సాహిత్యానికి సంగీతం ద్వారా న్యాయం జరిగితీరాలి - నేదునూరి కౄష్ణమూర్తి
సంగీత సాహిత్యాలు అవిభాజ్యాలు 'శాస్త్రం-కళ సన్మిశ్రమం చెందాలి. శాస్త్రాన్ని భాగా ఆధ్యయనం చేయాలి. కళని ప్రస్తుతించాలి. సంగీతకళకి కూడ ఈ విధి, విధానం వర్తిస్తుంది. నిజాయితీ పరుడైన సంగీత కళాకారుడు, వాగ్గేయకారుడి సందేశాన్ని అందజేస్తూ, సంగీతకళాకారుడు, వాగ్గేయకారుడి సందేశాన్ని అందజేస్తూ, సంగీతంతో బాటు సాహిత్యానికి కూడ న్యాయం చేకూర్చేందుకు నిష్కళంక, నిస్స్వార్ధకౄషి, ప్రయత్నం, ప్రభావితమైనట్లు చేయాలి. సంగీతం ఒక రకమైన భారాన్ని అందజేస్తూ,లోతుకి తీసుకుని వెళ్ళి, హౄదయాంతరాళాల్ని స్పౄజించాలి. కేవలం 'గమకం' ద్వారానే కర్ణాటక సంప్రదాయ సంగీతం యొక్క ఈ రెండు లక్ష్యాల్ని సాధించగలం'. సరిగ్గా, పుష్కరకాలం క్రితం, ప్రముఖ సంగీతం విద్వాంసులు - శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారు వెలిబుచ్చిన అభిప్రాయ, సందేశసారం. గురుకుల సంప్రదాయంలో సంగీతశిక్షణ భారతీయ విద్యావ్యవస్థలో గురుకుల సంప్రాదాయం, గురుశిష్యుల అవినాభావసంబంధం - ఎక్కువ మేరకు సంప్రదాయ సంగీత కళలో కూడ ప్రవేశించింది. యిది, గురువుకి, శిష్యుడికి కూడ అధ్బుత ప్రభావ, ప్రేరణలను కలుగజేసింది అనే చెప్పాలి. సంప్రదాయ సంగీతకళాజగతికి వయోవౄద్ధులు, గురువౄద్ధులు అయిన శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారికి ప్రత్యేకస్థానం ఉంది అని వేరే పరచయం చేయవలసిన అవసరం లేదు, రాదు. నేదునూరి వారి జీవనతరంగం బాల్యంలోనే సంగీతకళాభ్యాసం ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు,విజయలక్ష్మిలకు 10 అక్టోబర్ 1927 న నేదునూరి కౄష్ణమూర్తి జన్మించారు. బాల్యంలో మాతౄమూర్తి మధుర సంగీత నాదఝరి, వీనులవిందు కలుగజేసేది అని చెప్పుతూ, మధురగాత్ర సంగీత విద్వన్మణి కనుకనే, ఆమె అభ్యాసం, శిక్షణలను అందించిన, స్వీకరించిన తీరు, మంచి పునాది అయిందని తరచు చెప్పడం జరుగుతూంది. తల్లితోపాటు, మేనమామ నుంచి సంగీత వారసత్వం పుణికిపుచ్చుకున్న ప్రతిభామూర్తి. ఒక పద్ధతి ప్రకారం సంగీతాభ్యాసం నోచుకోని నేదునూరికి ఆధ్యాత్మ రామాయణంతోపాటు ప్రముఖ సాహిత్యమంతా, యింటి వద్దనే అందుకుని మెలకువలను పొందారు. 'ద్వారం' వారి శిష్యరికంలో - వాయులీనం నుంచి గాత్రసంగీతం పదమూడేళ్ళ ప్రాయంలో, కుటుంబ స్నేహితుడి ప్రమేయంతో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో, ప్రముఖ వాయులీనసంగీతంలో ప్రతిభను పొందాలన్న కోరిక తీరకుండా, గుర్తింపు పొందిన గాత్రధోరణి మూలాన, గాత్రసంగీతంలోనే శిక్షణ పొందడం మేలన్న ఆచార్యుల సలహాలనే ఆనాడు పాటించారు. ద్వారం నరసింహారావు, వైలన్ ఆచార్య విద్వాంసులు వాదనం చేస్తూంటే, నేదునూరివారు గాత్ర సంగీతం ఆలపించేవారట. నాలుగేళ్ళ శిక్షణ పిదప కూడ, ఆచార్యుల సలహా అదేనని, గాత్ర సంగీత రంగాన్ని మాత్రం వదలవద్దని సలహా చెప్పడం జరిగిందన్నారు. 1942 లో ప్రారంభమైన సంగీత - వాయులీనం, గాత్రం లో - శిక్షణ ప్రారంభం కాగా, 1945 లో గాత్రసంగీత కచేరేని యివ్వడం జరిగింది. యాదౄఛ్ఛికంగా శ్రీకారం పలికిన సంగీత కార్యక్రమం అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అన్న కవివాక్కులా, కాకినాడ లో సరస్వతీ గానసభ నిర్వాహకులు, ప్రకటించిన మహాలింగంగారి వాయులీనసంగీత కార్యక్రమం జరగడంలో జరుగున్న తీవ్ర జాప్యం వల్ల, చాల ఆందోళనతో పచార్లు చేస్తున్న తరుణంలో. సంగీతససికసభలో కనిపించిన నేదునూరివారిని నిలయవిద్వాంసునిగా ఉపయోగించుకోవలన్న భావన తట్టడం, వెంటనే, నేదునూరిని నేరుగా వేదికపైకి నెట్టడం తౄటికాలంలో జరిగిపోయాయి. ఫలితంగా, నేదునూరివారి ఆనాడు సరస్వతీసభని, సంగీతసరస్వతిని ఆనందంలో ముంచెత్తారు. ఆయన ప్రతిభావంతమైన గళసంపదతో, అధ్బుతప్రతిభను ప్రదర్శించి, అందరి ప్రశంసల్ని, మన్ననల్ని, తొలికచేరీలోనే సంపాదించడం అసామాన్యం. సంగీతజగతిలో మరొక విశిష్ట కళాకారుడు ఉదయించాడు. ఆయనే - నేదునూరి కౄష్ణమూర్తిగారని ముక్తకంఠంతో వరస కలిపారు. పినాకపాణి - గురుబాణి 1949-62 మధ్యకాలంలో డా. శ్రీపాద పినాకపాణి గారి గురుత్వంలో, సంగీతాధ్యయనం, జీవితంలో అధ్బుతమైన, మరపురాని పర్వం అని నిత్యం భావిస్తారు. నేదునూరివారి పట్టుదలను చూసి, విశిష్ట సంగీత విద్వాంసుడుగా గుర్తింపు వచ్చినా కూడ, సంగీతాన్ని మరింతగా అభ్యసించాలన్న కోరికకు పులకించి, పినాకపాణి ఆనందభరితులయ్యారు. అరియకూడి, ముదిగొండ వెంకట్రామయ్యర్ ల విశిష్ట శైలిని అవలోకనం చేసుకుంటూ, సెమ్మనగుడి, జి.యన్.బాలసుబ్రమణ్యన్, అలతూర్ సోదరులు, మధురైమణి అయ్యర్ లాంటి ప్రముఖుల ప్రత్యేక పరంపరను అవగతం చేసుకుంటూ, తన ప్రస్థానాన్ని నిర్మించుకోవడం జరిగింది అన్నది సంగీత కళాప్రపంచం వెల్లడించిన వాస్తవం. పినాకపాణి అభ్యాసశైలిని వివరిస్తూ, రాగాన్ని ఆలాపించి, సంచార సంగతులను ప్రారంభిస్తూ, మనోధర్మరీతిని ముందుకు సాగమని సర్వదా సలహాలను అందుకునే విధానం ప్రభావితం చేసిందంటారు. ఈ పద్ధతిని పదేపదే పునరావౄతం చేయడం పట్ల, సంగీతజ్ణానం సుస్థిరమై నిలచిందని అభిప్రాయపడ్డారు. తొలిదశలో, క్రమం తప్పకుండ రోజుకు కనీసం ఆరు గంటలు అభ్యాసం చేసినది, క్రమేపీ, రెండుకి తగ్గిపోయిందని చెబుతూ, సంగీతాన్ని నేర్పడం కూడ శిక్షణ కిందే వస్తుందంటూ, ఒక విద్యార్ధిగా తన అనుభూతిని సవినయంగా ప్రకటించిన సందర్భాలు అనేకం. డా. పినాకపాణి 'గమ, రవై'ల మిశ్రమ సమన్వయంతో, 'అరియకుడీ శైలిలో గానం చేసేవారని, నేదునూరి వారు ప్రభావితమైన అంశంగా చెబుతూంటారు. నేదునూరివారికి ప్రముఖ వైలన్ విద్వాంసులు, లాల్గుడి జయరామన్ తో ఉభయతారకమైన జూగల్బండి కచేరీలు అనేక సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగి, ఎవరికివారు తమతమ ప్రతిభకు సానపెట్టుకున్నారు. 1951 లో శ్రీకారం చుట్టబడిన ద్వివిన్యాసం బలవర్ధకమైంది. జయరామన్ నేదునూరి దగ్గరకు వచ్చి, మీకే భగస్వామ్యం వహిస్తాను అని చెప్పడం మరువలేని భావన. ఒకసారి లాల్గుడివారు తన అనుభవాన్ని చెబుతూ, చెన్నైలో శ్రీకౄష్ణ గానసభలో జరుగుతున్న కచేరీలో, అతివిస్తారంగా ప్రదర్శించిన 'కాపీరాగం' పూర్తయ్యాక, సంప్రదాయబద్ధంగా వైలన్ విద్వాంసుడు రాగాన్ని కొనసాగించవలసిన దానికి బదులుగా, పొడిగించడానికి నిరాకరించడమే కాక, సభానంతరం, లాల్గుడివారు, నేదునూరివారు రాగ సంపూర్ణత్వాన్ని అందించాక, కొనసాగించడానికి ఏమీ మిగలలేదు అని చెప్పడం సాటి కళాకారుని ప్రతిభను అసూయరహితంగా ప్రకటించడం ఉద్దండులకే సాధ్యం. అన్నమాచార్య సంకీర్తనలకు అష్టోత్తర స్వరరచనలు నేదునూరి కౄష్ణమూర్తిగారు శ్రీ వెంకటేశ్వర కళాశాలలో వున్నప్పుడు, అనేక అన్నమాచార్య కీర్తనలకు స్వరరచనను చేసిన సంగతి సంగీతరసికులకు విదితమే. ఆయన స్వరపరచిన ఎన్నో కీర్తనలు చాలా ప్రఖ్యాతమయ్యాయి. ఒకసారి, సంగీతవిదుషీమణి ఎమ.ఎస్.సుబ్బలక్ష్మిగారు నేదునూరివారు రేవతీరాగంలో 'నానాటి బతుకు నాటకమూ అన్న కీర్తనను విని, ఈ ఒక్క కీర్తన చాలు, మీకు సంగీతకళానిధి సత్కారానికి అర్హతకు చాలు అన్న మాటలు వర్ణనాతీతాలు. ఈ భావనకు ప్రతిస్పందనలో, నేను స్వరపరచిన అన్నమాచార్య కీర్తనలు మీ గాత్రంతోనే ప్రఖ్యాతమయ్యాయి అని చెప్పడం కూడ సంతోషదాయకం. ఈ విద్వత్తుని గమనించి, గుర్తింపుగా తిరుమల-తిరుపతి దేవస్థానంవారు నేదునూరి వారిని ఆస్థానవిద్వాంసులుగా నియమించడమే కాక, ఆయన స్వరపరచిన కీర్తనలను ప్రచురించడం కూడ జరిగింది. మొత్తానికి, 900 కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు నేదునూరివారు, వారి పరంపర స్వరపరచడం జరగడం హర్షనీయమైన సంగతి. తంబుర, వేదిక తన్మయపరుస్తాయి సంప్రదాయానికి నిదర్శనం, రాజీలేని రాగధోరణుల్ని నిత్యం పాటించే నేదునూరివారు ఎన్నుకున్న శైలికి ఎన్నడూ మరోలా ప్రదర్శించకపోగా, సంగీతంపట్ల నిశ్చితమైన అభిప్రాయాలను ప్రకటించేవారు. అవకాశాలను ఎందరో పొందుతున్నా, సుశిక్షితులైనా, స్వరాలాపనలో రాగసౌరభాల్ని ప్రకటించలేకపోతున్నందుకు కారణం ఏమిటన్న ప్రశ్నకు, నేదునూరివారు సమాధానంగా - ఆయన అనుసరించే విధానాన్ని వివరిస్తూ - వేదికనాక్రమించిన క్షణం తంబూరాస్వరసహితమైన సమ్మోహనం ఆవరిస్తుందని, తన్మయుడిగా మారిపోతాన్నారు. తాను రసికులముందు మాత్రమే కచేరీని ప్రస్తుతిస్తానని, కేవలం వారికొరకే పాడడం జరగదని చెప్పారు. వౄత్తిలో భాగంగా భౄతిని స్వీకరించినా, సంగీతకళను స్వప్రయోజనాలకై ఎన్నడూ వినియోగించలేదన్నారు. అష్టపదింతల వసంతాల జీవనం - షష్టిపూర్తి చేసుకున్న సంగీతకళాజీవనం క్రితం సంవత్సరం, చెన్నై సంగీత మహాసభల్లో, 80 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా, నేదునూరివారికి జరిగిన సన్మాన, సత్కార కార్యక్రమం. ఏ ఆంధ్రసంగీతకళాకారుడికి జరగలేదన్నది నగ్నసత్యం. సంగీతప్రస్థానానికి షష్టిపూర్తి జరుపుకోవడం కూడ ప్రత్యేకతే. ప్రముఖులు, నేదునూరివారికి అత్యంత సన్నిహితులు, సంగీతరసికులు, సద్గురు కందుకూరి శివానందమూర్తిగారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకి మరింత శోభను, నిండుతనాన్ని చేకూర్చాయి. ఆ సందర్భంగా, నేదునూరివారి గురువుగారు శ్రీపాద పినాకపాణిగారు 94 ఏళ్ళ ప్రాయంలోకూడ సంగీతమే ఊపిరిగా గడపుతున్నవారు పంపించిన సందేశం కూడ ఉత్సవాలకి నిండుతనం చేకూర్చాయి. డా.మంగళంపల్లి బాలమురళీకౄష్ణగారు గతానుభవాన్ని వివరిస్తూ, నేదునూరివారి కచేరీకి తాను వైలన్ వాద్య సహకారాన్నందించడం మరువరాని అనుభూతిని వివరిస్తూ, నేదునూరివారు శతాయుష్కులవుతారని ప్రకటించారు. అగణిత సత్కారాలు, పురస్కారాలు సంగీత చూడామణి, సంగీత కళాసాగర, స్వరవిలాస్, నాదసుధ, గానకళానిధి, భారత ప్రభుత్వపు సంగీత నాటక అకాడమీ పురస్కారం, సప్తగిరి సంగీత విద్వన్మణి, సంగీత కళాసాగర, శ్రీ కళాప్రపూర్ణ, సంగీతకళానిధి, అన్నమాచార్య విద్వన్మణి, నాదనిధి, సంగీత రత్నాకర, స్వరనిధి, సంగీతసామ్రాట్, రాజలక్ష్మీ పురస్కారం, సంగీత విద్యానిధి, యివికాక, మాటల్లో చెప్పలేని సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, ఎన్నో, మరెన్నో. ఈ పైన సమర్పించే సత్కారాలకు పేర్లను వెదుక్కునే పరిస్థితి, మన నేదునూరివారి విషయంలో, రాక తప్పదు. శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారి పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు భగవంతుడు చిరాయువుని, సుసంపన్నతని, పుష్కళమైన అరోగ్యాన్ని అందించాలని, మరింతగా కళాప్రతిభతోపాటు, సరిసములైన ప్రశిష్యులను వౄద్ధిపరుస్తారని ప్రార్ధిస్తూ, ఆ కళామతల్లి సాన్నిధ్యంలో, ఆశీర్వదించాలని, ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ సందర్భంగా తెలుగురథం మనసారా ఆశీర్వదించమని కోరుకుంటూ, పుట్టినరోజు శుభాకాంక్షలను స్వీకరించమని కోరుకుంటూ ... సెలవు. కొంపెల్ల శర్మ - తెలుగురథం.
సంగీత సాహిత్యాలు అవిభాజ్యాలు 'శాస్త్రం-కళ సన్మిశ్రమం చెందాలి. శాస్త్రాన్ని భాగా ఆధ్యయనం చేయాలి. కళని ప్రస్తుతించాలి. సంగీతకళకి కూడ ఈ విధి, విధానం వర్తిస్తుంది. నిజాయితీ పరుడైన సంగీత కళాకారుడు, వాగ్గేయకారుడి సందేశాన్ని అందజేస్తూ, సంగీతకళాకారుడు, వాగ్గేయకారుడి సందేశాన్ని అందజేస్తూ, సంగీతంతో బాటు సాహిత్యానికి కూడ న్యాయం చేకూర్చేందుకు నిష్కళంక, నిస్స్వార్ధకౄషి, ప్రయత్నం, ప్రభావితమైనట్లు చేయాలి. సంగీతం ఒక రకమైన భారాన్ని అందజేస్తూ,లోతుకి తీసుకుని వెళ్ళి, హౄదయాంతరాళాల్ని స్పౄజించాలి. కేవలం 'గమకం' ద్వారానే కర్ణాటక సంప్రదాయ సంగీతం యొక్క ఈ రెండు లక్ష్యాల్ని సాధించగలం'. సరిగ్గా, పుష్కరకాలం క్రితం, ప్రముఖ సంగీతం విద్వాంసులు - శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారు వెలిబుచ్చిన అభిప్రాయ, సందేశసారం. గురుకుల సంప్రదాయంలో సంగీతశిక్షణ భారతీయ విద్యావ్యవస్థలో గురుకుల సంప్రాదాయం, గురుశిష్యుల అవినాభావసంబంధం - ఎక్కువ మేరకు సంప్రదాయ సంగీత కళలో కూడ ప్రవేశించింది. యిది, గురువుకి, శిష్యుడికి కూడ అధ్బుత ప్రభావ, ప్రేరణలను కలుగజేసింది అనే చెప్పాలి. సంప్రదాయ సంగీతకళాజగతికి వయోవౄద్ధులు, గురువౄద్ధులు అయిన శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారికి ప్రత్యేకస్థానం ఉంది అని వేరే పరచయం చేయవలసిన అవసరం లేదు, రాదు. నేదునూరి వారి జీవనతరంగం బాల్యంలోనే సంగీతకళాభ్యాసం ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు,విజయలక్ష్మిలకు 10 అక్టోబర్ 1927 న నేదునూరి కౄష్ణమూర్తి జన్మించారు. బాల్యంలో మాతౄమూర్తి మధుర సంగీత నాదఝరి, వీనులవిందు కలుగజేసేది అని చెప్పుతూ, మధురగాత్ర సంగీత విద్వన్మణి కనుకనే, ఆమె అభ్యాసం, శిక్షణలను అందించిన, స్వీకరించిన తీరు, మంచి పునాది అయిందని తరచు చెప్పడం జరుగుతూంది. తల్లితోపాటు, మేనమామ నుంచి సంగీత వారసత్వం పుణికిపుచ్చుకున్న ప్రతిభామూర్తి. ఒక పద్ధతి ప్రకారం సంగీతాభ్యాసం నోచుకోని నేదునూరికి ఆధ్యాత్మ రామాయణంతోపాటు ప్రముఖ సాహిత్యమంతా, యింటి వద్దనే అందుకుని మెలకువలను పొందారు. 'ద్వారం' వారి శిష్యరికంలో - వాయులీనం నుంచి గాత్రసంగీతం పదమూడేళ్ళ ప్రాయంలో, కుటుంబ స్నేహితుడి ప్రమేయంతో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో, ప్రముఖ వాయులీనసంగీతంలో ప్రతిభను పొందాలన్న కోరిక తీరకుండా, గుర్తింపు పొందిన గాత్రధోరణి మూలాన, గాత్రసంగీతంలోనే శిక్షణ పొందడం మేలన్న ఆచార్యుల సలహాలనే ఆనాడు పాటించారు. ద్వారం నరసింహారావు, వైలన్ ఆచార్య విద్వాంసులు వాదనం చేస్తూంటే, నేదునూరివారు గాత్ర సంగీతం ఆలపించేవారట. నాలుగేళ్ళ శిక్షణ పిదప కూడ, ఆచార్యుల సలహా అదేనని, గాత్ర సంగీత రంగాన్ని మాత్రం వదలవద్దని సలహా చెప్పడం జరిగిందన్నారు. 1942 లో ప్రారంభమైన సంగీత - వాయులీనం, గాత్రం లో - శిక్షణ ప్రారంభం కాగా, 1945 లో గాత్రసంగీత కచేరేని యివ్వడం జరిగింది. యాదౄఛ్ఛికంగా శ్రీకారం పలికిన సంగీత కార్యక్రమం అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అన్న కవివాక్కులా, కాకినాడ లో సరస్వతీ గానసభ నిర్వాహకులు, ప్రకటించిన మహాలింగంగారి వాయులీనసంగీత కార్యక్రమం జరగడంలో జరుగున్న తీవ్ర జాప్యం వల్ల, చాల ఆందోళనతో పచార్లు చేస్తున్న తరుణంలో. సంగీతససికసభలో కనిపించిన నేదునూరివారిని నిలయవిద్వాంసునిగా ఉపయోగించుకోవలన్న భావన తట్టడం, వెంటనే, నేదునూరిని నేరుగా వేదికపైకి నెట్టడం తౄటికాలంలో జరిగిపోయాయి. ఫలితంగా, నేదునూరివారి ఆనాడు సరస్వతీసభని, సంగీతసరస్వతిని ఆనందంలో ముంచెత్తారు. ఆయన ప్రతిభావంతమైన గళసంపదతో, అధ్బుతప్రతిభను ప్రదర్శించి, అందరి ప్రశంసల్ని, మన్ననల్ని, తొలికచేరీలోనే సంపాదించడం అసామాన్యం. సంగీతజగతిలో మరొక విశిష్ట కళాకారుడు ఉదయించాడు. ఆయనే - నేదునూరి కౄష్ణమూర్తిగారని ముక్తకంఠంతో వరస కలిపారు. పినాకపాణి - గురుబాణి 1949-62 మధ్యకాలంలో డా. శ్రీపాద పినాకపాణి గారి గురుత్వంలో, సంగీతాధ్యయనం, జీవితంలో అధ్బుతమైన, మరపురాని పర్వం అని నిత్యం భావిస్తారు. నేదునూరివారి పట్టుదలను చూసి, విశిష్ట సంగీత విద్వాంసుడుగా గుర్తింపు వచ్చినా కూడ, సంగీతాన్ని మరింతగా అభ్యసించాలన్న కోరికకు పులకించి, పినాకపాణి ఆనందభరితులయ్యారు. అరియకూడి, ముదిగొండ వెంకట్రామయ్యర్ ల విశిష్ట శైలిని అవలోకనం చేసుకుంటూ, సెమ్మనగుడి, జి.యన్.బాలసుబ్రమణ్యన్, అలతూర్ సోదరులు, మధురైమణి అయ్యర్ లాంటి ప్రముఖుల ప్రత్యేక పరంపరను అవగతం చేసుకుంటూ, తన ప్రస్థానాన్ని నిర్మించుకోవడం జరిగింది అన్నది సంగీత కళాప్రపంచం వెల్లడించిన వాస్తవం. పినాకపాణి అభ్యాసశైలిని వివరిస్తూ, రాగాన్ని ఆలాపించి, సంచార సంగతులను ప్రారంభిస్తూ, మనోధర్మరీతిని ముందుకు సాగమని సర్వదా సలహాలను అందుకునే విధానం ప్రభావితం చేసిందంటారు. ఈ పద్ధతిని పదేపదే పునరావౄతం చేయడం పట్ల, సంగీతజ్ణానం సుస్థిరమై నిలచిందని అభిప్రాయపడ్డారు. తొలిదశలో, క్రమం తప్పకుండ రోజుకు కనీసం ఆరు గంటలు అభ్యాసం చేసినది, క్రమేపీ, రెండుకి తగ్గిపోయిందని చెబుతూ, సంగీతాన్ని నేర్పడం కూడ శిక్షణ కిందే వస్తుందంటూ, ఒక విద్యార్ధిగా తన అనుభూతిని సవినయంగా ప్రకటించిన సందర్భాలు అనేకం. డా. పినాకపాణి 'గమ, రవై'ల మిశ్రమ సమన్వయంతో, 'అరియకుడీ శైలిలో గానం చేసేవారని, నేదునూరి వారు ప్రభావితమైన అంశంగా చెబుతూంటారు. నేదునూరివారికి ప్రముఖ వైలన్ విద్వాంసులు, లాల్గుడి జయరామన్ తో ఉభయతారకమైన జూగల్బండి కచేరీలు అనేక సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగి, ఎవరికివారు తమతమ ప్రతిభకు సానపెట్టుకున్నారు. 1951 లో శ్రీకారం చుట్టబడిన ద్వివిన్యాసం బలవర్ధకమైంది. జయరామన్ నేదునూరి దగ్గరకు వచ్చి, మీకే భగస్వామ్యం వహిస్తాను అని చెప్పడం మరువలేని భావన. ఒకసారి లాల్గుడివారు తన అనుభవాన్ని చెబుతూ, చెన్నైలో శ్రీకౄష్ణ గానసభలో జరుగుతున్న కచేరీలో, అతివిస్తారంగా ప్రదర్శించిన 'కాపీరాగం' పూర్తయ్యాక, సంప్రదాయబద్ధంగా వైలన్ విద్వాంసుడు రాగాన్ని కొనసాగించవలసిన దానికి బదులుగా, పొడిగించడానికి నిరాకరించడమే కాక, సభానంతరం, లాల్గుడివారు, నేదునూరివారు రాగ సంపూర్ణత్వాన్ని అందించాక, కొనసాగించడానికి ఏమీ మిగలలేదు అని చెప్పడం సాటి కళాకారుని ప్రతిభను అసూయరహితంగా ప్రకటించడం ఉద్దండులకే సాధ్యం. అన్నమాచార్య సంకీర్తనలకు అష్టోత్తర స్వరరచనలు నేదునూరి కౄష్ణమూర్తిగారు శ్రీ వెంకటేశ్వర కళాశాలలో వున్నప్పుడు, అనేక అన్నమాచార్య కీర్తనలకు స్వరరచనను చేసిన సంగతి సంగీతరసికులకు విదితమే. ఆయన స్వరపరచిన ఎన్నో కీర్తనలు చాలా ప్రఖ్యాతమయ్యాయి. ఒకసారి, సంగీతవిదుషీమణి ఎమ.ఎస్.సుబ్బలక్ష్మిగారు నేదునూరివారు రేవతీరాగంలో 'నానాటి బతుకు నాటకమూ అన్న కీర్తనను విని, ఈ ఒక్క కీర్తన చాలు, మీకు సంగీతకళానిధి సత్కారానికి అర్హతకు చాలు అన్న మాటలు వర్ణనాతీతాలు. ఈ భావనకు ప్రతిస్పందనలో, నేను స్వరపరచిన అన్నమాచార్య కీర్తనలు మీ గాత్రంతోనే ప్రఖ్యాతమయ్యాయి అని చెప్పడం కూడ సంతోషదాయకం. ఈ విద్వత్తుని గమనించి, గుర్తింపుగా తిరుమల-తిరుపతి దేవస్థానంవారు నేదునూరి వారిని ఆస్థానవిద్వాంసులుగా నియమించడమే కాక, ఆయన స్వరపరచిన కీర్తనలను ప్రచురించడం కూడ జరిగింది. మొత్తానికి, 900 కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు నేదునూరివారు, వారి పరంపర స్వరపరచడం జరగడం హర్షనీయమైన సంగతి. తంబుర, వేదిక తన్మయపరుస్తాయి సంప్రదాయానికి నిదర్శనం, రాజీలేని రాగధోరణుల్ని నిత్యం పాటించే నేదునూరివారు ఎన్నుకున్న శైలికి ఎన్నడూ మరోలా ప్రదర్శించకపోగా, సంగీతంపట్ల నిశ్చితమైన అభిప్రాయాలను ప్రకటించేవారు. అవకాశాలను ఎందరో పొందుతున్నా, సుశిక్షితులైనా, స్వరాలాపనలో రాగసౌరభాల్ని ప్రకటించలేకపోతున్నందుకు కారణం ఏమిటన్న ప్రశ్నకు, నేదునూరివారు సమాధానంగా - ఆయన అనుసరించే విధానాన్ని వివరిస్తూ - వేదికనాక్రమించిన క్షణం తంబూరాస్వరసహితమైన సమ్మోహనం ఆవరిస్తుందని, తన్మయుడిగా మారిపోతాన్నారు. తాను రసికులముందు మాత్రమే కచేరీని ప్రస్తుతిస్తానని, కేవలం వారికొరకే పాడడం జరగదని చెప్పారు. వౄత్తిలో భాగంగా భౄతిని స్వీకరించినా, సంగీతకళను స్వప్రయోజనాలకై ఎన్నడూ వినియోగించలేదన్నారు. అష్టపదింతల వసంతాల జీవనం - షష్టిపూర్తి చేసుకున్న సంగీతకళాజీవనం క్రితం సంవత్సరం, చెన్నై సంగీత మహాసభల్లో, 80 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా, నేదునూరివారికి జరిగిన సన్మాన, సత్కార కార్యక్రమం. ఏ ఆంధ్రసంగీతకళాకారుడికి జరగలేదన్నది నగ్నసత్యం. సంగీతప్రస్థానానికి షష్టిపూర్తి జరుపుకోవడం కూడ ప్రత్యేకతే. ప్రముఖులు, నేదునూరివారికి అత్యంత సన్నిహితులు, సంగీతరసికులు, సద్గురు కందుకూరి శివానందమూర్తిగారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకి మరింత శోభను, నిండుతనాన్ని చేకూర్చాయి. ఆ సందర్భంగా, నేదునూరివారి గురువుగారు శ్రీపాద పినాకపాణిగారు 94 ఏళ్ళ ప్రాయంలోకూడ సంగీతమే ఊపిరిగా గడపుతున్నవారు పంపించిన సందేశం కూడ ఉత్సవాలకి నిండుతనం చేకూర్చాయి. డా.మంగళంపల్లి బాలమురళీకౄష్ణగారు గతానుభవాన్ని వివరిస్తూ, నేదునూరివారి కచేరీకి తాను వైలన్ వాద్య సహకారాన్నందించడం మరువరాని అనుభూతిని వివరిస్తూ, నేదునూరివారు శతాయుష్కులవుతారని ప్రకటించారు. అగణిత సత్కారాలు, పురస్కారాలు సంగీత చూడామణి, సంగీత కళాసాగర, స్వరవిలాస్, నాదసుధ, గానకళానిధి, భారత ప్రభుత్వపు సంగీత నాటక అకాడమీ పురస్కారం, సప్తగిరి సంగీత విద్వన్మణి, సంగీత కళాసాగర, శ్రీ కళాప్రపూర్ణ, సంగీతకళానిధి, అన్నమాచార్య విద్వన్మణి, నాదనిధి, సంగీత రత్నాకర, స్వరనిధి, సంగీతసామ్రాట్, రాజలక్ష్మీ పురస్కారం, సంగీత విద్యానిధి, యివికాక, మాటల్లో చెప్పలేని సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, ఎన్నో, మరెన్నో. ఈ పైన సమర్పించే సత్కారాలకు పేర్లను వెదుక్కునే పరిస్థితి, మన నేదునూరివారి విషయంలో, రాక తప్పదు. శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారి పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు భగవంతుడు చిరాయువుని, సుసంపన్నతని, పుష్కళమైన అరోగ్యాన్ని అందించాలని, మరింతగా కళాప్రతిభతోపాటు, సరిసములైన ప్రశిష్యులను వౄద్ధిపరుస్తారని ప్రార్ధిస్తూ, ఆ కళామతల్లి సాన్నిధ్యంలో, ఆశీర్వదించాలని, ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ సందర్భంగా తెలుగురథం మనసారా ఆశీర్వదించమని కోరుకుంటూ, పుట్టినరోజు శుభాకాంక్షలను స్వీకరించమని కోరుకుంటూ ... సెలవు. కొంపెల్ల శర్మ - తెలుగురథం.

2 comments:
శర్మ గారు,ఈ మధ్య నేను తీసిన నేదునూరి గారి వీడియో ఒకటి చిన్నది ఈ లింకులో చూడగలరు
http://www.youtube.com/watch?v=c360fY_B-wA
నేదునూరి కృష్ణమూర్తి గారి మనమడు నా స్నేహితుడు కావటం నా అదృష్టం. నేను ఒక్కప్పుడు మొదలుపెట్టిన వేమన బ్లాగుకు తనూ సహకారం అందించాడు. అతని ప్రొఫైల్ ( నేదునూరి కృస్ణమూర్తి గారి మనమడి ) ఇక్కడ
Post a Comment