'దుర్గాబాయీ సేవాతత్పరత - శతజయంతి సమారోహాలు ( 1909 - 1981 )
వ్యక్తికాదు .. ఆమె ఒక సంస్థఆమె ఒక వ్యక్తికాదు, రాణించినసంస్థ. వ్యక్తిగా ప్రతిభావతి. బాల్యంలోనే హిందీలో పాండిత్యఫలితంగా పాటలు, పద్యాలు, నాటికలు, కోలాటాలు, దేశభక్తిగేయాలు నిరంతరం చెప్పే బాలహిందీవిద్వాంసురాలు, వీణావాదనంలో దిట్ట. రంగవల్లులను, రంగులమయంగా ప్రదర్శించడం, నిరంతర పరిశ్రమ, కార్యదీక్ష, పట్టుదల, నిజాయతి లాంటి సల్లక్షణాల్ని సేవాకార్యక్రమాల్లో వినియోగించుకున్న మహిళామూర్తి, మూర్తీభవించిన మహిళామణి.
అలనాటి స్వతంత్ర పత్రికలో, ప్రముఖ సంపాదకుడు - ఖాసా సుబ్బారావుగారు 'దుర్గాబయీవ్యక్తిత్వాన్ని ని యిలా వివరించారు.
" దుర్గాబాయి విసుగు విరామంలేని మహిశి, తన సహచరులను కూడా తనలాగే విరామమెరుగని సేవాతత్పరులుగా ఆవేశపూరితులుగా చేయగల నాయకురాలామె. జీవితంలో ఓటమి వుంటుందమే అన్న భయం, ఆమెకు లేదు ... సహారా ఎడారిలో కూడ ఆమెకు చేయడానికి ఏదో సేవాకార్యక్రమం కనిపిస్తుంది."
దుర్గాబాయి 1909 జూలై 15న రాజమండ్రిలో జననం. తాతగారు మనోహరం పంతులు, సంఘ సంస్కరణాభిలాషి, వీరేశలింగం పంతులుగారికి చాలా అండగా వుండేవారు.
చెరగని ముద్ర వేసిన గాంధీజీ చిరునవ్వు1920లో గాంధి ఆంధ్ర పర్యటన అద్భుతమైన ప్రేరణ కలిగించడం, కాంగ్రేసు నిధికి, గాజులను అందించడం, స్ఫూర్తిమూలాన ఆమె హౄదయాన చెరగని ముద్ర వేసింది. హిందీ పాఠశాల నడవడం, విద్యార్ధినులలో ఆమె తల్లి కూడ వుండడం జరిగింది.
సంస్కరణలకు ఎన్నో సమస్యలుఆ కాలంలో వున్న భోగం మేళాలు, దేవదాసీల దుర్భరజీవితాలు, బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా వుండే ముస్లిం మహిళలు సంప్రదాయాలకు బానిసలై బతకడం మూలాన వెలుగుచూపాలన్న నిశ్చయతత్వం, స్త్రీలకొరకు ప్రత్యేక సభలు లాంటి అంశాలు, దుర్గాబాయి సంకల్పదీక్షాకంకణబద్ధతను మరింత బలపరచింది. విరాళాన్ని సేకరించడం, మహిళలకు ప్రత్యేక సభను నిర్వహించేందుకు ఏర్పాట్లను దుర్గాబాయే స్వయంగా చూసింది. మహిళలు, దేవదాసీలు,పరదాస్త్రీలే వచ్చిన సభలో చేసిన గాంధీ హిందీ ఉపన్యాసానికి, దుర్గాబాయి, ప్రతిభావంతమైన తెలుగు అనువాదాన్ని అందించి చాలా పేరు తెచ్చుకుంది. ఫలితంగా, గాంధితోపాటు దుర్గాబాయి కూడ పర్యటనలను చేయవలసివచ్చింది. ఉప్పుసత్యాగ్రహంలో దుర్గ నాయకురాలు, జైలుశిక్షను అనుభవించింది.
బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి మద్రాసు ఆంధ్ర మహిళా సభ వరకు
పట్టుదలతో ప్రైవేట్ చదువు, ఆంధ్రవిశ్వవిద్యాలయం లో సి.ఆర్.రెడ్డిగారిద్వారా మహిళలకు ప్రత్యేక సదుపాయాలను సాధించడం, మద్రాసులో న్యాయవిద్యను అభ్యసించి, సివిల్, క్రిమినల్ కేసులను చేబట్టి, బాగా పేరు సంపాదించారు. వకీలుపనిచేస్తూ, ఆంధ్ర మహిళా సభ భవన నిర్మాణానికి పూనుకోవడం జరిగింది.
ప్రతిభా సామర్ధ్యసేవలకు గుర్తింపు, రాణింపుదుర్గాబాయి ప్రతిభకు, సమర్ధతకు, వచ్చిన గుర్తింపు కు తార్కాణంగా, రాజ్యాంగసభ సభ్యురాలు, ఉద్దండులతో కలసి ప్రాధమిక హక్కులు, స్త్రీలకు ఆస్తిహక్కులులాంటి అంశాలను రాజ్యాంగంలో చేర్పించారు. 1950 నుంచి విస్తరించిన సాంఘికసేవారంగపుసేవలు, ప్లానింగు కమీషన్ సభ్యత్వం (1952), కేంద్ర సామాజికసంక్షేమసంస్థ అధ్యక్షురాలు(1953), రాణింపులు కాక మరి ఏమిటి?
చింతామణి తో జీవితబంధంమహామేధావి, కేంద్ర ఆర్ధికమంత్రి, డా. చింతామణి దేశ్క్ముఖ్ ని వివాహమాడడంలో ఆచరించిన అతి నిరాడంబరత్వమునకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. దేశ్ముఖుగారికి ప్రపంచ ఆర్ధిక సంస్థ లో వచ్చిన ఉద్యోగం, భారతదేశానికి గర్వకారణమవుతుందని నెహ్రూ భావించినా, దుర్గాబాయి సలహా మేరకు - 'అంత డబ్బు మనకెందుకు? మన దేశపు ప్రజల సేవ చేద్దాం. ఆ పదవి వద్దూ అని దంపతులు తీర్మానించుకోవడం, గర్వించదగ్గ ఆ పదవిని సంతోషంగా వదులుకోవడం, వారి జీవితంలో, భారతీయప్రజల హౄదయాల్లో చెరగని ముద్రగా మారింది.
సరిసములు లేని ఆంధ్ర మహిళాసభ సేవా కార్యకలాపాలుఆంధ్రమహిళాసభ సంస్థ తరఫునుంచి అందిస్తున్న సేవలు - మూడు పువ్వులు, ఆరు కాయలుగా - విస్తరించడం, నర్సింగ్ హోం, ఆర్దోపెడిక్ సెంటర్, శిశువిహార్, నర్సస్ హాస్టల్, మరెన్నో వైద్యశాల భవనాలు, దుర్గాబాయి సేకరించిన విరాళాలతో వెలిశాయి. ఈ సంస్థలనన్నిటికీ, దుర్గ మూలకారకురాలు. దేశ్ముఖ్ దంపతుల ఆస్తియావత్తుని, సేవాసంస్థల స్థాపనకు విరాళంగా యివ్వడం, దాంపత్యజీవితం సేవామయంగా సాగింది. లాయరుగా జమీందారుల కేసులన్నీ కోర్టులో వాదించి, గెలిచి వారినుంచి తీసుకున్న ద్రవ్యాన్ని అంధ్రమహిళాసభకు యిచ్చిన త్యాగమూర్తి శ్రీమతి దుర్గాబాయి.
చరమజీవితంలో కూడ సత్కారసన్మానాలు
వయోజన విద్యావ్యాప్తికి నెహ్రూ లిటరసీ సత్కారం (1971), భారతప్రభుత్వం 'పద్మవిభూషణా సత్కారం (1975) ఆమె అసమాన, నిస్వార్ధ సేవలకు గుర్తింపుగా చెప్పుకోవాలి.
సామాన్యవ్యక్తిగా కాక,మహోన్నత వ్యవస్థగా దేశ ప్రజలకు అజరామరమైన సేవలనందించిన దుర్గాబాయి దేశ్ముఖ్ 1981 మే, 9 న కన్నుమూశారు. అంధ్రమహిళాసభద్వారా అందిస్తున్న సేవాపరంపర, దుర్గాభాయి సంకల్పస్ఫూర్తి, నేటికి భారతీయ ప్రజలను, ప్రత్యేకంగా అంధ్రప్రజలను, సేవాసౌభాగ్యంలో ముంచెత్తుతూనేవుంది.
దేశంలో మహిళలు విద్యావంతులైతే సమాజం అభివౄద్ధి చెందుతుంది. ప్రముఖ సంఘసేవకురాలు దుర్గాభాయి దేశ్ ముఖ్ మహిళలు, పిల్లల అభివౄద్ధికి ఎనలేని సేవలు అందించారు. ఆంధ్రమహిళాసభ నిర్వహణలో 'దుర్గాబాయీ శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆనందదాయకం. ప్రతిభాపాటవాలతో జాతీయఖ్యాతిని పొందిన దుర్గాభాయిని దేశ ప్రజ, ముఖ్యంగా మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి.
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత - మొట్టమొదటి మహిళామణి దుర్గాభాయి కావడం మరింత సంతోషదాయకం.
దుర్గాభాయి దేశ్ ముఖ్ - శతజయంతి ఉత్సవాల సందర్భంగా - తెలుగురధం ఆ మహామతల్లికి నమోవాకములు సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
వ్యక్తికాదు .. ఆమె ఒక సంస్థఆమె ఒక వ్యక్తికాదు, రాణించినసంస్థ. వ్యక్తిగా ప్రతిభావతి. బాల్యంలోనే హిందీలో పాండిత్యఫలితంగా పాటలు, పద్యాలు, నాటికలు, కోలాటాలు, దేశభక్తిగేయాలు నిరంతరం చెప్పే బాలహిందీవిద్వాంసురాలు, వీణావాదనంలో దిట్ట. రంగవల్లులను, రంగులమయంగా ప్రదర్శించడం, నిరంతర పరిశ్రమ, కార్యదీక్ష, పట్టుదల, నిజాయతి లాంటి సల్లక్షణాల్ని సేవాకార్యక్రమాల్లో వినియోగించుకున్న మహిళామూర్తి, మూర్తీభవించిన మహిళామణి.
అలనాటి స్వతంత్ర పత్రికలో, ప్రముఖ సంపాదకుడు - ఖాసా సుబ్బారావుగారు 'దుర్గాబయీవ్యక్తిత్వాన్ని ని యిలా వివరించారు.
" దుర్గాబాయి విసుగు విరామంలేని మహిశి, తన సహచరులను కూడా తనలాగే విరామమెరుగని సేవాతత్పరులుగా ఆవేశపూరితులుగా చేయగల నాయకురాలామె. జీవితంలో ఓటమి వుంటుందమే అన్న భయం, ఆమెకు లేదు ... సహారా ఎడారిలో కూడ ఆమెకు చేయడానికి ఏదో సేవాకార్యక్రమం కనిపిస్తుంది."
దుర్గాబాయి 1909 జూలై 15న రాజమండ్రిలో జననం. తాతగారు మనోహరం పంతులు, సంఘ సంస్కరణాభిలాషి, వీరేశలింగం పంతులుగారికి చాలా అండగా వుండేవారు.
చెరగని ముద్ర వేసిన గాంధీజీ చిరునవ్వు1920లో గాంధి ఆంధ్ర పర్యటన అద్భుతమైన ప్రేరణ కలిగించడం, కాంగ్రేసు నిధికి, గాజులను అందించడం, స్ఫూర్తిమూలాన ఆమె హౄదయాన చెరగని ముద్ర వేసింది. హిందీ పాఠశాల నడవడం, విద్యార్ధినులలో ఆమె తల్లి కూడ వుండడం జరిగింది.
సంస్కరణలకు ఎన్నో సమస్యలుఆ కాలంలో వున్న భోగం మేళాలు, దేవదాసీల దుర్భరజీవితాలు, బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా వుండే ముస్లిం మహిళలు సంప్రదాయాలకు బానిసలై బతకడం మూలాన వెలుగుచూపాలన్న నిశ్చయతత్వం, స్త్రీలకొరకు ప్రత్యేక సభలు లాంటి అంశాలు, దుర్గాబాయి సంకల్పదీక్షాకంకణబద్ధతను మరింత బలపరచింది. విరాళాన్ని సేకరించడం, మహిళలకు ప్రత్యేక సభను నిర్వహించేందుకు ఏర్పాట్లను దుర్గాబాయే స్వయంగా చూసింది. మహిళలు, దేవదాసీలు,పరదాస్త్రీలే వచ్చిన సభలో చేసిన గాంధీ హిందీ ఉపన్యాసానికి, దుర్గాబాయి, ప్రతిభావంతమైన తెలుగు అనువాదాన్ని అందించి చాలా పేరు తెచ్చుకుంది. ఫలితంగా, గాంధితోపాటు దుర్గాబాయి కూడ పర్యటనలను చేయవలసివచ్చింది. ఉప్పుసత్యాగ్రహంలో దుర్గ నాయకురాలు, జైలుశిక్షను అనుభవించింది.
బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి మద్రాసు ఆంధ్ర మహిళా సభ వరకు
పట్టుదలతో ప్రైవేట్ చదువు, ఆంధ్రవిశ్వవిద్యాలయం లో సి.ఆర్.రెడ్డిగారిద్వారా మహిళలకు ప్రత్యేక సదుపాయాలను సాధించడం, మద్రాసులో న్యాయవిద్యను అభ్యసించి, సివిల్, క్రిమినల్ కేసులను చేబట్టి, బాగా పేరు సంపాదించారు. వకీలుపనిచేస్తూ, ఆంధ్ర మహిళా సభ భవన నిర్మాణానికి పూనుకోవడం జరిగింది.
ప్రతిభా సామర్ధ్యసేవలకు గుర్తింపు, రాణింపుదుర్గాబాయి ప్రతిభకు, సమర్ధతకు, వచ్చిన గుర్తింపు కు తార్కాణంగా, రాజ్యాంగసభ సభ్యురాలు, ఉద్దండులతో కలసి ప్రాధమిక హక్కులు, స్త్రీలకు ఆస్తిహక్కులులాంటి అంశాలను రాజ్యాంగంలో చేర్పించారు. 1950 నుంచి విస్తరించిన సాంఘికసేవారంగపుసేవలు, ప్లానింగు కమీషన్ సభ్యత్వం (1952), కేంద్ర సామాజికసంక్షేమసంస్థ అధ్యక్షురాలు(1953), రాణింపులు కాక మరి ఏమిటి?
చింతామణి తో జీవితబంధంమహామేధావి, కేంద్ర ఆర్ధికమంత్రి, డా. చింతామణి దేశ్క్ముఖ్ ని వివాహమాడడంలో ఆచరించిన అతి నిరాడంబరత్వమునకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. దేశ్ముఖుగారికి ప్రపంచ ఆర్ధిక సంస్థ లో వచ్చిన ఉద్యోగం, భారతదేశానికి గర్వకారణమవుతుందని నెహ్రూ భావించినా, దుర్గాబాయి సలహా మేరకు - 'అంత డబ్బు మనకెందుకు? మన దేశపు ప్రజల సేవ చేద్దాం. ఆ పదవి వద్దూ అని దంపతులు తీర్మానించుకోవడం, గర్వించదగ్గ ఆ పదవిని సంతోషంగా వదులుకోవడం, వారి జీవితంలో, భారతీయప్రజల హౄదయాల్లో చెరగని ముద్రగా మారింది.
సరిసములు లేని ఆంధ్ర మహిళాసభ సేవా కార్యకలాపాలుఆంధ్రమహిళాసభ సంస్థ తరఫునుంచి అందిస్తున్న సేవలు - మూడు పువ్వులు, ఆరు కాయలుగా - విస్తరించడం, నర్సింగ్ హోం, ఆర్దోపెడిక్ సెంటర్, శిశువిహార్, నర్సస్ హాస్టల్, మరెన్నో వైద్యశాల భవనాలు, దుర్గాబాయి సేకరించిన విరాళాలతో వెలిశాయి. ఈ సంస్థలనన్నిటికీ, దుర్గ మూలకారకురాలు. దేశ్ముఖ్ దంపతుల ఆస్తియావత్తుని, సేవాసంస్థల స్థాపనకు విరాళంగా యివ్వడం, దాంపత్యజీవితం సేవామయంగా సాగింది. లాయరుగా జమీందారుల కేసులన్నీ కోర్టులో వాదించి, గెలిచి వారినుంచి తీసుకున్న ద్రవ్యాన్ని అంధ్రమహిళాసభకు యిచ్చిన త్యాగమూర్తి శ్రీమతి దుర్గాబాయి.
చరమజీవితంలో కూడ సత్కారసన్మానాలు
వయోజన విద్యావ్యాప్తికి నెహ్రూ లిటరసీ సత్కారం (1971), భారతప్రభుత్వం 'పద్మవిభూషణా సత్కారం (1975) ఆమె అసమాన, నిస్వార్ధ సేవలకు గుర్తింపుగా చెప్పుకోవాలి.
సామాన్యవ్యక్తిగా కాక,మహోన్నత వ్యవస్థగా దేశ ప్రజలకు అజరామరమైన సేవలనందించిన దుర్గాబాయి దేశ్ముఖ్ 1981 మే, 9 న కన్నుమూశారు. అంధ్రమహిళాసభద్వారా అందిస్తున్న సేవాపరంపర, దుర్గాభాయి సంకల్పస్ఫూర్తి, నేటికి భారతీయ ప్రజలను, ప్రత్యేకంగా అంధ్రప్రజలను, సేవాసౌభాగ్యంలో ముంచెత్తుతూనేవుంది.
దేశంలో మహిళలు విద్యావంతులైతే సమాజం అభివౄద్ధి చెందుతుంది. ప్రముఖ సంఘసేవకురాలు దుర్గాభాయి దేశ్ ముఖ్ మహిళలు, పిల్లల అభివౄద్ధికి ఎనలేని సేవలు అందించారు. ఆంధ్రమహిళాసభ నిర్వహణలో 'దుర్గాబాయీ శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆనందదాయకం. ప్రతిభాపాటవాలతో జాతీయఖ్యాతిని పొందిన దుర్గాభాయిని దేశ ప్రజ, ముఖ్యంగా మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి.
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత - మొట్టమొదటి మహిళామణి దుర్గాభాయి కావడం మరింత సంతోషదాయకం.
దుర్గాభాయి దేశ్ ముఖ్ - శతజయంతి ఉత్సవాల సందర్భంగా - తెలుగురధం ఆ మహామతల్లికి నమోవాకములు సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment