ప్రపంచ న్యాయ దినోత్సవం - 16 సెప్టెంబర్
న్యాయాన్ని నమ్ముకోవడం న్యాయమే కదా!
ప్రపంచవ్యాప్తంగా న్యాయానికి ఒక పండగ. అది జరిగితే సంబరాలు జరుపుకోవడం. ఏకారణాలవల్లనైనా న్యాయం జరక్కపోయినా, దర్శనం కాకపోయినా, వాదోపవాదాలు, నినాదాలు, ఉద్యమాలు, అన్యాయంపై భావప్రకటనలు, నిరసనలు, వేనకువేలవిధాలు. అందుకే, ప్రపంచం నాశనమైనా న్యాయం జరగవలసిందే అని అంటాడు చక్రవరి ఫెర్టినాండ్. ఏది న్యాయం ? ఏది అన్యాయం ? అని ప్రశ్నను, వివిధ కోణాలనుంచి బేరీజు వేసుకొంటేగాని, సమాధానం దొరకదు. న్యాయవవస్థ పనితీరుని విశ్లేషించే అర్హత, అధికారం ఎవరికున్నాయి అని ప్రశ్నించుకుంటే కూడ జవాబు అగమ్యగోచరంగా కనిపిస్తుంది. సమసమాజంలో పరిస్థితి అనువుగానే వుంటుంది కాని అది ఈ కలికాలంలో అది సాధ్యమా! యిప్పుడేకాదు, ఎల్లవేళలా ఈ న్యాయాన్యాయాల సమస్యలు, చర్చలు నిరంతరం కొనసాగుతూనే వున్నాయన్నది సత్యం. కొన్నివేళల్లో తప్పిపోయినా, న్యాయమే అక్కరకు వస్తుంది అని కందుకూరి ఒక సందర్భంలో భరోసా యిచ్చారు. న్యాయమనేది అదౄశ్యమవకూడదని న్యాయం పోతే అన్నీ తంటాలే వస్తవి, అందరితోనూ విరోధాలు వస్తాయి అన్నారు వారే ప్రముఖ రచన హాస్యసంజీవనిలో. న్యాయం పై చాలా మందికి అపారమైన నమ్మకాలుంటాయి. ఈ భావాన్నే, న్యాయమైన సొమ్ము నట్టేటిలో పారవేసినా పోదు అంటారు చెళ్ళపిళ్ళవారు తన కధలు-గాధలు లో.
న్యాయాన్యాయాలు నిర్ణయించే చట్టాల తీరుతెన్నులు
మనకున్న మొదటి చట్టాన్ని మన రాజ్యాంగం అనే చెప్పుకోవాలి. యిటీవలే భారతావని స్వాతంత్ర్హ్య జీవనకాలానికి షష్టిపూర్తి జరుపుకుంది. గడచిన అరవైయేళ్ళ ప్రాయంలో మన రాజ్యాంగపు సవరణలు అంతకన్న అధికం కదా. దీన్నిబట్టే సులభంగా చెప్పుకోవచ్చు - జనసామాన్యానికి అందించే పరిపాలనాయంత్రాంగపు విధానాల్లో, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అని తేల్చుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. అందుకే, చట్టం పేదవాళ్ళను కాల్చుకుతింటుంది; ధనికులు మాత్రం చట్టాన్ని పాలిస్తారు అని నిర్ద్వందంగా చెప్పాడు గోల్డ్ స్మిత్. ఈ అసంమజసపు ధోరణితోపాటు, మన న్యాయవ్యవస్థ, చట్టపరిధి, పరిణామం మన జీవితాల్లాగ క్షణికాలు. చట్టం పొద్దున ఉన్నట్లు రాత్రి వుండదు అంటారు. అంతేకాదు, చట్టాల్నిఫ్ తయారు చేయడం కన్నా అమలుపరచటం ముఖ్యమని తరచు జనావని గొల్లు పెడుతున్నా, పట్టించుకున్న నాధుడు కానరాడు. అనవసరమైన చట్టాలు అవసరమైన చట్టాలను బలహీనపరుస్తున్నాయి. ఉదాహరణకు, తీవ్రవాదానికి, ఈ విపరీతధోరణిని నిర్మూలించేందుకు అందుబాటులోనున్నవి, వాటిని అమలుపరచటంలోని చట్టాల సత్తాని విశ్లేషించలేని దుస్థితిలో వున్నాం. సగటు మానవుడు, తన ప్రాణాన్ని గుప్పెట్లో ముడుచుకొని జీవనం చేస్తున్నాడు. అదే తీరులో, సమాచార చట్టం భారతదేశంలో ప్రవేశించినా, ఆ మహమ్మారిల ఉన్న భూతపు చట్టాన్ని అమలుపరచడంలో మన నేతలు నీళ్ళు కారుస్తున్నారు. అర్ధరహిత మినహాయింపులు, పైకి చెప్పని నిర్లక్ష్య ధోరణులు అవలింబిస్తూ, సమాచార చట్టాన్ని అమలుపరుస్తున్నాట్లా, మైల పరుస్తున్నట్లా అని సందేహాలు, అనుమానాలు ఆవిర్భవించడం సహజం కదా. అందుకే, చట్టాలను తయారుచేసేది అతిక్రమించడానికే అన్న క్రిస్టఫర్ నార్త్ భావానికి సరైన ప్రస్తుత ఉదాహరణ - సమాచార హక్కు చట్టం అమలుచేస్తున్న కుహనా పద్ధతిని బట్టి చూస్తే, యించుమించు సమాచార హక్కుల చట్టం రాని పూర్వం స్థితే అని చెప్పాలి. ఏదో అవసరం అనుకుని, పదవి, బలం వున్నాయి కదా అని చట్టాలను యుద్ధప్రాతిపదిక పై రూపొందించి, అంతకన్న వాయువేగంతో మూలనపడవేయడాలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. 33 శాతం పార్లమెంటులో మహిళలకు కేటాయింపు విషయంలో యిదమిథ్థంగా మార్చుకోలేని చట్టం ఎక్కడ కునుకు తీస్తోందో మరి, వెదకండి. అసలు మన మహిళానేతలకైనా ఈ చట్టంపై శ్రద్ధ వుందా అని అనుమానాలు రేకెత్తిన సంఘటనలు లేకపోలేవు. మరి మహిళా సాధికారత విషయం ఏమైపోయిందో! యిలాంటి మనోబలం, సంకల్పం లేని చట్టాలు - బాలకార్మిక నిర్మూలన చట్టం, నిరక్షరాస్యతను నిర్మూలించే చట్టం, ప్రతీయేట మననం చేసుకుంటున్న గ్రామీణాభివౄద్ధి పధకాలు, మహిళా సాధికారత, లింగ వివక్షత, ఎన్నో, మరెన్నో. మరో విషయం, చట్టాలను తయారుచేసేది వాటిని అతిక్రమించడానికే అని తరచు అనిపిస్తుంది. విద్రోహచర్యలకై యిచ్చే శిక్షల విషయంలో, ఒక న్యాయస్థానం శిక్షిస్తే, మరొక న్యాయస్థానం వెనువెంటనే పూర్తిగా వ్యతిరేకంగా నిర్ధారిస్తుంది. ఈ ధోరణికి ఏకంగా న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతూండడమేకాక, నమ్మకం నశిస్తూంటుంది. చట్టంలేనిచోట నియంతౄత్వం మొదలవుతుంది అన్న విలియం పిట్ ధోరణి నిజం కాదేమో అనిపిస్తుందీ మన దేశంలో చట్టం లేని అవాంతర పరిస్థితుల కన్నా, చట్టం వున్న యిబ్బందులే ఎక్కువ అని అనుకోవలసివస్తోంది.
ప్రపంచ న్యాయ దినోత్సవం
న్యాయం యింకా వుంది అని చెప్పుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా రోజు కేటాయింపులు, ఆ సందర్భాన పలవరింతలు, పలకరింతలు, ఆషామాషీగా నడుస్తున్నాయి. సెప్టెంబర్ 16 న ప్రపంచ న్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేక అలవాట్లలో సంప్రదాయంగా వస్తున్న ఒక ధోరణి.
న్యాయంపై న్యాయమూర్తులు
న్యాయమూర్తులుగారూ! మీరు బహుమంచివారే! అధర్మ నిధనంలో యమరాజంతటివారు, అని కుట్ర అన్న రచనలో రచయిత శివసాగర్ తన భావాన్ని వ్యక్తపరచారు. మన న్యాయమూర్తులు, అధిష్ఠాన సింహాసనాసీతులు అయినా, న్యాయం విషయంలో నటనాపర్వంలో పునీతులు. మన న్యాయస్థానాలు, న్యాయమూర్తులు కలసి ఉమ్మడిగా సమాజానికి చట్టం, న్యాయం, రాజ్యాంగ మాధ్యమాల ద్వారా, హెచ్చుతగ్గుల్ని తొలగిపోయేలా చేయడం, తద్వారా సమభావం, సామ్యవాదం అందించేలా అవిరళకౄషిని చేయవలసిన తరుణం నిత్య, సత్య, సత్వరంగా జరగాలి అన్నదాంట్లో సందేహం, సంశయం లేనే లేవు, రానేరాకూడదు. అందుకే హెచ్చుతగ్గులున్నచోట చచ్చిపోవు సమభావం, సమభావం లేనిచోట సామ్యవాదముత్తమాట అంటాడు. ఈ కవివాక్కు ఈనాడు సంపూర్ణంగా వర్తిస్తుంది అని చెప్పాలి. యిటీవలే షష్టిపూర్తి సంబరాలను జరుపుకుని, ఆరు దశాబ్దాల స్వేఛ్ఛాగాలుల్ని పీల్చుకుంటున్న తరుణంలో మన భారతావనిలో సగటు మానవునికి రావలసిన న్యాయం ఎంత నిజంగా, ఎంత త్వరితగతిని లభిస్తోందో మనకున్న న్యాయస్థానాల అధిపతులు, న్యాయ యంత్రాంగ మంత్రాంగ శాఖలు, వీటి అధిపతులు, న్యాయపతులు, యిరుపక్షాల తమతమ వౄత్తులద్వారా ఎంతెంత న్యాయం చేస్తున్నారో వారి ఆత్మసాక్షే వారిని సమాధానపరచాలి. అందుకే, న్యాయం జరగడం ఆలస్యమైతే, అన్యాయం జరిగినట్లే నిర్ధారించాలి అని చెప్పిన నానుడిలో సత్యం కాక వేరే ఏమీలేదు. న్యాయస్థానాలు తమ ఎట్టకేలకు నిర్ణయాలను జారీచేసినా, వాటిని ఆచరించడంలో జరుగుతున్న జాప్యం కూడ దారుణంగానే వుంది.
మన న్యాయవ్యవస్థలో లోపిస్తున్న సమన్వయ దౄక్పథం
సమన్వయ దౄక్పథం అంటే - ముందుచూపు కోల్పోయిన గతదౄష్టి గానీ, వెనుకచూపును నిరసించిన భవిష్యదౄష్టిని గానీ మానవపురోభివౄద్ధికి దోహదకారులు కాలేవు అన్న అభిప్రాయం బలపడ్డమే అన్నది మన న్యాయవ్యవస్థకు ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే తిక్కన, మహాభారతం లో - చెడబారినదైన అవస్థ అంటాడు. యిలా సాగింది.
సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచేపారము పొందలేక చెడబారినదైన అవస్థ, దక్షులెవ్వారలుపేక్ష సేతురది వారల చేటగుగాని ధర్మనిస్థారకమయ్యు సత్యశుభదాయకమయ్యును, దైవముండెడెన్.
సమాజంలో అధర్మం-అసత్యాలచేత, ధర్మము-సత్యం దారుణంగా చరచబడుతున్నా, దానిని నిరోధించేశక్తి వుండీ ఉపేక్షించినవారికి తమ ఉపేక్షే చేటుగా పరిణమిస్తుంది. సరిగ్గా యిదే పరిస్థితి ఆనాటి భారతకాలంలో వున్న స్థితిగతులే, నేటి ఆధునిక, కలియుగ భారతావనిలోనూ ప్రత్యక్షదర్శనం అవుతున్నాయి. మార్పు ఎటొచ్చీ, యుగం, యుగధర్మపరంపర మారుతున్నాయి. అవే సమాజాలు, మనుషులు వారే. కొంచెంగా సాంకేతికత, శాస్త్రాలు, ప్రపంచవ్యాప్తంగా తంత్రాలు, కుతంత్రాలు, మనకున్న అంతశ్శతౄవులతో తోడయి సమాజాన్ని నిజమైన చెడబారినదైన అవస్థగా మారుస్తున్నారు, మన నేటి రాజకీయదక్షులు. నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే వానిని ఈనాటి సంఘంలో 'కాంజెనిటల్ ఈడియట్'గా పరిగణిస్తున్నారు అన్నాడు ఒక విశ్లేషకుడు. అది అసాంతం మన న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు, ఉమ్మడిగా వర్తిస్తుంది. నైతిక విలువలు మాత్రం మన చట్టాల్లోను, న్యాయశాస్త్రపుపుటల్లోనూ భద్రంగానే వుంచారు. తరచుగా వాటిని సంప్రదించవలసివస్తుందని, మన తీర్పులు సంవత్సరాలకొద్దీ ఓ కొలిక్కి రాలేని సమయ ప్రణాళికను రూపొందించి, వచ్చినా, అనూహ్యమైన కొసమెరుపులతో, ఆశ్చర్యానుభూతుల్ని కలిగిస్తాయి. ఒక న్యాయస్థానం నుంచి, మరొకదానికి పైకి, అదే వరసలో కింది న్యాయస్థానాల మధ్య క్రీడావిహారం చేస్తుంటాయి వాయిదాల రూపంలో.
న్యాయంపై, న్యాయం చుట్టూరా ఆవరింపులు
ప్రజాస్వామ్యదేశమైన మనభారతావనిలో సగటుజీవికి న్యాయం గురించి ఆలోచించే జ్ౙానం, తీరిక కూడ లేదు. కడుపుకాలుతూ, డొక్క లోపలికిపోతూ, రోజును గడుపుతున్న నీరసహౄదయ నలుసు ప్రాణానికి న్యాయమా, అన్యాయమా, ఏదీ వద్దు, తనను యధాతధంగా బతకనివ్వమంటాడు.
మన న్యాయవ్యవస్థపై ప్రముఖ రచయిత రావిశాస్త్రిగారు విసరిన బాణాలు యిలా వున్నాయి.
పని కూలీ వెధవల్ది, లాభం బుగతది, ఏమైనా అంటే, ఎదురు తిరిగితే మన సాయానికి కోఋర్టులున్నాయి, జైళ్ళున్నాయి (మాయ).మడిసి మాంసం అమ్ముకొని మడుసులు బతకడం నాయం కాదుకదా? (రత్తాలు రాంబాబు).పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు లక్షలక్షలు పోవాలి, అది న్యాయం. (కష్టార్జితం)కేసుల్లోనే న్యాయం వుంటే ఈ పోలీసులం మేమెందుకు? ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా ఎందుకూ? ఈ కోర్టులన్నీ ఎందుకూ? (న్యాయం).అన్యేయం చేయించీ నాలుగురోజు లూరుకుంటే అదే నాయెం ఊరుకుంటుంది. (విషాదం).
భమిడిపాటి వారి న్యాయం పై నిర్వచనం యిలా వుంది.తను ఇతరుల్ని అంటే, తమాషాలు; తన్ని అంటే ఇతరులు, ఈర్ష్యట; ఇదిట న్యాయం.
న్యాయమన్న బోనులో చిక్కుకున్న ప్రాణి బయటపడ్డానికి వీలులేదు, అంటారు న్యాయంపై యజ్ౙన్నశాస్త్రి.
మన మహాకవి శ్రీశ్రీ న్యాయం పై పంచరత్నాలు చెప్పారు. అందులో ఒక రత్నం యిలావుంది.నడిబజారులో నలుగురి ముందు హత్య జరిగినా సాక్ష్యం బందు, న్యాయం గుడ్డిది మాత్రమే కాదు, కుంటి, మూగ అని ఘోషిస్తాను, అని ఉధ్ఘోషించారు.
న్యాయం ఉరిపోసుకున్న పరిస్థితి కూడ మన రచయితలు చెప్పారు.నాకు విలువలేనప్పుడు నేనెందుకు? మీ ఏడుపేదో మీరే ఏడవండంటూ అక్కడే - కోర్టు గుమ్మానికే - ఉరేసుకుంది - న్యాయం ఉరేసుకుంది, అని అల్లంరాజు, న్యాయం ఉరేసుకుంది అని ప్రకటించారు.
ఏది ఏమైనా నిరూపించలేని నిజాలను చట్టం ఒప్పుకోదు. మన న్యాయశాస్త్రం చెడ్డవాడిని మరింత చెడ్డవాడిగా చెయ్యడానికే ఉపయోగపడుతుందమ్మాయ్ అని సూర్యారావు ఒక పాత్రద్వారా, శ్రీమతులు-శ్రీయుతులు అన్న రచనలో చురకను అంటించారు.
పైన వివరించిందంతా, జరిగినది, జరుగుతున్నది. మరి జరగాల్సిన తంతు సంగతి మాట ఏమిటి? దాని కధ, కమామీషూ ఎలా వుండాలి? సమాధానంగా - అధికారదుర్వినియోగంలాంటి అంటురోగాలకు దూరంగా, కేవలం పుస్తకాల్లోని వెర్రిమొర్రి న్యాయం కాక మంచులా స్వచ్ఛమైన న్యాయం జరగాలి ప్రతి మనిషికీ - అని అంటారు, కోర్టు అన్న రచనలో విశ్వం.
యిటువంటి న్యాయం మన భారతావనిలోని సగటుమనిషికి, గ్రామీణ నిరుపేదకు, ఎవ్వరూ ప్రశ్నించకూడని, సమాధానపరచుకునే అవసరం రాని నిత్యజీవనం చేయడానికి కావలసిన సదుపాయాలను ఎలాగూ అందించలేకపోతున్నాం. కనీసం, న్యాయాన్నైనా అందించడానికి మనసావాచాకర్మాణా సంకల్పం చేద్దాం. దీక్షపూనుదాం. మన మేధలకు కంకణాల్ని కట్టుకుందాం. అన్యాయం పై న్యాయం వచ్చేవరకూ పోరాటం సాగిద్దాం. న్యాయం పేరిట అందిస్తున్న అన్యాయాన్ని తోసిపారేద్దాం. అప్పుడే, మన సర్వస్వతంత్ర స్వేచ్ఛాపూరిత భారతావని జరుపుకునే సంబరాలు,ఆరు దశాబ్దాల స్వేఛ్ఛాస్వాతంత్ర్య సంబరాలకు అర్ధం, పరమార్ధం. అది లేనినాడు, పండుగలన్నీ దండుగలే.
ప్రపంచ న్యాయ దినోత్సవం సందర్భంగా - న్యాయంలా దర్శనం యిచ్చే అన్యాయాల్ని, అన్యాయాలుగా కనిపించే న్యాయాలపై మన న్యాయ నిర్ణేతలు, నేతలు, నాయకులు, వినాయకులు ఆలోచించాల్సిన సమయం. తమ తమ మస్తిష్కాలకు పదును పెట్టగలిగి, ఆలోచనాస్రవంతిని చైతన్యవంతంగా తగు ప్రణాళికలను నిర్మాణం చేసుకుని ఆచరణకు సుసాథ్యం చేసుకునే ప్రయత్నంలో ముందుకు అడుగు, సత్సంకల్పం, దీక్ష తో వేయగలిగితే, కించిత్తైనా న్యాయాన్యాయ విశ్లేషణాత్మక వ్యాఖ్యానానికి కొంచెం అర్ధం, పరమార్ధం గోచరిస్తాయి.
ప్రపంచ న్యాయ దినోత్సవం సందర్భంగా - తెలుగురథం శుభాకాంక్షలను అందాజేస్తోంది.
కొంపెల్లశర్మ - తెలుగురథం.
న్యాయాన్ని నమ్ముకోవడం న్యాయమే కదా!
ప్రపంచవ్యాప్తంగా న్యాయానికి ఒక పండగ. అది జరిగితే సంబరాలు జరుపుకోవడం. ఏకారణాలవల్లనైనా న్యాయం జరక్కపోయినా, దర్శనం కాకపోయినా, వాదోపవాదాలు, నినాదాలు, ఉద్యమాలు, అన్యాయంపై భావప్రకటనలు, నిరసనలు, వేనకువేలవిధాలు. అందుకే, ప్రపంచం నాశనమైనా న్యాయం జరగవలసిందే అని అంటాడు చక్రవరి ఫెర్టినాండ్. ఏది న్యాయం ? ఏది అన్యాయం ? అని ప్రశ్నను, వివిధ కోణాలనుంచి బేరీజు వేసుకొంటేగాని, సమాధానం దొరకదు. న్యాయవవస్థ పనితీరుని విశ్లేషించే అర్హత, అధికారం ఎవరికున్నాయి అని ప్రశ్నించుకుంటే కూడ జవాబు అగమ్యగోచరంగా కనిపిస్తుంది. సమసమాజంలో పరిస్థితి అనువుగానే వుంటుంది కాని అది ఈ కలికాలంలో అది సాధ్యమా! యిప్పుడేకాదు, ఎల్లవేళలా ఈ న్యాయాన్యాయాల సమస్యలు, చర్చలు నిరంతరం కొనసాగుతూనే వున్నాయన్నది సత్యం. కొన్నివేళల్లో తప్పిపోయినా, న్యాయమే అక్కరకు వస్తుంది అని కందుకూరి ఒక సందర్భంలో భరోసా యిచ్చారు. న్యాయమనేది అదౄశ్యమవకూడదని న్యాయం పోతే అన్నీ తంటాలే వస్తవి, అందరితోనూ విరోధాలు వస్తాయి అన్నారు వారే ప్రముఖ రచన హాస్యసంజీవనిలో. న్యాయం పై చాలా మందికి అపారమైన నమ్మకాలుంటాయి. ఈ భావాన్నే, న్యాయమైన సొమ్ము నట్టేటిలో పారవేసినా పోదు అంటారు చెళ్ళపిళ్ళవారు తన కధలు-గాధలు లో.
న్యాయాన్యాయాలు నిర్ణయించే చట్టాల తీరుతెన్నులు
మనకున్న మొదటి చట్టాన్ని మన రాజ్యాంగం అనే చెప్పుకోవాలి. యిటీవలే భారతావని స్వాతంత్ర్హ్య జీవనకాలానికి షష్టిపూర్తి జరుపుకుంది. గడచిన అరవైయేళ్ళ ప్రాయంలో మన రాజ్యాంగపు సవరణలు అంతకన్న అధికం కదా. దీన్నిబట్టే సులభంగా చెప్పుకోవచ్చు - జనసామాన్యానికి అందించే పరిపాలనాయంత్రాంగపు విధానాల్లో, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అని తేల్చుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. అందుకే, చట్టం పేదవాళ్ళను కాల్చుకుతింటుంది; ధనికులు మాత్రం చట్టాన్ని పాలిస్తారు అని నిర్ద్వందంగా చెప్పాడు గోల్డ్ స్మిత్. ఈ అసంమజసపు ధోరణితోపాటు, మన న్యాయవ్యవస్థ, చట్టపరిధి, పరిణామం మన జీవితాల్లాగ క్షణికాలు. చట్టం పొద్దున ఉన్నట్లు రాత్రి వుండదు అంటారు. అంతేకాదు, చట్టాల్నిఫ్ తయారు చేయడం కన్నా అమలుపరచటం ముఖ్యమని తరచు జనావని గొల్లు పెడుతున్నా, పట్టించుకున్న నాధుడు కానరాడు. అనవసరమైన చట్టాలు అవసరమైన చట్టాలను బలహీనపరుస్తున్నాయి. ఉదాహరణకు, తీవ్రవాదానికి, ఈ విపరీతధోరణిని నిర్మూలించేందుకు అందుబాటులోనున్నవి, వాటిని అమలుపరచటంలోని చట్టాల సత్తాని విశ్లేషించలేని దుస్థితిలో వున్నాం. సగటు మానవుడు, తన ప్రాణాన్ని గుప్పెట్లో ముడుచుకొని జీవనం చేస్తున్నాడు. అదే తీరులో, సమాచార చట్టం భారతదేశంలో ప్రవేశించినా, ఆ మహమ్మారిల ఉన్న భూతపు చట్టాన్ని అమలుపరచడంలో మన నేతలు నీళ్ళు కారుస్తున్నారు. అర్ధరహిత మినహాయింపులు, పైకి చెప్పని నిర్లక్ష్య ధోరణులు అవలింబిస్తూ, సమాచార చట్టాన్ని అమలుపరుస్తున్నాట్లా, మైల పరుస్తున్నట్లా అని సందేహాలు, అనుమానాలు ఆవిర్భవించడం సహజం కదా. అందుకే, చట్టాలను తయారుచేసేది అతిక్రమించడానికే అన్న క్రిస్టఫర్ నార్త్ భావానికి సరైన ప్రస్తుత ఉదాహరణ - సమాచార హక్కు చట్టం అమలుచేస్తున్న కుహనా పద్ధతిని బట్టి చూస్తే, యించుమించు సమాచార హక్కుల చట్టం రాని పూర్వం స్థితే అని చెప్పాలి. ఏదో అవసరం అనుకుని, పదవి, బలం వున్నాయి కదా అని చట్టాలను యుద్ధప్రాతిపదిక పై రూపొందించి, అంతకన్న వాయువేగంతో మూలనపడవేయడాలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. 33 శాతం పార్లమెంటులో మహిళలకు కేటాయింపు విషయంలో యిదమిథ్థంగా మార్చుకోలేని చట్టం ఎక్కడ కునుకు తీస్తోందో మరి, వెదకండి. అసలు మన మహిళానేతలకైనా ఈ చట్టంపై శ్రద్ధ వుందా అని అనుమానాలు రేకెత్తిన సంఘటనలు లేకపోలేవు. మరి మహిళా సాధికారత విషయం ఏమైపోయిందో! యిలాంటి మనోబలం, సంకల్పం లేని చట్టాలు - బాలకార్మిక నిర్మూలన చట్టం, నిరక్షరాస్యతను నిర్మూలించే చట్టం, ప్రతీయేట మననం చేసుకుంటున్న గ్రామీణాభివౄద్ధి పధకాలు, మహిళా సాధికారత, లింగ వివక్షత, ఎన్నో, మరెన్నో. మరో విషయం, చట్టాలను తయారుచేసేది వాటిని అతిక్రమించడానికే అని తరచు అనిపిస్తుంది. విద్రోహచర్యలకై యిచ్చే శిక్షల విషయంలో, ఒక న్యాయస్థానం శిక్షిస్తే, మరొక న్యాయస్థానం వెనువెంటనే పూర్తిగా వ్యతిరేకంగా నిర్ధారిస్తుంది. ఈ ధోరణికి ఏకంగా న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతూండడమేకాక, నమ్మకం నశిస్తూంటుంది. చట్టంలేనిచోట నియంతౄత్వం మొదలవుతుంది అన్న విలియం పిట్ ధోరణి నిజం కాదేమో అనిపిస్తుందీ మన దేశంలో చట్టం లేని అవాంతర పరిస్థితుల కన్నా, చట్టం వున్న యిబ్బందులే ఎక్కువ అని అనుకోవలసివస్తోంది.
ప్రపంచ న్యాయ దినోత్సవం
న్యాయం యింకా వుంది అని చెప్పుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా రోజు కేటాయింపులు, ఆ సందర్భాన పలవరింతలు, పలకరింతలు, ఆషామాషీగా నడుస్తున్నాయి. సెప్టెంబర్ 16 న ప్రపంచ న్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేక అలవాట్లలో సంప్రదాయంగా వస్తున్న ఒక ధోరణి.
న్యాయంపై న్యాయమూర్తులు
న్యాయమూర్తులుగారూ! మీరు బహుమంచివారే! అధర్మ నిధనంలో యమరాజంతటివారు, అని కుట్ర అన్న రచనలో రచయిత శివసాగర్ తన భావాన్ని వ్యక్తపరచారు. మన న్యాయమూర్తులు, అధిష్ఠాన సింహాసనాసీతులు అయినా, న్యాయం విషయంలో నటనాపర్వంలో పునీతులు. మన న్యాయస్థానాలు, న్యాయమూర్తులు కలసి ఉమ్మడిగా సమాజానికి చట్టం, న్యాయం, రాజ్యాంగ మాధ్యమాల ద్వారా, హెచ్చుతగ్గుల్ని తొలగిపోయేలా చేయడం, తద్వారా సమభావం, సామ్యవాదం అందించేలా అవిరళకౄషిని చేయవలసిన తరుణం నిత్య, సత్య, సత్వరంగా జరగాలి అన్నదాంట్లో సందేహం, సంశయం లేనే లేవు, రానేరాకూడదు. అందుకే హెచ్చుతగ్గులున్నచోట చచ్చిపోవు సమభావం, సమభావం లేనిచోట సామ్యవాదముత్తమాట అంటాడు. ఈ కవివాక్కు ఈనాడు సంపూర్ణంగా వర్తిస్తుంది అని చెప్పాలి. యిటీవలే షష్టిపూర్తి సంబరాలను జరుపుకుని, ఆరు దశాబ్దాల స్వేఛ్ఛాగాలుల్ని పీల్చుకుంటున్న తరుణంలో మన భారతావనిలో సగటు మానవునికి రావలసిన న్యాయం ఎంత నిజంగా, ఎంత త్వరితగతిని లభిస్తోందో మనకున్న న్యాయస్థానాల అధిపతులు, న్యాయ యంత్రాంగ మంత్రాంగ శాఖలు, వీటి అధిపతులు, న్యాయపతులు, యిరుపక్షాల తమతమ వౄత్తులద్వారా ఎంతెంత న్యాయం చేస్తున్నారో వారి ఆత్మసాక్షే వారిని సమాధానపరచాలి. అందుకే, న్యాయం జరగడం ఆలస్యమైతే, అన్యాయం జరిగినట్లే నిర్ధారించాలి అని చెప్పిన నానుడిలో సత్యం కాక వేరే ఏమీలేదు. న్యాయస్థానాలు తమ ఎట్టకేలకు నిర్ణయాలను జారీచేసినా, వాటిని ఆచరించడంలో జరుగుతున్న జాప్యం కూడ దారుణంగానే వుంది.
మన న్యాయవ్యవస్థలో లోపిస్తున్న సమన్వయ దౄక్పథం
సమన్వయ దౄక్పథం అంటే - ముందుచూపు కోల్పోయిన గతదౄష్టి గానీ, వెనుకచూపును నిరసించిన భవిష్యదౄష్టిని గానీ మానవపురోభివౄద్ధికి దోహదకారులు కాలేవు అన్న అభిప్రాయం బలపడ్డమే అన్నది మన న్యాయవ్యవస్థకు ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే తిక్కన, మహాభారతం లో - చెడబారినదైన అవస్థ అంటాడు. యిలా సాగింది.
సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచేపారము పొందలేక చెడబారినదైన అవస్థ, దక్షులెవ్వారలుపేక్ష సేతురది వారల చేటగుగాని ధర్మనిస్థారకమయ్యు సత్యశుభదాయకమయ్యును, దైవముండెడెన్.
సమాజంలో అధర్మం-అసత్యాలచేత, ధర్మము-సత్యం దారుణంగా చరచబడుతున్నా, దానిని నిరోధించేశక్తి వుండీ ఉపేక్షించినవారికి తమ ఉపేక్షే చేటుగా పరిణమిస్తుంది. సరిగ్గా యిదే పరిస్థితి ఆనాటి భారతకాలంలో వున్న స్థితిగతులే, నేటి ఆధునిక, కలియుగ భారతావనిలోనూ ప్రత్యక్షదర్శనం అవుతున్నాయి. మార్పు ఎటొచ్చీ, యుగం, యుగధర్మపరంపర మారుతున్నాయి. అవే సమాజాలు, మనుషులు వారే. కొంచెంగా సాంకేతికత, శాస్త్రాలు, ప్రపంచవ్యాప్తంగా తంత్రాలు, కుతంత్రాలు, మనకున్న అంతశ్శతౄవులతో తోడయి సమాజాన్ని నిజమైన చెడబారినదైన అవస్థగా మారుస్తున్నారు, మన నేటి రాజకీయదక్షులు. నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే వానిని ఈనాటి సంఘంలో 'కాంజెనిటల్ ఈడియట్'గా పరిగణిస్తున్నారు అన్నాడు ఒక విశ్లేషకుడు. అది అసాంతం మన న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు, ఉమ్మడిగా వర్తిస్తుంది. నైతిక విలువలు మాత్రం మన చట్టాల్లోను, న్యాయశాస్త్రపుపుటల్లోనూ భద్రంగానే వుంచారు. తరచుగా వాటిని సంప్రదించవలసివస్తుందని, మన తీర్పులు సంవత్సరాలకొద్దీ ఓ కొలిక్కి రాలేని సమయ ప్రణాళికను రూపొందించి, వచ్చినా, అనూహ్యమైన కొసమెరుపులతో, ఆశ్చర్యానుభూతుల్ని కలిగిస్తాయి. ఒక న్యాయస్థానం నుంచి, మరొకదానికి పైకి, అదే వరసలో కింది న్యాయస్థానాల మధ్య క్రీడావిహారం చేస్తుంటాయి వాయిదాల రూపంలో.
న్యాయంపై, న్యాయం చుట్టూరా ఆవరింపులు
ప్రజాస్వామ్యదేశమైన మనభారతావనిలో సగటుజీవికి న్యాయం గురించి ఆలోచించే జ్ౙానం, తీరిక కూడ లేదు. కడుపుకాలుతూ, డొక్క లోపలికిపోతూ, రోజును గడుపుతున్న నీరసహౄదయ నలుసు ప్రాణానికి న్యాయమా, అన్యాయమా, ఏదీ వద్దు, తనను యధాతధంగా బతకనివ్వమంటాడు.
మన న్యాయవ్యవస్థపై ప్రముఖ రచయిత రావిశాస్త్రిగారు విసరిన బాణాలు యిలా వున్నాయి.
పని కూలీ వెధవల్ది, లాభం బుగతది, ఏమైనా అంటే, ఎదురు తిరిగితే మన సాయానికి కోఋర్టులున్నాయి, జైళ్ళున్నాయి (మాయ).మడిసి మాంసం అమ్ముకొని మడుసులు బతకడం నాయం కాదుకదా? (రత్తాలు రాంబాబు).పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు లక్షలక్షలు పోవాలి, అది న్యాయం. (కష్టార్జితం)కేసుల్లోనే న్యాయం వుంటే ఈ పోలీసులం మేమెందుకు? ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా ఎందుకూ? ఈ కోర్టులన్నీ ఎందుకూ? (న్యాయం).అన్యేయం చేయించీ నాలుగురోజు లూరుకుంటే అదే నాయెం ఊరుకుంటుంది. (విషాదం).
భమిడిపాటి వారి న్యాయం పై నిర్వచనం యిలా వుంది.తను ఇతరుల్ని అంటే, తమాషాలు; తన్ని అంటే ఇతరులు, ఈర్ష్యట; ఇదిట న్యాయం.
న్యాయమన్న బోనులో చిక్కుకున్న ప్రాణి బయటపడ్డానికి వీలులేదు, అంటారు న్యాయంపై యజ్ౙన్నశాస్త్రి.
మన మహాకవి శ్రీశ్రీ న్యాయం పై పంచరత్నాలు చెప్పారు. అందులో ఒక రత్నం యిలావుంది.నడిబజారులో నలుగురి ముందు హత్య జరిగినా సాక్ష్యం బందు, న్యాయం గుడ్డిది మాత్రమే కాదు, కుంటి, మూగ అని ఘోషిస్తాను, అని ఉధ్ఘోషించారు.
న్యాయం ఉరిపోసుకున్న పరిస్థితి కూడ మన రచయితలు చెప్పారు.నాకు విలువలేనప్పుడు నేనెందుకు? మీ ఏడుపేదో మీరే ఏడవండంటూ అక్కడే - కోర్టు గుమ్మానికే - ఉరేసుకుంది - న్యాయం ఉరేసుకుంది, అని అల్లంరాజు, న్యాయం ఉరేసుకుంది అని ప్రకటించారు.
ఏది ఏమైనా నిరూపించలేని నిజాలను చట్టం ఒప్పుకోదు. మన న్యాయశాస్త్రం చెడ్డవాడిని మరింత చెడ్డవాడిగా చెయ్యడానికే ఉపయోగపడుతుందమ్మాయ్ అని సూర్యారావు ఒక పాత్రద్వారా, శ్రీమతులు-శ్రీయుతులు అన్న రచనలో చురకను అంటించారు.
పైన వివరించిందంతా, జరిగినది, జరుగుతున్నది. మరి జరగాల్సిన తంతు సంగతి మాట ఏమిటి? దాని కధ, కమామీషూ ఎలా వుండాలి? సమాధానంగా - అధికారదుర్వినియోగంలాంటి అంటురోగాలకు దూరంగా, కేవలం పుస్తకాల్లోని వెర్రిమొర్రి న్యాయం కాక మంచులా స్వచ్ఛమైన న్యాయం జరగాలి ప్రతి మనిషికీ - అని అంటారు, కోర్టు అన్న రచనలో విశ్వం.
యిటువంటి న్యాయం మన భారతావనిలోని సగటుమనిషికి, గ్రామీణ నిరుపేదకు, ఎవ్వరూ ప్రశ్నించకూడని, సమాధానపరచుకునే అవసరం రాని నిత్యజీవనం చేయడానికి కావలసిన సదుపాయాలను ఎలాగూ అందించలేకపోతున్నాం. కనీసం, న్యాయాన్నైనా అందించడానికి మనసావాచాకర్మాణా సంకల్పం చేద్దాం. దీక్షపూనుదాం. మన మేధలకు కంకణాల్ని కట్టుకుందాం. అన్యాయం పై న్యాయం వచ్చేవరకూ పోరాటం సాగిద్దాం. న్యాయం పేరిట అందిస్తున్న అన్యాయాన్ని తోసిపారేద్దాం. అప్పుడే, మన సర్వస్వతంత్ర స్వేచ్ఛాపూరిత భారతావని జరుపుకునే సంబరాలు,ఆరు దశాబ్దాల స్వేఛ్ఛాస్వాతంత్ర్య సంబరాలకు అర్ధం, పరమార్ధం. అది లేనినాడు, పండుగలన్నీ దండుగలే.
ప్రపంచ న్యాయ దినోత్సవం సందర్భంగా - న్యాయంలా దర్శనం యిచ్చే అన్యాయాల్ని, అన్యాయాలుగా కనిపించే న్యాయాలపై మన న్యాయ నిర్ణేతలు, నేతలు, నాయకులు, వినాయకులు ఆలోచించాల్సిన సమయం. తమ తమ మస్తిష్కాలకు పదును పెట్టగలిగి, ఆలోచనాస్రవంతిని చైతన్యవంతంగా తగు ప్రణాళికలను నిర్మాణం చేసుకుని ఆచరణకు సుసాథ్యం చేసుకునే ప్రయత్నంలో ముందుకు అడుగు, సత్సంకల్పం, దీక్ష తో వేయగలిగితే, కించిత్తైనా న్యాయాన్యాయ విశ్లేషణాత్మక వ్యాఖ్యానానికి కొంచెం అర్ధం, పరమార్ధం గోచరిస్తాయి.
ప్రపంచ న్యాయ దినోత్సవం సందర్భంగా - తెలుగురథం శుభాకాంక్షలను అందాజేస్తోంది.
కొంపెల్లశర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment