోధాది ఉద్రేకాలను నియంత్రించడం ఎందుకని ప్రతీ ఒక్కరూ ప్రశ్న వేసుకుంటే దీనికి సమాధానం మన భారతీయ స్మౄతి, వేద, పురాణ యితిహాసాదుల్లో సందర్భానుసారంగా వివరించడం జరిగింది. వాటిని ఆధ్యయనం చేయకపోవడమే మనలోని లోపం అని చెప్పాలి.
వేదపర ప్రార్ధన
'మన్యరసి మనయం మహి దేహి ... సహో అసి సహో మయి దేహీ అన్న శ్లోకానికి - 'ఓ భగవంతుడా, క్రోధరూపంలో వున్న నీవు నాకు క్రోధాన్ని ప్రసాదించు. ఓర్పు రూపాన వున్న నీవు నాకు ఓర్పుని ప్రసాదించూ అని అర్ధం.
పరస్పరంగా ఈ రెండు విషయాలు విరుద్ధంగా కనిపించినా, సమయ సందర్భానుసారంగానే క్రోధాన్ని ప్రకటించాలి అన్నది నిజం. కాఆఅని, క్రోధం ప్రశాంతతని, స్వస్థతని, ఆటంకపరచరాదని, ఆధునిక పరిభాషలో చెప్పవలసివస్తే, 'ఒత్తిడీకి బానిస కారాదని మనకు తపోమునులు, ౠషులు ఘోషించిన సారాంశం. క్రోధం వల్ల సమాజంలో మంచి జరిగితే, మరీ మంచిదే కదా, ఆహ్వానించ దగ్గదే అన్నది కూడ సత్యం. పూర్వకాలంలో సమాజ కళ్యాణానికి, దుష్టశిక్షణ, శిష్టరక్షణకీ క్రోధాన్ని వినియోగించడం జరిగింది. మరి యిప్పుడూ, వినాశనానికీ, విధ్వంసానికీ క్రోధం మూలం, బీజం అవుతున్నాయి అన్నది కలియుగపు లక్ష్యలక్షణంగా మారడం దురదౄష్టకర పరిణామంగా మారింది. అవాంఛనీయపు దాడులు జరిగితే, సామంతరాజు క్రోధాత్ముడుగా మారవలసిరావడం, కాని పరిస్థితుల్లో, తాను రాజే అనిపించుకోకపోవడం కూడ చరిత్రచెబుతున్న దాఖలాలు కోకొల్లలు. దేశంలో తాండవిస్తున్న బీదరికం, దారిద్ర్యం, అసమానతలు, వివక్షతలు, విచక్షణాది అసమంజసపు పరిస్థితుల్ని చూసి, ప్రతీ పౌరుడూ క్రోధాన్ని పెంచుకుని, వాటి నిర్మూలనకు వినియోగించే నిమిత్తమే, పూర్వం క్రోధాన్ని వివరించడం జరిగింది. ఈ మహమ్మారి దుష్టశక్తుల్ని పారద్రోలే ప్రయత్నంలో జరిగే కౄషిలో భాగంగా క్రోధం ఆహ్వానించదగ్గదే అని - మహానుభావుడు స్వామి వివేకానంద చెప్పాడు. యిదే శైలిలే, పలువురు పెద్దలు వివరించిన సందర్భాలు కూడ అనేకం. స్వార్ధంతో క్రోధాన్ని ప్రకటించి, లాభాపేక్ష పొందాలని చూస్తే, అటువంటి క్రోధాన్ని సమూలంగా నిర్మూలించడం వినా వేరే మార్గం లేనే లేదు. పాము విషం మందులోకి ఎలా ఉపయోగిస్తున్నామో, అలాగే ఉద్రేమం, దాని విలువ, ప్రకౄత సిద్ధంగా అవసరాన్ని బట్టి వాటి ప్రాధాన్యత గోచరిస్తుంది. కనుక, మన క్రోధ, ఉద్రేకాల్ని చాలా పరిమితుల్లోనే ఆచి, తూచి, ఉపయోగించాలి కదా. మన భారతీయ సనాతన ధర్మ సంస్కౄతిలో తల్లిదండ్రులు, గురువు ద్వారా పసితనాన్నుంచే వ్యక్తిత్వ వికాసానికి దారితీసే సదవకాశం వుందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటూ సదాచారాల్ని పాటిస్తే, క్రోధం మన దరికి వచ్చేందుకు ఎన్ని వేల గుండెలు కావాలి? తల్లిదంద్రులు కూడ వారి సంతానం తెలివితేటల్ని పెంచుకునేందుకు వీలైన పరిసర, వాతావరణాల్లో పెరిగేలా జాగ్రత్తలను తీసుకుంటే, క్రోధం, అందోళన, ఉద్రేకాదులు దరికి చేరవు. మన సంప్రదాయం విశదీకరించిన పద్ధతి ప్రకారం, వ్యక్తి, జ్ౙాన, ఉద్రేకపరంగా, మానవునిలో సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం యివ్వాలి. దేనికైనా, నాణ్యత, ఆలోచనా దిశ, ధోరణులతోపాటు, శ్రద్ధాసక్తులు, భయభక్తులతో, నిరంతర ఆధ్యయన, అభ్యాస ప్రక్రియలను ఆచరించడం చాలా ముఖ్యం. ప్రస్తుత తరంలో, మతపరమైన విషయాల్లో, నిరాసక్తి, విరుద్ధమైన అభిప్రాయాలు కడు మెండుగా చోటుచేసుకుంటున్నాయి అన్నదాంట్లో అతిశయోక్తి లేనేలేదు కదా. సమాజంలోని భాగమైన సాధువులు, స్వామీజీలు, బాబాలు, వీధికొకటి ప్రతీరోజు వెలుస్తున్న తరుణంలో, ఈ సేవావర్గం, వారి భక్తులు, అభిమానులు, మన ఆచారవ్యవహారాలను, సంస్కౄతిని, సంప్రదాయాన్ని, దౄష్టిలో వుంచుకుని, వెల్లివిరుస్తున్న వైరుద్ధ్య, అనాసక్తి ధోరణులను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం కూడ ఎంతైనా వుంది. ఈ దుస్థితిని నివారించేందుకు, విద్యాసేవాసంస్థలు, స్వఛ్ఛందసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర వర్గాలు సంయమనం పాటిస్తూ, తగినన్ని అవాగాహనా కార్యక్రమాలని ఏర్పాటు చేయాలి. యిందుకోసం నిర్వహించే సదస్సులు, సమావేశాలు, ఆధ్యాత్మిక, మత గురువులు, సాహితీవేత్తలు, తత్వవేత్తలు, మానసికవేత్తలాది ప్రముఖులచే సందేహ నివౄత్తులను నివారించే ముమ్మర కార్యక్రమం విరివిగా, నిరంతరం నిర్వహించాలి. పాఠ్యంశాలుగా ప్రవేశపెట్టడం కూడ చెయ్యాలై. యిటువంటి వ్యక్తిత్వా, వికాస కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేవారు, సద్విమర్శలను ప్రకటించవచ్చును కాని, యితర మతపర విశ్వాస భావాల మీద మాత్రం విమర్శలు, దాడులు తగవని కూడ తగు ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
మన నిత్యం అసంకల్ప చర్యగా ప్రకటించే క్రోధం, ఉద్రేకం, ఆందోళనల వెనుక ఉన్న తతంగం యింత వుంది. నిజంగా మరి ఒక ఉపాఖ్యానమే కదా. అందుకనే యిది, క్రోధోపాఖ్యానం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: