'ఏక సంథాగ్రాహి', సంగీత కళా రత్న, మహాకవి
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు (1893 - 1979)
కట్టమంచి - రాళ్ళపల్లి మైత్రీబంథానికి శత వసంతాలు
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు (1893 - 1979)
కట్టమంచి - రాళ్ళపల్లి మైత్రీబంథానికి శత వసంతాలు
కట్టమంచి రామలింగారెడ్డి గారు మరియు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగాల స్నేహబంధం అపారమైనదిగా భావించబడింది. మైసూరు మహారాజా కళాశాలలో తెలుగు పండితులుగా చేర్పించినది కట్టమంచి వారే. శర్మ - రెడ్డి గార్ల మైత్రీబంధం గురించి ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యం గ్రంథంలో 'మైలురాళ్ళూ - దారిదీపాలు' అన్న అధ్యాయంలో యిలా వివరించారు. 1910 లో మైసూరు మొదట వచ్చినప్పుడు రామలింగారెడ్డిగారికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి పరిచయమైంది. అప్పుడు శర్మగారు 1906 నుంచి చామరాజేంద్ర సంస్కృత మహాపాఠశాలలో విద్యార్థి పరకాల యతీంద్రులు కోరిన పుస్తకాలు చదివి రామలింగారెడ్డిగారి ఇంగ్లీషు సాహిత్య మర్యాదలు శర్మగారికి నేర్పితే; శర్మగారు రెడ్డిగారికి సంస్కృత సాహిత్యశాస్త్ర విషయాలు బోధించేవారు. ఇద్దరికీ మైత్రి కుదిరింది. ఇది ఉత్తరోత్తరా ఉభయత్రా ఫలించింది. రెడ్డిగారి స్నేహం వల్ల శర్మగారు నూతన దృక్పథాన్ని అలవర్చుకొన్నారన్నందుకు - 'నా గురువులు' అనే వ్యాసంల, "ప్రాకులాడుతున్న నాకు వారితోడి సహవాసము ఆధునిక ప్రపంచపు తలుపులు తెరచి ఆహ్వానించివది' అని ప్రస్తావించుకొన్న తీరే స్పష్టపరుస్తోంది.రెడ్డిగారి సాహచర్యంలో శర్మగారు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. వావిళ్ళవారు ప్రచురించిన 'వేమన పద్యాలు' గ్రంథానికి శర్మగారిచే రాయించిన పీఠికకు కూడ కట్టమంచివారి చొరవే అని తెలుస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వేమనగారిపై ఉపన్యాసాలను ఏర్పాటు చేయించి, రాళ్ళపల్లి వారితో యిప్పించిన ఘనతకూడ కట్టమంచి వారిదే. ఆంధ్రసాహిత్యంలో స్వతంత్ర ప్రతిభకల ఇద్దరు కవులు వీరిద్దరూ మౌళికమైన విశ్లే షణల ద్వారా తెలుగు విమర్శ సరిహద్దును విస్త్రతం చేసిన ఘనత ఈ కవిమిత్రద్వయానిదే అని చెప్పాలి. కట్టమంచి వారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండివ పదవిని అలంకరించారు.

2 comments:
Sarma garu,
namasthe. Pls give more information and introduction about Kattamanchi varu.
Thanks. It was already published.
Post a Comment