ఆంధ్రరత్న దుగ్గిరాల (1889 - 1928 ) జయంతి - జూన్ 2
చీరాల, పేరాల మధ్య దుగ్గిరాల
అసలు పేరు చెప్పనక్కరలేదు; కేవలం ఆంధ్రరత్న అంటే చాలు. రామదండు అని పిలిస్తే, వీరి పేరు వెంటనే స్ఫురిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో ఈయన పేరు లేకపోతే, అది అసంపూర్ణమే అని చెప్పాలి. పన్నుల నిరాకరణోద్యమంలో అకుంఠిత దీక్షతో పాల్గొన్న వ్యక్తి. ఆంధ్ర జానపద కళారీతులను పునరుద్దరించడంలో విశిష్టమైన కౄషి సల్పిన కౄషీవలుడు, సత్యాగ్రహానికి పేరుగాంచిన చీరాల, పేరాల ప్రక్కనే చెప్పుకోదగ్గమనీషి, దుగ్గిరాల అని, ఆయనే, దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు.
బహుముఖ ప్రజ్ణాశాలి గోపాలకౄష్ణుడు
సాహసికుడు, నాయకుడు, వక్త, కవి, కళాపోషకుడు, గాయకుడు, సమరాన్ని నడిపిన సుప్రసిద్ధ వ్యక్తి అయిన దుగ్గిరాల గోపాలకౄష్ణగారు, బ్రాహ్మణ కుటుంబంలోని కోదండరామయ్య-సీతమ్మ పుణ్యదంపతులకు 2 జూన్ 1889 న కౄష్ణజిల్లాలోని పెనుగంచిప్రోలు లో జన్మించారు. దుగ్గిరాల పుట్టిన మూడవ రోజే ఆయనకు దుర్దినం - తల్లిని కోల్పోయారు. మూడవ ఏట తండ్రిని కూడ పోగొట్టుకున్నారు. బాల్యం పినతండ్రి, నాయనమ్మల సాన్నిద్ధ్యంలో జరిగింది. కూచిపూడి, గుంటూరు, బాపట్లలో మెట్రిక్ వరకు అంతంతగా చదివి ఉత్తీర్ణుడైన దుగ్గిరాల, చదువులపర్వంలోనే, జాతీయ నాట్యమండలిని స్థాపించి నాటకం, సంగీతాది కళలకు ప్రాచుర్యం కలిగించే ప్రయత్నంలో సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. 1911లో మిత్రుడు నడింపల్లి నరసింహారావు ప్రోద్బలంతో ఉన్నతచదువు కోసం విదేశాలకు వెళ్ళారు. స్కాట్లాండు లోని ఎడింబర్గ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పట్టా పొందాక, ప్రముఖుడైన ఆనందకుమారస్వామి వద్ద భాగస్వామ్యంతో పనిచేశారు. ప్రముఖ నాట్యశాస్త్రగ్రంథం నందికేశ్వరుని అభినయదర్పణాన్ని సంస్కౄతంనుంచి ఆంగ్లంలోకి 'ది మిర్రర్ ఆఫ్ గెస్చఋ అన్న పేరుతో అనువదాన్ని కేంబ్రిడ్జి-హార్వర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం వారు 1917ల్లో చేసిన ప్రచురణ దుగ్గిరాలవారి కళాప్రతిభకు తార్కాణం.
అధికారం ఆపలేని వాగ్ధాటి
అసలే వక్త; ఆపైన ఆచార్యుడు; రాజమండ్రి శిక్షణా కళాశాలలోను, బండారు జాతీయ కళాశాలలోను ఉపాధ్యాయుడిగా స్వతంత్ర భావాల మూలాన అధికారులతో సయోధ్య లేని కారణంగా మానివేయడం జరిగింది. దుగ్గిరాలవారు, స్వాతంత్ర్యోద్యమంలోకి హుటాహుటిని దూకారు. బ్రిటిష్ ప్రభుత్వంవారు చీరాల, పేరాల మున్సిపాలిటీలను 1919లో ఏకంచేయడం పట్ల నిరసనతో సహకార నిరాకరణోద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమం ఆంధ్ర స్వాతంత్ర్యోద్యమంలో ప్రధానఘట్టంగా మారడం, చీరాల, పేరాలల మధ్య దుగ్గిరాల ను చేర్చడం, అవిభాజ్యత్రివేణీసంగమంగా మారిపోయింది. పన్నుల సహాయ నిరాకరణోద్యమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. చీరాల-పేరాల ప్రజలు మున్సిపల్ పన్నులు కట్ట నిరాకరించి, ఊరు విడచి బయటకు వెళ్ళి కొత్త ఊరే కట్టుకున్నారు.
సాహిత్యం కళలద్వరా ఉద్యమ ప్రచారాలు
1920లో నాగపూరులో జరిగిన కాంగ్రేసు సమావేశం తర్వాత, సమావేశ నిర్ణయాలను తెలియపరచడానికి దుగ్గిరాల విస్తౄతంగా ఆంధ్ర పర్యటన చేశారు. ఈ వాగ్ధాటి పరంపరలో భాగంగా, దుగ్గిరాల ఉపన్యాసాల్ని బరంపురంలో నిషేధించడం, ఆ నిషేధనను ఉల్లఘించినందుకు, ఆయన్ని ఏడాదికాలం జైలులో ఉంచడం జరిగింది. 1921లో బెజవాడలో కాంగ్రేసు కమిటీ సమావేశం ఆనందోత్సాహంతో జరిగింది. దేశంలోని నాయకులందరూ ఆంధ్రదేశానికొచ్చారు. ఆంధ్రప్రముఖులు సరేసరి. దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు చీరాల-పేరాల నుండి అయిదువందలమంది ఎర్రచొక్కాల వారి రామదండును తీసుకొని వచ్చారు. చీరాల-పేరాల సత్యాగ్రహంలో అబ్బూరివంటివారు కుడిభుజంగా దుగ్గిరాలవారితో సన్నిహితంగా, పనిచేయడం, రామదండులో ప్రముఖ సేనాపతిగా అవ్వడం కూడ జరిగింది. దుగ్గిరాలవారి ప్రోద్బలంతోనే అబ్బూరివారు జలియన్వాలాబాగ్ దురంతంపై బుర్రకధను రచించడం, కవితలు ప్రజలను ఉద్భోధించి కార్యోన్ముఖులను చేయగలదన్న సత్యాన్ని గ్రహించడం జరిగింది. పామరులారా, పండితులారా, భారతీయులారా, కామినులారా, వీరకుమారుల కన్నతల్లులారా అన్న సుదీర్ఘమైన రచన ఉత్తేజకరంగా, ప్రయోజనకారిగా, ఉర్రూతలూగించే ప్రభోధాత్మకంగా ఉద్రేకం పుట్టించే ధోరణిలో వుండడం వల్లనే, దాన్ని ప్రభుత్వం నిషేధించింది. రచన అబ్బూరివారిదైనా, ఈ అంశం మాత్రం దుగ్గిరాలకు మరింత పేరుని తెచ్చింది. చీరాల-పేరాల సత్యాగ్రహప్రయత్నం విఫలమని భావించినా, బెజవాడలో ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థాపనకు దారితీయడం ఆనాడు ముఖ్యఘట్టంగా మారింది. 1923 నాగపూరు కాంగ్రేసు మహాసభలకు కార్యదర్శిగా నిర్వహించారు.
'జాతి జీవనాళిక జానపద గీతికా అన్న భావంతో ప్రచారరధసారధ్యం
దుగ్గిరాల మనసా వాచా కర్మణా, జాతిజీవనంలో జానపదధోరణి, కళలు అంతర్భాగం అని నమ్మిన వ్యక్తి. ఆంధ్రదేశసంస్కౄతీపరమైన జానపదకళారీతుల్ని పునరుద్ధరణ చేయడంలో శ్రద్ధాభక్తులను ప్రకటించి, వాటిని ప్రాచుర్యం కలగచేసిన విజ్ణాని. ప్రముఖ అంశాలైన, తోలుబొమ్మలాట, జముకులకధ, బుర్రకధ, వీధినాటకాలు, సాముగారడీలు, గొల్లకలాపం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, శారదకధ, కిన్నెరకధ, కొమ్ముబూరా, జోడుమద్దెల, పల్లెసుద్దులు, తూర్పు భాగోతం, చుట్టుకాముడు, పిచ్చికుంట్లవాళ్ళకధ, సాధనశూరులు, పలనాటివీర విద్యావంతులు లాంటి అనేక జానపదకళాప్రక్రియలకు చేయూతనిచ్చిన జానపదనిర్మాత, జ్ణానపధనిర్వాహకుడు, మన దుగ్గిరాల.
గ్రంధాలయోద్యమ నిర్మాత
దుగ్గిరాల ప్రతిభాసిగలో మరో మరువం, గ్రంధాలయాలపై అత్యంత శ్రద్ధని ప్రకటించడం. ఈ ప్రక్రియలో భాగంగా, సాధన అనే పత్రికను ప్రారంభించడం, ఆంధ్రప్రాంతంలో గ్రంధాలయాల స్థాపనలో ముందడుగు వేసిన వ్యక్తిగా, గ్రంధాలయోద్యమాన్ని కూడ లేవనెత్తిన మహామనీషి.
శ్రీరామదాసు మన దుగ్గిరాల
ఆధ్యాత్మికతను రంగరించుకున్న వాడేకాక, అపర శ్రీరామభక్తుడు, బంటు. శ్రీరామ రచనా నియమ తత్పరుడు. ఈ భావనే, రామదండు ని స్థాపించడం, సేనను నిర్మించడం, స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా రామదండుని జాతీయతాస్వచ్చంద, దేశభక్తి, ఆధ్యాత్మిక సామూహిక సంస్థగా నిర్వహించడం జరిగింది.
ఆంధ్రరత్న దుగ్గిరాల
1921 లో గుంటూరు లో జరిగిన ఒక సమావేశంలో దుగ్గిరాలవారిని ఆంధ్రరత్న బిరుదుతో సత్కరించడం జరిగింది. వేపచేదు విద్యాసంస్థవారు, మన సంస్కౄతిలో భాగంగా నూరుగురు తెలుగు ప్రముఖుల్లో దుగ్గిరాలవారిని చేర్చడంపట్ల వారిప్రతిభాపాటవాలకు ప్రత్యక్ష తార్కాణమే అని చెప్పాలి.
నాలుగుపదుల నాణ్యమైన జీవితం
కాకిలా వందేళ్ళు బతికేకన్నా, హంసలా పదేళ్ళు బతికితే చాలన్నట్లు, దుగ్గిరాలవారు రాశి కన్న వాసితనం తనజీవితంలోనే కాదు, ఆయువులో కూడ జరిగింది. కేవలం నాలుగుపదుల వసంతాలకే ఆయన జీవితం పూర్తయింది. 1928, జూన్ 10 న దుగ్గిరాల దూరతీరాలకు నివాసం మార్చి, ఆంధ్రులకు దూరమయ్యారు. ప్రముఖాంధ్రుల్లో ప్రధమగణంలో వేలు మడవదగ్గ వ్యక్తి మన దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు.
ఆంధ్రచరిత్ర, సంస్కౄతీపరంపర వున్నంత కాలం, దుగ్గిరాల వ్యక్తిని, ఆయన దేశానికి చేసిన సేవలను మరవలేము; మరవకూడదు అన్నభావం, సత్యం, శివం, సుందరం. ఆయన భావాలు నిరంతరం అన్వయించుకోవలసి వస్తూనే వుంటుంది. అదే ఆయనలోని గొప్పతనం. అదే మనకు ఆస్థి, సిరిసంపదలు. ఓం శాంతి:
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
చీరాల, పేరాల మధ్య దుగ్గిరాల
అసలు పేరు చెప్పనక్కరలేదు; కేవలం ఆంధ్రరత్న అంటే చాలు. రామదండు అని పిలిస్తే, వీరి పేరు వెంటనే స్ఫురిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో ఈయన పేరు లేకపోతే, అది అసంపూర్ణమే అని చెప్పాలి. పన్నుల నిరాకరణోద్యమంలో అకుంఠిత దీక్షతో పాల్గొన్న వ్యక్తి. ఆంధ్ర జానపద కళారీతులను పునరుద్దరించడంలో విశిష్టమైన కౄషి సల్పిన కౄషీవలుడు, సత్యాగ్రహానికి పేరుగాంచిన చీరాల, పేరాల ప్రక్కనే చెప్పుకోదగ్గమనీషి, దుగ్గిరాల అని, ఆయనే, దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు.
బహుముఖ ప్రజ్ణాశాలి గోపాలకౄష్ణుడు
సాహసికుడు, నాయకుడు, వక్త, కవి, కళాపోషకుడు, గాయకుడు, సమరాన్ని నడిపిన సుప్రసిద్ధ వ్యక్తి అయిన దుగ్గిరాల గోపాలకౄష్ణగారు, బ్రాహ్మణ కుటుంబంలోని కోదండరామయ్య-సీతమ్మ పుణ్యదంపతులకు 2 జూన్ 1889 న కౄష్ణజిల్లాలోని పెనుగంచిప్రోలు లో జన్మించారు. దుగ్గిరాల పుట్టిన మూడవ రోజే ఆయనకు దుర్దినం - తల్లిని కోల్పోయారు. మూడవ ఏట తండ్రిని కూడ పోగొట్టుకున్నారు. బాల్యం పినతండ్రి, నాయనమ్మల సాన్నిద్ధ్యంలో జరిగింది. కూచిపూడి, గుంటూరు, బాపట్లలో మెట్రిక్ వరకు అంతంతగా చదివి ఉత్తీర్ణుడైన దుగ్గిరాల, చదువులపర్వంలోనే, జాతీయ నాట్యమండలిని స్థాపించి నాటకం, సంగీతాది కళలకు ప్రాచుర్యం కలిగించే ప్రయత్నంలో సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. 1911లో మిత్రుడు నడింపల్లి నరసింహారావు ప్రోద్బలంతో ఉన్నతచదువు కోసం విదేశాలకు వెళ్ళారు. స్కాట్లాండు లోని ఎడింబర్గ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పట్టా పొందాక, ప్రముఖుడైన ఆనందకుమారస్వామి వద్ద భాగస్వామ్యంతో పనిచేశారు. ప్రముఖ నాట్యశాస్త్రగ్రంథం నందికేశ్వరుని అభినయదర్పణాన్ని సంస్కౄతంనుంచి ఆంగ్లంలోకి 'ది మిర్రర్ ఆఫ్ గెస్చఋ అన్న పేరుతో అనువదాన్ని కేంబ్రిడ్జి-హార్వర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం వారు 1917ల్లో చేసిన ప్రచురణ దుగ్గిరాలవారి కళాప్రతిభకు తార్కాణం.
అధికారం ఆపలేని వాగ్ధాటి
అసలే వక్త; ఆపైన ఆచార్యుడు; రాజమండ్రి శిక్షణా కళాశాలలోను, బండారు జాతీయ కళాశాలలోను ఉపాధ్యాయుడిగా స్వతంత్ర భావాల మూలాన అధికారులతో సయోధ్య లేని కారణంగా మానివేయడం జరిగింది. దుగ్గిరాలవారు, స్వాతంత్ర్యోద్యమంలోకి హుటాహుటిని దూకారు. బ్రిటిష్ ప్రభుత్వంవారు చీరాల, పేరాల మున్సిపాలిటీలను 1919లో ఏకంచేయడం పట్ల నిరసనతో సహకార నిరాకరణోద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమం ఆంధ్ర స్వాతంత్ర్యోద్యమంలో ప్రధానఘట్టంగా మారడం, చీరాల, పేరాలల మధ్య దుగ్గిరాల ను చేర్చడం, అవిభాజ్యత్రివేణీసంగమంగా మారిపోయింది. పన్నుల సహాయ నిరాకరణోద్యమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. చీరాల-పేరాల ప్రజలు మున్సిపల్ పన్నులు కట్ట నిరాకరించి, ఊరు విడచి బయటకు వెళ్ళి కొత్త ఊరే కట్టుకున్నారు.
సాహిత్యం కళలద్వరా ఉద్యమ ప్రచారాలు
1920లో నాగపూరులో జరిగిన కాంగ్రేసు సమావేశం తర్వాత, సమావేశ నిర్ణయాలను తెలియపరచడానికి దుగ్గిరాల విస్తౄతంగా ఆంధ్ర పర్యటన చేశారు. ఈ వాగ్ధాటి పరంపరలో భాగంగా, దుగ్గిరాల ఉపన్యాసాల్ని బరంపురంలో నిషేధించడం, ఆ నిషేధనను ఉల్లఘించినందుకు, ఆయన్ని ఏడాదికాలం జైలులో ఉంచడం జరిగింది. 1921లో బెజవాడలో కాంగ్రేసు కమిటీ సమావేశం ఆనందోత్సాహంతో జరిగింది. దేశంలోని నాయకులందరూ ఆంధ్రదేశానికొచ్చారు. ఆంధ్రప్రముఖులు సరేసరి. దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు చీరాల-పేరాల నుండి అయిదువందలమంది ఎర్రచొక్కాల వారి రామదండును తీసుకొని వచ్చారు. చీరాల-పేరాల సత్యాగ్రహంలో అబ్బూరివంటివారు కుడిభుజంగా దుగ్గిరాలవారితో సన్నిహితంగా, పనిచేయడం, రామదండులో ప్రముఖ సేనాపతిగా అవ్వడం కూడ జరిగింది. దుగ్గిరాలవారి ప్రోద్బలంతోనే అబ్బూరివారు జలియన్వాలాబాగ్ దురంతంపై బుర్రకధను రచించడం, కవితలు ప్రజలను ఉద్భోధించి కార్యోన్ముఖులను చేయగలదన్న సత్యాన్ని గ్రహించడం జరిగింది. పామరులారా, పండితులారా, భారతీయులారా, కామినులారా, వీరకుమారుల కన్నతల్లులారా అన్న సుదీర్ఘమైన రచన ఉత్తేజకరంగా, ప్రయోజనకారిగా, ఉర్రూతలూగించే ప్రభోధాత్మకంగా ఉద్రేకం పుట్టించే ధోరణిలో వుండడం వల్లనే, దాన్ని ప్రభుత్వం నిషేధించింది. రచన అబ్బూరివారిదైనా, ఈ అంశం మాత్రం దుగ్గిరాలకు మరింత పేరుని తెచ్చింది. చీరాల-పేరాల సత్యాగ్రహప్రయత్నం విఫలమని భావించినా, బెజవాడలో ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థాపనకు దారితీయడం ఆనాడు ముఖ్యఘట్టంగా మారింది. 1923 నాగపూరు కాంగ్రేసు మహాసభలకు కార్యదర్శిగా నిర్వహించారు.
'జాతి జీవనాళిక జానపద గీతికా అన్న భావంతో ప్రచారరధసారధ్యం
దుగ్గిరాల మనసా వాచా కర్మణా, జాతిజీవనంలో జానపదధోరణి, కళలు అంతర్భాగం అని నమ్మిన వ్యక్తి. ఆంధ్రదేశసంస్కౄతీపరమైన జానపదకళారీతుల్ని పునరుద్ధరణ చేయడంలో శ్రద్ధాభక్తులను ప్రకటించి, వాటిని ప్రాచుర్యం కలగచేసిన విజ్ణాని. ప్రముఖ అంశాలైన, తోలుబొమ్మలాట, జముకులకధ, బుర్రకధ, వీధినాటకాలు, సాముగారడీలు, గొల్లకలాపం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, శారదకధ, కిన్నెరకధ, కొమ్ముబూరా, జోడుమద్దెల, పల్లెసుద్దులు, తూర్పు భాగోతం, చుట్టుకాముడు, పిచ్చికుంట్లవాళ్ళకధ, సాధనశూరులు, పలనాటివీర విద్యావంతులు లాంటి అనేక జానపదకళాప్రక్రియలకు చేయూతనిచ్చిన జానపదనిర్మాత, జ్ణానపధనిర్వాహకుడు, మన దుగ్గిరాల.
గ్రంధాలయోద్యమ నిర్మాత
దుగ్గిరాల ప్రతిభాసిగలో మరో మరువం, గ్రంధాలయాలపై అత్యంత శ్రద్ధని ప్రకటించడం. ఈ ప్రక్రియలో భాగంగా, సాధన అనే పత్రికను ప్రారంభించడం, ఆంధ్రప్రాంతంలో గ్రంధాలయాల స్థాపనలో ముందడుగు వేసిన వ్యక్తిగా, గ్రంధాలయోద్యమాన్ని కూడ లేవనెత్తిన మహామనీషి.
శ్రీరామదాసు మన దుగ్గిరాల
ఆధ్యాత్మికతను రంగరించుకున్న వాడేకాక, అపర శ్రీరామభక్తుడు, బంటు. శ్రీరామ రచనా నియమ తత్పరుడు. ఈ భావనే, రామదండు ని స్థాపించడం, సేనను నిర్మించడం, స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా రామదండుని జాతీయతాస్వచ్చంద, దేశభక్తి, ఆధ్యాత్మిక సామూహిక సంస్థగా నిర్వహించడం జరిగింది.
ఆంధ్రరత్న దుగ్గిరాల
1921 లో గుంటూరు లో జరిగిన ఒక సమావేశంలో దుగ్గిరాలవారిని ఆంధ్రరత్న బిరుదుతో సత్కరించడం జరిగింది. వేపచేదు విద్యాసంస్థవారు, మన సంస్కౄతిలో భాగంగా నూరుగురు తెలుగు ప్రముఖుల్లో దుగ్గిరాలవారిని చేర్చడంపట్ల వారిప్రతిభాపాటవాలకు ప్రత్యక్ష తార్కాణమే అని చెప్పాలి.
నాలుగుపదుల నాణ్యమైన జీవితం
కాకిలా వందేళ్ళు బతికేకన్నా, హంసలా పదేళ్ళు బతికితే చాలన్నట్లు, దుగ్గిరాలవారు రాశి కన్న వాసితనం తనజీవితంలోనే కాదు, ఆయువులో కూడ జరిగింది. కేవలం నాలుగుపదుల వసంతాలకే ఆయన జీవితం పూర్తయింది. 1928, జూన్ 10 న దుగ్గిరాల దూరతీరాలకు నివాసం మార్చి, ఆంధ్రులకు దూరమయ్యారు. ప్రముఖాంధ్రుల్లో ప్రధమగణంలో వేలు మడవదగ్గ వ్యక్తి మన దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు.
ఆంధ్రచరిత్ర, సంస్కౄతీపరంపర వున్నంత కాలం, దుగ్గిరాల వ్యక్తిని, ఆయన దేశానికి చేసిన సేవలను మరవలేము; మరవకూడదు అన్నభావం, సత్యం, శివం, సుందరం. ఆయన భావాలు నిరంతరం అన్వయించుకోవలసి వస్తూనే వుంటుంది. అదే ఆయనలోని గొప్పతనం. అదే మనకు ఆస్థి, సిరిసంపదలు. ఓం శాంతి:
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment