Saturday, August 9, 2008

తెలుగుతల్లిగీత రచయిత - శంకరంబాడి సుందరాచార్య జయంతి

నాడు - ఈనాడు
సుందరాచార్య సుందరగీతం - మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మా తెలుగు తల్లికీ మల్లెపూదండమా కన్నతల్లికీ మంగళారతులుకడుపులో బంగారు, కనుచూపులో కరుణచిరునవ్వులోసిరులు దొలరించు మా తల్లి.గలగలా గోదారి కదలిపోతుంటేనుబిరాబిరా కౄష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి.అమరావతీ నగరి అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై, నిఖిలమై నిలిచియుండేదాక.రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తితిమ్మరుసు ధేయుక్తి,కౄష్ణరాయల కీర్తిమా చెవుల రింగుమని మారుమ్రోగేదాకనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుద్దంనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాంజై తెలుగుతల్లీ, జై తెలుగుతల్లీ.- శంకరంబాడి సుందరాచార్య రచించిన ఈ 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గీతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రగీతం గా ఆమోదించడం తెలుగువారికి గర్వకారణం. తెలుగు సంస్కృతికి ప్రతిబింబం ఈ గీతం.
శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా తెలుగురధం శతసహస్ర నివాళి కుసుమాలని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: