నాడు – ఈనాడు
చరిత్రలో ఫిబ్రవరి
15
·
1564 ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర పితామహుడు
గెలీలియో గెలీలి జయంతి
·
1869 భారతీయ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మృతి
·
1879 మహిళల హక్కులు – అమెరికా రాష్ట్రాల సుప్రీమ్ కోర్టులో,
కేసులపై మహిళా ‘అటర్నీ’లను వాదించేందుకు అనుమతిస్తూ, దేశ అధ్యక్షుడు రూథర్ ఫోర్డ్ బి
హేస్ బిల్లును అమోదించడం జరిగింది.
·
1901 సుప్రసిద్ధ తెలుగు కవి గడియారం వేంకట శేషశాస్త్రి
జయంతి
·
1921 బీహారు నివాసి రాధాకృష్ణ చౌదరి – భారతీయ చారిత్రాత్మక
మరియు మైథిలి రచయిత జననం
·
1946 ‘ENAIC” సాధారణ ప్రయోజనాలకై మొదటి ఎలక్ట్రానిక్
కంప్యూటరును ఫిలడెల్ఫియాలోని ‘పెన్నిసిల్వానియా విశ్వవిద్యాలయంలో అంకితం యివ్వబడింది.
·
1948 సుభద్ర కుమారి చౌహాన్ భారతీయ హిందీ కవయిత్రి మృతి
·
1950 సుప్రసిద్ధ తెలుగు కవులుగా తిరుపతి వేంకట కవుల్లో
ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి మృతి
·
1957 ప్రపంచంలో పొట్టివాడిగా (వామనమూర్తి) ‘గిన్నీస్
రికార్డ్’ ని సాధించుకున్న గుల్ ముహమ్మద్ జననం – గుల్ మహ్మ్మద్ ని 19 జూలై 1990 రోజున
ఢిల్లీలోని రామమనోహర్ లోహియా వైద్యకేంద్రంలో చేసిన పరీక్ష ప్రకారం 1’10.4” (57 సెంటీమీటర్లు) ఎత్తుగా నిర్థారణ;
ఈ రికార్డుని నేపాల్ నివాసి చంద్ర బహదూర్ డంగి 21.5”(54.6 సెంటీమీటర్లు)గా రికార్డుని
అధిగమించాడు.
·
1972 తొలిసారిగా ‘సౌండ్ రికార్డు’లకు అమెరికాలో కాపీరైటు
చట్టం క్రింద భద్రత యివ్వబడింది.
No comments:
Post a Comment