మా సంస్థ 'తెలుగురధం' - సాహిత్య సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ, నిర్వహణలో వ్యావహారిక భాషా ప్రవక్త శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రతీ సంవత్సరం ఆగష్ట్ 29 న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం మన సంస్కృతీ, సంప్రదాయ పరంపరలో భాగంగా కార్యక్రమం తలపెట్టాం. ఈ సందర్భంగా ప్రముఖ కవి, కథకులు, విమర్శకులు, శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి శతజయంతి ఉత్సవాన్ని కూడా అదే రోజు నిర్వహిస్తున్నాము. చిక్కడపల్లి-అశోక్నగర్ లోని నగర కేంద్ర గ్రంథాలయం లోని విశ్వనాథ సమవేశ మందిరం లో 29 ఆగష్ట్ ఆదివారం సా. 6 గం. కు జరుగును. అంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పుర్వాధ్యక్షులు డా. ఎ బి కే ప్రసాద్ ముఖ్యాధ్యక్షులుగా విచ్చేసే సభకు ప్రముఖ కవులు, రచయితలు డా. అద్దంకి శ్రీనివాస్ మరియు శ్రీ విహారి ప్రత్యెక అతిథులుగా, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు మరియు శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారు ఆత్మీయ అతిథులుగా పల్గోమ్తల్రు. ఈ సందర్భంగా హనుమచ్చాస్త్రి గారి కలం నుండి వచ్చిన ప్రసిద్ధ లలితగీతాలను వర్తమాన గాయనీమణులు సుష్మ, సౌమ్య గానం చేస్తారు. తెలుగు భాషా సాహితీ అభిమానులు అందరిని సభలో పాల్గొనమని స్వాగతం పలుకుతున్నాం.
కొంపెల్ల శర్మ, అధ్యక్ష్సులు, తెలుగురధం. 9701731333
No comments:
Post a Comment