Friday, November 14, 2008

హేతువాద ప్రచారక 'గోరా' జయంతి


గోరా ( 1902 - 1975 ) జయంతి


భారతీయ నాస్తికవాద నేత, గోరా అని ప్రసిద్ధి చెందిన, గోపరాజు రామచంద్రరావు, 15 నవంబర్ 1902 న ఉన్నతకుల హిందూ కుటుంబంలో జన్మించారు. నాస్తికవాది అన్నవెంటనే, ఈ వ్యాసం చదవడం మానేసినవాళ్ళు కూడ వుంటారేమో!. గోరా తన ఆత్మకధ లో పేర్కొన్నట్లు, పరంపరగా వస్తున్న సంప్రదాయ, మూఢాచారాలు ప్రబలుతున్న కుటుంబం అని తానే చెప్పుకున్నారు. నాస్తికుడిగా,నాస్తికవాద ప్రచారానికి విశేష కౄషి చేసిన మహనీయుడిగా తెలుగు వారందరికీ సుపరిచితులు. ఆస్తికత, హేతువాద విరుద్ధమంటారు. నేటి సమాజంలో అగ్ర - నిమ్న జాతులనే వర్గ భేదాలు, అంధ విశ్వాసాలు పెచ్చు పెరిగిపోవడానికి, ఆస్తికతే ప్రధాన కారణమని గోరా విశ్వసించారు.
వౄక్షశాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రేసిడెన్సీ కాలేజీలో అదే శాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణతను పొందారు. గోరా ఆంధ్రరాష్ట్రంలో, పలు కళాశాలల్లో, శ్రీలంకలో కొంతకాలం అధ్యాపకులుగా వౄత్తిని నిర్వహించారు. 1922 లో సరస్వతిని, ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. వారిద్దరి కుటుంబాలు, హిందూ సనాతన పద్ధతిలోని కుటుంబాలే. వీరిరువిరి కుటుంబాలు, బాల్యవివాహ నిరోధ చట్టం 1975 లో జరిగింది.
నాస్తికవాద ప్రచారం
తనకు నచ్చిన వాదాన్ని, అంటే నాస్తిక వాదాన్ని. ప్రచారం చేయడానికిజీవితాంతం శ్రమపడిన వ్యక్తి. 1940 లో గోరా ఆయన భార్య తో కలసి, నాస్తికకేంద్రం ను, కౄష్ణాజిల్లాలోని ఒక గ్రామంలో ప్రారంభించడం జగిరింది. 1040 ప్రాంతంలో విజయవాడ కేంద్రంగా తాను నమ్మిన సిద్ధాంతాల ప్రచారాన్ని చేపట్టాౠ. ఆ కాలంలోని భారత స్వాతంత్ర్య సంగ్రామంగ్లో క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొని ఆలీపురంతదితర జైళ్ళలో కఠిన శిక్షల్ని అనుభవించారు. దేశస్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడకు తరలించడం జరిగింది. సోషలిస్టు భావాలకు అనుగుణంగా మానవులందరూ సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే నాస్తికవాదం వల్ల మాత్రమే సుసాధ్యమని ఆయన భావించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాస్తికవాద ప్రచారంలో తన జీవితాంతం అకుంఠిత దీక్షతో కౄషి సలిపిన, గోరా, 'ఎథీస్టూ అనే ఆంగ్ల మాసపత్రికను నడిపారు. గోరా రచించిన 'పాజిటివ్ ఎథీస్టూ అనే గ్రంథంలో నాస్తిక భావాలను, హేతువాదాన్ని వివరంగా పొందుపరచారు. గోరా చేపట్టిన పలు సంఘ సంస్కరణ కార్యక్రమాలని గాంధీజీ కూడ హర్షించాడని, అభినందించారని ఎప్పుడూ ఆయన అభిమానులు చెప్పుతూంటారు. గాంధీజీ సర్వోదయ కార్యక్రమం కూడ గోరా కునచ్చిందని, సర్వోదయ కార్యకర్తగా తన జీవితాంతం గడిపారననడంలో ఏ సందేహం లేదు, రాదు.
గోరా రచనలు
గోరా వ్రాసిన రచనల్లో ప్రథానంగా, నాస్తికవాదం పై ప్రశ్నలు-జవాబులు, నాస్తికుని విశ్వయానం, గాంధీతో నాస్తికుడు, నాస్తికత ఆవశ్యకత, అనుకూల నాస్తికవాదం అన్నవి వ్రాశారు. 1949 నుంచే ప్రారంభించిన పత్రికావ్యాసం, నాస్తికత ఆంశంపై, వాటిని 1969 లో నాస్తికవాది అన్న మాసపత్రికలో ప్రచురించారు. వర్ణవ్యవస్థ, అంటరానితనంపై తన యుద్ధాన్ని ప్రకటించారు. కర్మసిద్ధాంతంపైనా, ఆధ్యాత్మకపరంగా తరచు అనుకునే కర్మ, ప్రాప్తం అనే విషయాలపై తనకున్న నిశ్చితాభిప్రాయాల్ని వెల్లడించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు.
గోరా గొప్ప సంఘసంస్కర్త కావడమే కాక, కుల, మత రహిత సమసమాజ నిర్మాణానికై తాను చేపట్టిన ఉద్యమానికి తానే ఆదర్శంగా నిలవాలని, తన కుమారులకు, కుమార్తెలకు కులాంతర వివాహాలు, నిరాడంబరంగా నిర్వహించిన ఘనాపాటి. అంటరానితనం నిర్మూలనపై కూడ విశేష కౄషి చేశారు.
1970 లో బోస్టన్ లో,1974 లో హాలండ్ లోని ఆంసటర్ డంలో జరిగిన అంతర్జాతీయ హ్యూమనిస్ట్ సమావేశంలో గోరా పాల్గొన్నారు. తెలుగు వారపత్రిక 'సంఘం'ను స్థాపించి తద్వారా తన ఆశయాలను, లక్ష్యాలను విశేషంగా ప్రజల్లో ప్రచారం నిర్వహించారు.
ఒక సిద్ధాంతపరమైన భావాలతో జీవితాంతం కౄషిసల్పిన 'గోరా' 1975, 26, జూలైన మరణించారు.
ఏ వాదమైనా, మానవసేవయే మాధవసేవయ పరమ పరమార్ధం అని నమ్మి ఆచరించిన మహానుభావుడు, గోరా.
గోరా మరణాంతరం, నాస్తికకేంద్రాన్ని, ఆయన భార్య సరస్వతి పర్యవేక్షణలో, సలహాసంప్రదింపులు, కులాంతర వివాహాలు, వర్ణరహిత వివాహాల కోసం నిరంతర కౄషిని సలిపాడు. బాల్య వివాహాలని నిషేధించడానికి, వేశ్యావౄత్తిలో యిరుక్కుపోయినవారికి సహాయ సహకారాలు, పెళ్ళికాని తల్లులకు సహాయాలు, బీదవర్గపు మహిళలు, మూఢాచార నమ్మకాలపై కౄషిని సలిపారు. వీటికి నిదర్శనగా, మంటలపై నడకలు, యితర మూఢాచారాల్ని తొలగించే ప్రయత్నం జరిగింది. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబనియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.
2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు, ప్రత్యేక తపాళబిళ్ళను 5 రూపాయల స్ఠాంపుని విడుదల చేశారు. గోరా 100 వ శతాబ్దపు జయంతి సందర్భంగా విడుదల చేశారు.
నాస్తికవాద ప్రచారకుడు, సంఘసంస్కర్త అయిన గోపరాజు రామచంద్రరావు (గోరా) జయంతి సందర్భంగా తెలుగురథం ఘననివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

1 comment:

శరత్ కాలమ్ said...

మంచి వ్యాసం ప్రచురించారు. ధన్యవాదాలు శర్మ గారు. మా నాన్న నాగం గారు తెలంగాణాలో గోరా గారికి ముఖ్య కార్యకర్తగా పనిచేసారు. సూర్యాపేటలో నాస్తిక కేంద్రం కూడా ప్రారంభించారు. గోరా గారి కుటుంబంతో మా కుటుంబానికి మంచి సాన్నిహిత్యం వుంది. గోరా గారు, వారి సంతానం మా ఇంటికి వస్తుండేవారు.