Monday, December 7, 2009

భారత రాజ్యాంగ శిల్పి, "డా. భీం రావ్ రాంజీ అంబేద్కర్" జయంతి

భారత రాజ్యాంగ శిల్పి, 'భారతరత్నా సన్మాన గ్రహీత, "డా. భీం రావ్ రాంజీ అంబేద్కర్" జయంతి
(1891 - 1956)



బహుముఖ ప్రజ్ణాశాలి - భీం రావ్ అంబేద్కర్



మహామేధావి, సంఘసంస్కర్త, న్యాయశాస్త్రవేత్త, భారతరాజ్యాంగ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, అని ప్రఖ్యాత వహించిన వ్యక్తి - డా. భీమ్క్ రావ్ రాం జీ అంబేద్కర్ విశ్వవిదితమైన మహామనీషి. సుప్రసిద్ధ రచయిత 'బెవెర్లి నికొలశ్ డా. అంబేద్కర్ ను భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసలను అందజేYఅడం మరువలేని సంఘటన.



అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ!



ఆంధ్రకవితా పితామహుడు 'అల్లసాని పెద్దనా అన్నట్లు, 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా అన్న భావనకు సత్యరూపాన్ని కలిగిస్తూ, లోకమాన్య బాలగంగాధర తిలక్, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన పుణ్యస్థలి, మహారాష్ట్ర లోని 'రత్నగిరీ జిల్లాలో, 'మందన్ గాడ్' పట్టణానికి చేరువైన 'అంబావాడే' గ్రామంలో - రాంజీ సక్ పాల్ - భీమాబాయి పుణ్య దంపతుల్ని పున్నామ నరకం నుంచి రక్షించిన రోజది, 1891 ఏప్రిల్ 14. మెహర్ కులంలో పుట్టిన భీం రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణ తో పెంచగా, బాలభీం రావ్ ప్రతినిత్యం రామాయణం, భారతం, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలను గానం చేయడం, కుటుంబం యావత్తు శాకాహారాన్ని సేవించడం, బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకౄషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్.



అవమాన, పరాభవాల్ని తెచ్చిన వర్ణ వ్యవస్థ



అస్పౄశ్యులుగా పరిగణింపబడిన 'మెహర్లా కులంలో జన్మించడం పట్ల, బండివాడు చూపిన ఆగ్రహం, అన్నగారు బండి తోలితే, బండివాడు రాజఠీవితో నడచి రావడం, ఆకలిదప్పులతో అలమటిస్తూ వీధికుళాయి నుంచి మంచినీళ్ళని కూడ తాగనివ్వని అమానుషత్వం, భరించలేని అవమానాలకు గురిచేసింది. అందుకే అంబేద్కర్ కులవ్య్వ్వస్థ పై నిష్చితమైన అభిప్రాయాలని నిర్ధారించుకున్నాడు. కులం పునాదుల మీద దేనినీ - జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేమనీ, అలా నిర్మిస్తే అది పగిలి ముక్కవలడం తప్పదని చెప్పాడు. కులంలోని వ్యక్తి ప్రతిభను కులం గుర్తించకపొవడమే కాక, రాజకీయ దాస్యంతో పోలిస్తే, సాంఘిక దాస్యం హీనమైనదీ, నీచమైనదీ అని నొక్కి వక్కాణించాడు.



బొంబాయి - బరోడా ల మధ్య వాసికెక్కిన వ్యక్తిత్వం



సంస్కౄతాన్ని ఆధ్యయనం చేయాలన్న సంకల్పానికి మాయదారి కులం అడ్డు తగిలింది. అయితే పర్షియన్ భాష చదివాడు. ఎల్ఫిష్టన్ హైస్కూలు లో మెట్రిక్యులేషన్, 16వ ఏటనే వివాహం, బరోడా మహారాజు యిచ్చిన 25 రూ. విద్యార్ధి వేతనం 1912 లో బి.ఏ పరీక్షలో నెగ్గేలా చేసిన పట్టభద్రత్వం బరోడా ఆస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించినా, పై చదువులపై పట్టుదల ఉద్యోగాన్ని దూరం చేసింది. చదువు తర్వాత ఖరారుగా దశాబ్దకాలంపాటు ఆస్థానంలో ఉద్యోగం చేయాలన్న నిబంధనతో, 1913 లో రాజప్రోత్సాహంతో కొలంబియా విశ్వవిద్యాలయం లో చేరి, 1915 లో ఎం.ఏ, 1916 లో పి.హెచ్.డి ని సంపాదించాడు. పరిశోధన ఫలితంగా, 'ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా' అన్న పేరుతో సిద్ధాంత ప్రచురణ చాలా ప్రాచుర్యాన్ని అందించింది. 1917 లో డా. అంబేద్కర్ స్వదేశ ప్రవేశం చేయడమే గాక, 27 ఏళ్ళలో, అస్పౄశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్భాలవారికి ఆశ్చ్యర్యానందానుభూతుల్ని కలిగించింది. ఫలితంగా మహారాజావారికి మిలిటరీ కార్యదర్షిగా గుర్తింపు కల్గినా, ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారట! కొళాపూర్ మహారాజు సహాయంతో, 'మూక నాయక్' పక్షపత్రికకు సంపాదకత్వం హహించడం.

- బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి, లండన్ నుంచి డి.ఎస్.సి పట్టాలను పొందినా, ఆఫీస్ జవానుల ఆదరాన్ని కూడ పొందలేని దుర్భరస్థితిగతులు.



బాబాసాహెబ్ జీవితంలో 1927 లో జరిగిన ప్రధాన ఘట్టాలు



- మహద్ లో దళిత జాతుల మహాసభ జరగ్గా, మహద్ చెరువులోని నీరు త్రాగుటకు అంతవరకు ప్రవేశం లేని పరిస్థితి నుంచి, అంబేద్కర్ నాయకత్వంలో మహారాష్ట్ర, గుజరాత్ ల నుంచి వచ్చిన వేలాదిమంది చెరువునీరు స్వీకరించడం మహారాష్ట్రలో సంచలనాన్ని కలిగించింది.

- 'బహిష్కౄత భారతీ మరాఠి పక్ష పత్రిక ద్వారా ఆనాడు కులతత్వవాదుల బాధను ప్రకటించాడు.

- చత్రపతి శివాజి త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా అధ్బుతంగా జరగ్గా, అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించబడడం, ఉత్సవ సంఘాధ్యక్షుడైన పలాయ్తశాస్త్రి తన ప్రసంగం లో, 'పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పౄశ్యతను పాటించడమే' అన్న భావం అందరినీ ఆలోచింపజేసింది.

- 'మనుస్మౄతీ పై తనభావాలను నిష్కర్షగా చెప్పినా, ఆ సంపుటిలో అన్ని భాగాలు నిందనీయాలు కావు అని కూడ చెప్పగలిగిన సుస్ఫష్టభావకుడు అంబేద్కర్.



గాంధీ తో చెప్పిన నిశ్చితాభిప్రాయాలు



1931 లో రెండవ రౌండ్ టేబిల్ సమావేశం సందర్భంగా, అంబేద్కర్ గాంధీని కలుసుకోవడం, జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించడం, గాంధీజీ తో 'మహాత్ములు వస్తుంటారు, పోతుంటారు, అంటరానివారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారూ అన్నారు.



'అస్పౄశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కూ



అస్పౄశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం, 'అస్పౄశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కూ అన్న తిలక్ సంకల్పం మాదిరి నిరంతరం పోరాటం సాగించాడు బాబాసాహెబ్. నిరంతర కౄషి తో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు, ముఖ్యంగా సామాజిక సంస్కరణలకు, ఊపిరిపోసుకుంది.



భారత రాజ్యాంగ శిల్పకారత్వం



భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించడం ఆయన శేషజీవితంలో ప్రముఖమైన ఘట్టం. ఈ విషయంపై, ఆనాటి కేంద్రమంత్రి టి.టి.కౄష్ణమాచారి మాట్లాడుతూ, 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన అత్యధిక సభ్యుల్లో అందుబాటులో లేకపోయిన కారణంగా, భారత రాజ్యాంగ రచనా భారమంతా డా. అంబేద్కర్ మోయవలచి వచ్చిందని, రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదూ అని అమోఘమైన విశ్వాసాన్ని ప్రకటించడం, బాబాసాహెబ్ ప్రతిభాపాటవాల్ని చెప్పకనే చెప్పినాడు.



అన్నీ ప్రత్యేకతలే - అంబేద్కర్ జీవితంలో!



అంబేద్కర్ 56వ ఏటన సారస్వత బ్రాహ్మణ కుటుంబంలోని కుమారి శారదా కబీర్ ను వివాహమాడడం, నాగపూరు లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ, 'బౌద్ధం భారతీయ సంస్కౄతిలో భాగం' అని, ఈ దేశ చరిత్ర సంస్కౄతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. దీనివల్ల, హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు!.



బాబాసాహెబ్ బహురంగ రచనలు



అనేక రచనలను అందించిన అంబేద్కర్ - 'ది ప్రోబ్లెం ఆఫ్ రుపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా', 'ది బుద్ధా అండ్ కార్ల్ మార్క్శ్, 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మా, ప్రముఖ రచనలని చెప్పాలి.



మరువలేని జీవిత మలుపులు



భారతరాజ్యాంగం ఏ మలుపులు తిరిగినా, అది వున్నంతకాలం, బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరిస్తూవుండడం వినా వేరే గత్యంతరం లేదు భారతదేశ ప్రజలకు. భారతరాజ్యాంగం లో పొందుపరచబడిన 'భారతీయ షెడ్యూలు కుల జాతుల అభివౄద్ధీఅంశాలపై ప్రత్యేక ప్రేరణ, ప్రోత్సాహం, అంబేద్కర్ దే గణనీయమైంది. 1925 లో బోంబే హైకోర్టు లో న్యాయవాద వౄత్తి, 1926 - 34 మధ్య బోంబే విధాన కౌన్సిల్ కు ప్రకటించబడిన సభ్యత్వం, 1942 - 46 మధ్య వైశ్రాయి నిర్వాహకవర్గ సభ్యుడుగా, 1947 - 51 మధ్య న్యాయశాఖ మంత్రిగా, ప్రముఖ పదవులు. మహోన్నత ఆశయాలని మనసా వాచా కర్మణా ఆచరించిన అంబేద్కర్ ని కొన్ని స్వార్ధపూరిత కూటమితో, కొన్ని రాజకీయపక్షాలు అంబేద్కర్ ఆశయాలకు వక్రభాష్యం చేసి తమ పబ్బాలను గడుపుకోవడం నేటికి జరుగుతున్న దారుణసత్యం. సామాజిక న్యాయం, భారతీయ ప్రజల్లో వర్గీకరింపబడిన వర్ణవ్యవస్థ, ఆయన ఆశయాలకు దర్పణాలుగా ప్రతిబింబించకపోవడం చాలా శోచనీయం, దురదౄష్టకరం అనే చెప్పాలి. అంబేద్కర్ ప్రతిభను, నాలుగు దశాబ్దాలకాలం తర్వాతనే భారతదేశం గుర్తించి, 'భారతరత్నా (1990) సత్కారం అందించడం పట్ల, చివరికైనా న్యాయం జరిగిందనడంలో సందేహం లేదు. 1956 డిసెంబర్ 6 న కన్నుమూశారు.



కొంపెల్ల శర్మ

1 comment:

gaddeswarup said...

This year Columia University announced Amedkar Sanskrit Fellowship for postgraduate sudies in Sanskrit. It seems that Ambedkar advocated Sanskrit as a (the?) national language for India.