Tuesday, July 29, 2008






నవరసాల మూర్తి - నారాయణరెడ్డి కీర్తి

రెడ్డిగారు ... రెడ్డిగారు - 'నారాయణామధ్య స్వసురూపం
నారాయణరెడ్డిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో - 29 జూలై 1931.
ఈ సాకారపు సల్లక్షణాకారం
చిరునామా
యింటిపేరు చైతన్యంఅక్షరాలు గవాక్షాలునడక (నా) తల్లికవిత (నా) చిరునామా.
తేజస్సు (నా) తపస్సుమార్పు (నా) తీర్పుఉదయం (నా) హౄదయం
కాలం అంచు పైనేఆరోహణం కావిస్తూదూరాలను దూసుకొచ్చిశిఖరాలూ-లోయల మధ్యమట్టి మనిషీ ఆకాశం తోదివ్వెల మువ్వలతోముఖాముఖీ జరిపారు భూమిక
జాతిరత్నం, విశ్వనాధ నాయకుడు,కర్పూర వసంతరాయలు, రామప్ప,అమరవీరుడు భగత్ సింగ్, మీరాబాయి,ముత్యాల కోకిల, గాంధీయం తో పాటుతరతరాల తెలుగు వెలుగుల్నిదౄక్పథ వ్యక్తిత్వాల్ని విరచించిజాతికి స్వాతంత్ర్యం ఉపిరన్నారు.
నాగార్జున సాగర జలపాతాలతోపాటుగదిలో సముద్ర మథనం చేయించారు
ౠతుచక్రం భూమిక తోవిశ్వగీతిని ఆలాపిస్తూపగలే వెన్నెల నే కాకవెన్నెలవాడనే సౄష్టించారు.
మంటల్లో మానవుణ్ణిమౄత్యువు నుంచి కాపాడిమరో హరివిల్లు ని సౄష్టించిమధ్యతరగతి మందహాస సహితమందార మకరందాలని అందించారు.
నా మాటలో ఏముందినా పాటలో ఏముందిఅన్న 'సినారే గేయాలు తేనెపాటలునాటికలు ఏనాటికైనా సాహితీపేటికలువచనాలైనా, నిర్వచనాలు, నిర్ద్వందాలు
ఆధునికత తో పాటుసంప్రదాయాల్ని, ప్రయోగాల్నికవితకు జోడించితెలుగు కవితకు లయాత్మకతనుప్రసాదించిన ప్రతిభామూర్తిసమీక్షణం సల్లక్షణం
భూగోళమంత మనిషి రెక్కలకిస్వప్నభంగం చేయించారుఅజంతా సుందరికి కూడనవ్వని పువ్వుని కానుకనిచ్చారు.
'విశ్వంభరా తత్వాన్ని ప్రకటించిప్రతీమనిషి చేత చిలకపలుకులతోమా వూరు మాట్లాడింది అనేలా చేయించిబహుముఖీన ప్రజ్ౙావంతులైనారు
ఒదిగి ఒదిగి ప్రతీ పదానముగ్ధమోహనతను పొదగటంలోనారాయణరెడ్డి గారి ప్రతిభకు జోహార్లు.
కలం సాక్షిగా సినారె కలంకలిసి నడిచే కలం బాణిబహుముఖ 'పరిణత వాణీఆశీస్సులందిస్తోంది గీర్వాణి.
హనుమాజీపేట ఉంగరాల జుట్టుగాడుహద్దుల్లేని హసముఖుడు సరసుడుఉర్దూమాధ్యమంలో చదువుకున్నవాడుతెలుగులో పండితాచార్యోత్తముడుకేంద్రసాహితీపురస్కార గ్రహీతుడుజ్ౙానపీఠాన్ని కదిపి కుదిపిన సర్వప్రజ్ౙావంతుడువిశ్వంభరాతత్వాన్ని విశ్లేషించిన విద్వన్మూరిమంతుడుసింగెరెడ్డి నారాయణరెడ్డి - కుదించబడ్డ 'సినారేరెడ్డి - రెడ్డి మధ్య నారాయణ స్వరూపుడు.
'విశ్వంభరా సందేశం
మనసుకు తొడుగు మనిషిమనిషికి ఉడుపు జగతిఇదే విశ్వంభరాతత్వంఇదే అనంత జీవిత సత్యం
మొదటి మాట
నేను పుట్టకముందేనెత్తిమీద నీలితెరకాళ్ళకింద ధూళిపొర
కొసమెరుపు
నీలితెరకు - ధూళిపొరకుమధ్య కాలంలోక్షణకాలపు, బుద్భుదప్రాయపుమానవ జీవిత ప్రస్థానం.
పై రెంటి మధ్య - భారతీయజ్ౙానపీఠం గుర్తించిన ప్రతిభాపాటవ సందేశసారాశం.నారాయణరెడ్డి గారి పుట్టినరోజు పండుగ - తెలుగువాణికి పండుగరోజు, తెలుగు సంస్కౄతికి పర్వదినం.
పద్మభూషణ్, భారత జ్ౙానపీఠ పురస్కార గ్రహీత -సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి జీవన వ్యక్తిత్వ చిత్రణం
సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి29 జూలై 1931 న - ప్రజోత్పత్తి, నిజాషాఢ పౌర్ణమి, బుధవారం, ఉదయం 4-5 గంటల మధ్య.హనుమాజీపేట, సిరిసిల్ల తాలూకా, కరీంనగర్ జిల్లా.
బుచ్చమ్మ - మల్లారెడ్డి దంపతులకు జన్మించారు.(సత్యం - బయలుదేరి కవిత్వంలో సౌందర్యంగా రూపుదాల్చింది. ఆయనలోని స్నేహశీలం, అభినివేశం, ప్రతిభ, విద్వత్తు, భాగ్యం, ఇవన్నీ ఆతని జాతక విశేషాలను నిజమని నిరూపిస్తున్నాయి. (తిరుమల శ్రీనివాశాచార్యులు)
హనుమాజీపేట (ప్రా.వి.), సిరిసిల్ల (మా.వి.), కరీంనగర్ (ఉ.వి.)1948 హెచ్.యస్.సి. - నైజాం రాష్ట్రానికి స్వాతంత్ర్యం రావాలని విద్యార్ధుల సత్యాగ్రహంలో పాల్గొన్నాడు.
సైనికులం, మేం సేవకులం, జాతీయభారత సైనికులం, స్వఛ్ఛంద భారత సేవకులం.
యింటర్ మీడియట్ - ఛాదర్ ఘాట్ కళాశాల, హైదరాబాద్. (1949)బి.ఎ. - ఆర్ట్స్ కాలేజీ (1952)యం.ఎ. - ఆర్ట్స్ కాలేజీ (1954)
1954-55 - సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజీ - అసంపూర్ణ లెక్చరర్ ఉద్యోగం.1955 - పూర్తిస్థాయి ఆంధ్రోపన్యాసకులు.19158-59 - నిజాం కాలేజీ.1957-62 - పరిశోధన పట్టా - ఆచార్య ఖండవిల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణ లో.1962-73 - ఉస్మానియా - తెలుగుశాఖ - రీడర్.1976 - ఆచార్య పదవి.50 వసంతాలకే అధికార భాషా సంఘం - అధ్యక్షులు.
పురస్కారాలు - రేఖామాత్రంగా
1965 - ౠతుచక్రం - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.1974 - మంటలూ-మానవడూ - కేంద్ర సాహిత్య అకాడమీ.1988 - భారతీయ జ్ౙానపీఠ పురస్కారం.మీరట్, ఆంధ్ర విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్ పట్టాలు.1978 - కళాప్రపూర్ణ.1977 - పద్మశ్రీ.
1961 - గులేబకావళి కథ (చిత్రరంగం ప్రవేశం - యన్.టి.ఆర్. నిర్మాత)
నారాయాణరెడ్డి గారి - సాహితీ ప్రస్థానం
లలితగేయసాహితి - పూలపాటలు
గేయనాటికాసాహితి
నవ్వనిపువ్వు, అజంతాసుందరి, వెన్నెలవాడ, తరతరాల తెలుగు వెలుగు.
ఖండకావ్యసాహితి
జలపాతం, నారాయణరెడ్డి గేయాలు, దివ్వెల మువ్వలు, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, మరోహరివిల్లు, మంటలూ-మానవడూ, ముఖాముఖి, మనిషీ-చిలక, ఉదయం నా హౄదయం, మార్పు నా తీర్పు, తేజస్సు నా తపస్సు, ఇంటి పేరు చైతన్యం, మథనం, మౄత్యువునుంచి.
సుదీర్ఘ గీతికావ్యసాహితి - విశ్వగీతి, భూమిక.
కథాగేయకావ్యసాహితి
నాగార్జునసాగరం, స్వప్నభంగం, కర్పూరవసంతరాయలు, విశ్వనాథనాయకుడు, ౠతుచక్రం, జాతిరత్నం.
నాటికాసాహితి - రామప్ప, నారాయణరెడ్డి నాటికలు.
గేయసూక్తిసాహితి - సమదర్శనం.
వ్యాససాహితి - వ్యాసవాహిని, మావూరు మాట్లాడింది, సమీక్షణం.
పరిశోధన సాహితి - ఆధునికాంధ్ర కవిత్వం : సంప్రదాయములు, ప్రయోగములు.
అనుసౄజన సాహితి - గాంధీయం, మీరాబాయి, శిఖరాలూ లోయలు, ముత్యాలకోకిల.
వాఖ్యాన సాహితి - మందారమకరందాలు.
యత్రాసాహితి
ముచ్చటగా మూడు వారాలు, సోవియట్ రష్యాలో పదిరోజులు, పాశ్చాల్త్య దేశాల్లో 50 రోజులు.
చిత్రసాహితి
పగలేవెన్నెల (యువభారతి సంస్థ ప్రచురించిన చిత్రగీతాల సంకలనం లో - అనుక్రమణిక పొందుపరచిన తీరు యిలా వుంది:
ప్రణయవల్లరి, ప్రకౄతిసుందరి, మువ్వల రవళి - మోహన మురళి, నివాళి, వేదనాఝరి, సందేశ లహరి, నవ్వుల పందిరి, లేత జాబిలి, జానపద మాధురి, మిశ్రమంజరి, అని విభజించడంలోనే సాహితీమర్యాదలను సంతరించుకోవడం జరిగింది.
వచన కావ్య సాహితి - విశ్వంభర
నారాయణ రెడ్డిగారు, పై వరుస తర్వాత నేటి వరకూ రాస్తూనే వున్నారు, రాస్తూనే ముందుకు కదలుతున్నారు.
అందుకే సినారె మాటల్లోనే చెప్పాలంటే -
రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు, పోతూపోతూ రాస్తాను వపవు వాడే వరకు.
నారాయణరెడ్డిగారి మనస్సు సదాసదాలోచనామయం - అని సినారె పై సాహితీమూర్తి గ్రంథం లో తిరుమల శ్రీనివాసాచార్యులు గారు.
పట్టింది బంగారం చేయటం, ప్రయోగంలో పరిణతిని ప్రకటించటం వారినైజం. వారి విశ్వంభర మానవతావాదకవితలో వెలువడిన మహాకావ్యం. సమకాలీనుల్లో శ్రీనాథుడు - నారాయణరెడ్డి అని అంటూ -
'ప్రకౄతిలోని చలనశీలానికి పరిణామం మనిషి, జగతిలోని భ్రమణగుణానికి ప్రతిరూపం మనిషీ అని కూడ ఆంటూ, ఆ మనిషికి పెట్టిన నగిషీ నారాయణరెడ్డి కవితాకౄషి.' అని ప్రముఖ సాహితీపండితులు, విమర్శకులు డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు అన్న భావాభిరామాలు సత్యసూనౄతాలు.
అందరి మహానుభావులు, ఈ ప్రతిభామూర్తిని కొనియాడినవారే!
నవరసాలమూర్తి నారాయణరెడ్డి కీర్తి - దాశరథి.
'నీవు సుకవి జాతికెల్ల నిండు గర్వకారణము, నీ సాహితి తెలుగమ్మకు నిత్యపచ్చతోరణం, నీ లేఖిని దౌష్ట్యముతో నిత్యము సేయును రణము. - వానమామలై వరదాచార్యులు.
'ఇతండహంకౄతిదూరజీవితం వలచినాచికొనె నాంధ్రజాతి మానసమునెల్లనితిని మెచ్చుట తెలుగు భారతినిమెచ్చుటని తలంతురు సత్యాధర్మాభిరతులూ - తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి.
'కవిరేవ విజానాతి...' - కవిని కవే అర్ధం చేసుకోగలడు అన్నది సత్యం.
నిద్రించదు జ్ౙానం - నీరసించదు తేజం
నారాయణ రెడ్డి వ్యక్తిత్వం (నారాయణరెడ్డి సాహితీమూర్తి - డా.తిరుమల శ్రీనివాసాచార్య గ్రంథం నుంచి)
వర్షించే మేఘంగలగలసాగే జలపాతంవికసించిన వసంతంఘోషించే సముద్రంభాసించే సూర్యేందు బింబాలుగళామెత్తే కలకంఠంపురివిప్పిన మయూరం.
పై అన్ని అంశాలను సముచిత నిష్పత్తిలో మిశ్రంచేసి ప్రాణంలా ఒక మూర్తిలో వేస్తే, ఆ మూర్తి ఎలా ఉంటాడో తెలుసా? నారాయణరెడ్డిలా ఉంటాడు. అందుకే అతనికి నవ్వని పువ్వుల భాషా, దివ్వెలమువ్వల ఘోషా తెలుసు. అంబుధిలోని రత్నాలనూ, అంబరం లోని హరివిల్లునూ అందుకునే పండితుడు, ప్రతిభావంతుడు, చైతన్యం, సౌజన్యం, నవత, మానవతా, సంప్రదాయం, ప్రయోగం, అతని వ్యక్తిత్వంలోని అనివార్యాలైనా అంశాలైనాయి. పల్లెలోపుట్టి భాగ్యనగరం చేరి అఖిలభారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ కీర్తిని ఆర్జించినాడు, నారాయణరెడ్డి. ఇంతటి మహనీయవ్యక్తిత్వం అప్రయత్నంగా కలుగలేదు. దీనివెనుక అపారమైన కౄషి ఉంది. మొక్క మహావౄక్షం కావడానికి, చుక్క సుధాంశుబింబం కావడానికి, మొగ్గ పుష్పం కావడానికి, గుడిసె మేడ కావడానికి, శిల శిల్పం కావడానికి, ఎంతో శ్రమ, తపన, మథనం, సాహసం, ఎంతగానో అవసరం.
పై భావవ్యక్తీకరణం, మూడు దశాబ్దాల క్రితం నాటివి. మరి ఆ మహాప్రజ్ౙావంతుడిని విశ్లేషించడం, ఈనాటి ప్రతిభాపాటవాలకు, అక్షరాలేవి? పదాలెక్కడ? వాక్యాలు లభిస్తాయా? ఏమోమరి?!? నారాయణ రెడ్డి గారికి శతసహస్ర ప్రణామాలతో -
కొంపెల్ల శర్మ - తెలుగురథం.




3 comments:

Srikanth said...

చక్కటి సమాచారం. నెనర్లు.

Srikanth said...

చక్కటి టపా, నెనర్లు.

Unknown said...

ధన్యవాదాలు.