కొంపెల్ల శర్మ
జాతికి భాష జీవం
"వాచామాంధ్రమయీనాం య: ప్రవక్తా ప్రధమో భవత్ఆచార్యాం తం కవీంద్రాణాంవందే వాగనుశాసనం!"
తెలుగుభాషా పదసంచయానికి సువ్యవస్థిత సుస్వరూపాన్ని కల్పించి గ్రంధస్థం కాదగిన దశ నిరూపించిన శబ్దశాసనుడు పరమపూజ్య నన్నయభాట్టారకులాదివారికి తెలుగు జగతి శాశ్వత ప్రాతిపాదికపై నివాళులర్పించడం వినా తెలుగుజాతికి ముక్తి, మోక్షం లేవు.
అసలు భాష అంటే ఏమిటి?
భాషలు సముదాయంలో భావాభివ్యంజన సాధనంగా ఉపయోగపడేది భాష. భాష దౄశ్యశ్రవణ సంకేత రూపకమై ఉంటుంది. సారం జనవ్యవహారంలో రూడియై, అనుకరణ శిక్షణద్వారా, భాషా నైపుణ్యాలు అర్జింపబడుతున్నాయి. భావం భాషలో వ్యక్తరూపం సంతరించుకుంటుంది; అటు భాషద్వారా భావోదయమూ ప్రేరితమవుతుంది. ఈ విధంగా భాషాభావనలు పరస్పరాశ్రయాలు. వీటిల్లో భవన అధమమైంది; భాష ద్వితీయం, ఇతర ప్రాణికోటితో మానవుడు ఏయే అంశాల్లో భేదిస్తాడు - అనే చర్చ వచ్చినపుడు, భాష చాల ప్రముఖమైనదిగా స్ఫురిస్తుంది.
భేదాలు, వాదాలు
భాషలలో భేదాలా వేషములో భేదాలా, దేశములో భేదాలా దేహములో భేదాలా, పరస్పర విభేదాలా మరణాంతోన్మాదాలా, మతకలహ నినాదాలా మహామతుల వాదాలు - అని ప్రముఖకవి, వానమామలై వరదాచార్యులు భాషల్లోని భేదాలని, వాదాలని చెప్పకయే చెప్పారు.
తెలుగుభాష ప్రస్థానం
తీయని, వినసొంపైన పలుకు గల భాష తెలుగుభాష. 'ఆంధ్రత్వ మాంధ్ర భాషా చా ప్యాంధ్రదేశ: స్వజన్మభూ: తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపస: ఫలం' అని ప్రముఖ తమిళపండితుడు అప్పయ్య దీక్షితులచే కొనియాడబడిన భాష మనది. యూరపు దేశాల్లో ఇటలీ భాష ఎంత ప్రసిద్ధమైందో, ఆసియా ఖండంలో తెలుగు అంత ప్రశస్తమైంది. 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' గాఅ తెలుగుకు పెరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అజంతమైన భాష, సంగీతానికి ఎంతగానో అమరుతున్న భాష, ద్రావ్విడభాషల్లో అన్నింటికన్న అధికంగా మాట్లాడే భాష, ఏ విషయాన్నైనా వ్యక్తీకరించగలిగిన భాష, ఆZంధ్రభోజుడు తనకాలంలో రాజభాషగా సంగీత సాహిత్య రాజ్యపాలనా వ్యవహారాలకు అనువైనదిగా ప్రకటించిన భాష, యావత్తు దక్షిణదేశానికీ రాజభాషగా అధికకాలం అమలుపరచిన భాష, ముత్యాల కోవలాంటి అక్షరాలను అందించిన లిపిగల భాష, మిక్కిలి స్వతంత్రంగా పరిణమించిన భాష, కాలక్రమేణ, రూపుదిద్దుకుని, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, బౄహత్పలాయనులు, విష్ణుకుండినులు, చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజసార్వభౌములద్వారా కవిత్రియం కరకమలాలనుంచి, పరవస్తు చిన్నయసూరి, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, కందుకూరి వీరేశలింగం సంకల్ప దీక్షాకంకణబద్ధతవల్ల వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడచుకుంటూ నడతలు నేర్చుకుని విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతవంతమైన భాషగా పేరుపొందినది. ప్రముఖ దేశభక్తుడు కొండా వెంకటప్పయ్య పంతులు, బాపట్లలో జరిగిన ప్రధమ ఆంధ్ర మహాసభలో 1913) మాతౄభాషగా తెలుగు వైశిష్ట్యాన్ని చర్చించారు. తిరుపతి విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ కవిపింగళి లక్ష్మీకాంతంగారి ఆధ్వర్యాన జరిగిన గోష్టి(1964)లో అనేక విషయాలను చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. ఆధునిక భాష వినియోగం, తెలుగు మాధ్యమికం ప్రవేశం, తర్వాత తెలుగు అకాడమీ స్థాపనకు దారితీసాయి. ప్రముఖ మలుపు, 1966లో తెలుగును అధికారభాషగా అమలు చేయాలని చట్టం చేయడం జరిగింది. అమలుపాటుతనం మాట ఎలావున్నా, అధికారికంగా తెలుగుభాషను అధికారభాషగా ప్రకటన, చట్టం వచ్చాయి మన రాష్ట్రానికి, తెలుగునేలకు.
భాష మన శ్వాస
భాషలొక పది తెలిసిన ప్రభువు తరచు చూసి, మేల్బంతిగా కితాబిచ్చిన భాష, తెలుగు మన శ్వాస అన్నాడో ఒక యువకవి. వేల్వేల వత్సరాల ఘన తెలుగు చరితను స్వంతం చేసుకున్న తరతరాల భవ్య సంస్కౄతికి వారసులం మన తెలుగులం. భూనభోంతరాళ దిగంతాల పర్యంతం పరివ్యాప్తమైన తెలుగుజాతి యశ:పరిమళాన్ని ఆసాంతం ఆస్వాదించాలేకాని, వర్ణించనలవికానిది. ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, తల్లి భూమిభారతిని పొగడడమే, జాతి నిండు గౌరవాన్ని నిలుపడమే. ఏ సీమచేరినా, ఏగడ్డ మెట్టినా, 'తెలుగువాడూ అన్నది మనం తెల్లకాగితంపై నిత్యం వ్రాసుకునే చిరునామా. మూలాలను మరచిపోకూడని మూలధనం.
మహానుభావులను శిలాప్రతిమలుగా ...
ప్రతిభ మనిషి మననం చేసినన్నాళ్ళూ గుర్తింపుకు పూర్తిగా రాకపోవడం సహజంగా వస్తున్న రీతిరివాజు అయిపోయింది. ఒకవేళ ప్రతిభను గుర్తించినా, అది ఒక సన్మానం, దుశ్శాలువా, జ़్జాపికతో తిరిగిరాని మలుపు తిరుగుతోంది. అప్పుడప్పుడు శ్రీలు, భూషణలు, రత్నలు పేరునుపెంచుకొనేందుకు సహకరిస్తున్నాయి. ఎవరి ప్రతిభను వారే ప్రచురించుకునే స్వీయవిశ్లేషకులుగా మారుతున్న వైనం కూడ గమనిస్తున్నాం. మరీ కాదుకూడదు అనుకునే పరిస్థితి వస్తే, ఏ భాగ్యనగరంలోనో ఈ జంటనగరాలూ - సంస్కౄతీకళాచిహ్నప్రతిమలుగా ఘనప్రతిష్ఠను గావిస్తున్నారు. ఆ శిలావిగ్రహాలు వెలిసిపోతున్నా, వివర్ణమవుతున్నా, ప్రతిభకు పునరుద్ధరణ అనవసరం అనుకునే అమాత్యవర్గమే అధికతరం అవుతున్న అమానుషకాలంలో పబ్బం గడుపుతున్న అనివార్యపౌరులుగా అల్పజీవనంలో అలుక్కుపోతున్నాం. విద్వత్తుకు విగ్రహాలను కల్పించి, నిగ్రహాలను కోల్పోతూ, ఆగ్రహాన్ని పెంచుకుంటున్నాం. రాజకీయాలు ఎంత కళాత్మకంగా రాజిలుతున్నాయో చెప్పలేకపోతున్నాం కాని, కళారంగం మాత్రం రాజకీయరాచపుండు కుళ్ళి, ఘనరణంగా మారిపోతోంది. కాకాలు, బాకాలు పట్టినవారికే కవికోకిలలు, కళానిధి గౌరవాలు. జ़్జానపీఠపురస్కారాలకు లక్ష్యాలు, లక్షణాలు అన్యరూపం దాలుస్తున్నాయి. బిరుదలకోసం బిక్షాటన కార్యక్రమం అదౄశ్యపర్వంగా చెల్లుబడి అవుతున్న కలిఘోరను చవిచూస్తున్న వైనంలో పెనవేసుకున్నాం.
అమౄతశిఖరం నుంచి మౄతకుహరం లోతుల్లోకి!
ఒక్కొక్క భాషకు ఒక్కొక్క మర్యాదలుంటాయి. మాతౄభాష అంటే ఎవ్వరికైనా వ్యావహారికం అవుతుంది కాని, గ్రాంధికం కాదు. కాలమునుబట్టి, దేశమునుగాంచి, ప్రభుత్వమునెంచి, దేశభాషాలలితాంగి మారు అని ప్రముఖ పండితుడు చెళ్ళపిళ్ళవారు తమ అనుభూతిని అందించారు. సంఘంలో రంకెలేసుకుంటూ వస్తున్న విప్లవపంధాధోరణులు తెలుగు భాష విషయంలో అదేగమనం కనిపించుటలేదు. భాషను మార్చడానికి భావాలను మార్చాలి. జీవితపు పోకడలనే మార్చాలి. మన:ప్రపంచానికి బాహ్యరూపం భాష అన్నది సత్యమైనా, భాషవిప్లవమే భావవిప్లవంగా పరిగణించాలి. విప్లవాత్మకమైన మార్పులు - వసుధైవకుటుంబం, సమాచార సాంకేతిక విప్లవం విశ్వవ్యాప్తంగా హెచ్చువేతలు వేసుకుంటుంటే, మనభూమిలో భాష, వ్యవహారికం, క్రమేపీ సన్నగిల్లుతున్నాయి. భాషను భాషించడంలో సిగ్గుపడడంలా భావిస్తున్న తరుణంలో - ఒకే మాతౄభాష అయిన యిద్దరు అన్యభాషలో మాట్లాడుకునే సన్నివేశం, సంభాషణ ఎలా అవుతుంది? అందుకే, పరువుతూలిన ఈ అనాదరణ విధాన, మేటి నీ భాష పొలిమేర దాటలేదు అన్నాడు ప్రముఖ కవి గుర్రం ఝాషువా. అంతేకాదు, ఆగ్రహించిరేని ఆంగ్లమునతప్ప తెలుగుభాషలోన తిట్టరెవరు. మకరకుండలాల మహిత విద్వద్వర్యుడేని నాగరికత లేని పశువు, అని అంటాడు ఝాషువా, నాకధ రచనలో. నాభాష అమౄతసమానం అని బేషజాలు పలుకుతున్నా, వేష భావాలకు తగ్గట్టుగా భాషను ధరించటంలేదు. సమాజంలో ఒకరి భావాలు మరొకరికి తెలియటానికి వీలుగా ఏర్పడిన ధ్వని సంకేతాల నియతనిర్మాణం భాష అన్నారు. సమాజం దీన్ని సమిష్టిగా సౄష్టించుకుంది. సమిష్టి సాధనంగా వాడుకుంటూంది. సమాజంలో వివిధస్థాయిలున్నట్లుగానే, భాషలో కూడ వివిధ స్థాయిలుంటాయి. వివిధ రంగాల్లో పరిణామాలు వచ్చినట్లుగానే భాషలో కూడా పరిణామాలు వస్తూంటాయి. అంటే, పాతవి తొలగి పోతూండడం కొత్తవి చేరుతూండడం జరుగుతూ ఉంటుంది. ఈ పరిణామాల నన్నిటినీ స్వీకరిస్తూ సమకాలీన వాగ్వ్యవహారానికి అద్దంపట్టేదే జీవద్భాష. అట్లాలేనిది మౄతభాష. మన మాతౄభాష అయిన తెలుగు విషయంలో, దేశంలో అత్యధికంగా మాట్లాడే స్థాయి రెండవస్థానంలో వున్నాసరే, పాతని కాదనుకోవడంలో తుఫాన్ మెయిల్ గమనాన్ని పాటిస్తూ, కొత్తని ఆహ్వానించి, ఆదరించడం వొంటెద్దుబండి నడక, పల్లేరు నడక మాదిరి కుంటుతూ నడకను సాగిస్తోంది. యిలా అయితే, యునెస్కోవారు తస్మాత్!జాగ్రత్త! అని హెచ్చరికలు చేయక ఏం చేస్తారు?
భావం - భాష
భావాన్ని, భాషని సంథానిస్తూ, మహాకవి విశ్వనాధవారు - భావములు మానవ నిష్ఠములు; భాష జాతినిష్ఠం. ఈ జాతినిష్ఠమైన భాష భావములయందు కూడ విలక్షణత్వం సంపాదిస్తుంది. కనుక, భాషానిష్ఠమైన సంప్రదాయంతో కూడిన భావసంపత్తు వేఋరు. కలగూరగంపయైన భావాలపద్ధతి వేరు. అందుకనే, తనదేశభాషయందు సందిగ్ధమైన కవితాశక్తి కలవాడు వానినింగ్లీషుభాష లోనికి తర్జుమాచేసి గొప్పకవిగా అవుతున్నాడు. అవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని భావాలకు జాతీయతాముద్ర తక్కువ. వానికి దేశభాషాపాండిత్యం కంటే ఇంగ్లీషుభాషాపాండిత్యం ఎక్కువ - అని అంటారు. పరమ ఛాందసులు, పండితోత్తములు, సంప్రదాయవాది కనుక, భాషకు, భావాలకు జాతీయతాముద్ర గురించి అభిళషించారు. మనకు, మనమాతౄభాష అయిన 'తెలుగూ ప్రాంతీయ, రాష్ట్రీయవాదానికే నోచుకోకపోతే, జాతీయతాముద్ర అన్నది పరమ హాస్యాస్పదమే కదా.
కాలధర్మం
కాలాలు ఎన్ని అంటే, మన భాష విషయంలో చెప్పడం బహుశ కష్టమే అనుకోవాలి. యింక భాషారక్షకులు, భాషాప్రచారోద్యమ (వ్)నాయకుల విషయం చెప్పాలంటే, ప్రజాకవి కాళోజీ కవిత స్మరణకు వస్తుంది. - వెనుకకు చూస్తే భూతం, కనిపించును చూడకు అటు. లభ్యంకాని భవిష్యం లక్షిస్తూ రభసపడకు. వర్తమానం వ్యర్ధం చేయని కర్తవ్యం నీదని మరువకు. పశ్చాత్తప్తులు పూర్వతప్తులు, ప్రస్తుత మెరుగని వ్యక్తులు, వ్యర్ధులు - అని నిష్కర్షగా చెప్పాడు. అలాగే, భాష విషయంలో, దు:ఖాలు, బాధలు, యుద్ధాలగాధలను మరచిపోవాలి. కర్తవ్యాన్ని భావిస్తూ, ముందుకు దూసుకుపోవాలి.
తెలుగు భాషోద్యమ ప్రచార కౄషి
ఉద్యమాలు అధికంగా నినాదాలతో, వివాదాలతో, వాదవేదాలతో, వాడిగా వేడిగా, వడివడిగానే నడుస్తూంది. ఎటొచ్చీ, ముందుకో, వెనుకకో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎక్కడో నూటికొక్కటి విషయంలోనే త్వరితగతిని ముందుకు పోతూ, సాగిపోతూ, సాధనసిద్ధికోసం పయనిస్తుంది. కాని మన తెలుగుభాష విషయానికొస్తే, అందరూ, ఎప్పుడూ చెప్పుకునే, తెగులుతనమే స్ఫురిస్తుంది. తెలుగుభాషలో యింతవరకూ కేవలం యిద్దరినే వరించిన భారతీయ జ़్జానపీఠపురస్కృఆన్ని, రెండవసారె వరించిన సి.నారాయణరెడ్డెగారి కవితలో చెప్పాలంటే - ఎవరో నాటిన మొక్కలు ఇంకా వౄక్షాలు కాలేదు. ఎవరో చూపిన చుక్కలు ఇంకా ఇందుబింబాలు కాలేదు. ఎక్కడున్నావు గొంగడీ అంటే, అక్కడే ఉన్నానంటే సరిపోదు - అన్నారు. కాని సరిపోదు అంటే ఏం చేసేది. వేరే గత్యంతరం కనుచూపుమేరకు అంతగా కనిపించనప్పుడు.
ఈ దుస్థితికర అయోమయంలో, మనతెలుగుగడ్డపై, తెలుగుభాషాబ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆఖరిదశకు చేరుకుంటున్నాయి. నిర్వాహకుల నిర్వాకమెంతో, అంచనాలు ఏదిశలో, దశలో ఉన్నాయోమరి, వేచిచూద్దాం. భాషాప్రచారోద్యమ అధినాయకుల ఉత్సవాలు, సంబరాలు, సన్మానాలు, దుశ్శాలువల రెపరెపలు, అనుభూతులు, అనుభవాలు, కోకొల్లలుగా మాటల్లో కోటలు దాటుతున్నాయి. చేతలరూపం ఎలా దాలుస్తాయో. ఆంధ్రులకు దుర్యోధనుడిలా ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. కాని, నేటి సగటు తెలుగువాడిగా రెండూ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎటొచ్చీ, ఆచరణే కరువవుతోంది.
మన తెలుగుభాషను ముందుకు తీసుకుపోదాం. మాతౄమూర్తితో సరిసమానంగా గౌరవిద్దాం. తెలుగుభాషను ప్రాచీనభాష హోదాను పొందడానికి నేను సైతం అంటూ, ముందుకు దూసుకుపోదాం. ఆశయాన్ని, నిండు హౄదయంతో సఫలీకౄతం అయ్యేట్లు ఆచరణకు పూనుకుందాం. విజయకేతనాన్ని త్వరలోనే ఎగరేద్దం. మన తెలుగురధాన్ని వినువీధుల్లో సగర్వంగా, సునానాదాలతో, నడిపిద్దాం.
ఆశయసిద్ధికై, ప్రతీ తెలుగుపౌరుడిని తెలుగుజర్నల్ మనసావాచాకర్మణా అభినందనల్ని తెలుపుతోంది. అభివాదం చేస్తోంది. శుభ: భూయాత్.
కొంపెల్ల శర్మ
జాతికి భాష జీవం
"వాచామాంధ్రమయీనాం య: ప్రవక్తా ప్రధమో భవత్ఆచార్యాం తం కవీంద్రాణాంవందే వాగనుశాసనం!"
తెలుగుభాషా పదసంచయానికి సువ్యవస్థిత సుస్వరూపాన్ని కల్పించి గ్రంధస్థం కాదగిన దశ నిరూపించిన శబ్దశాసనుడు పరమపూజ్య నన్నయభాట్టారకులాదివారికి తెలుగు జగతి శాశ్వత ప్రాతిపాదికపై నివాళులర్పించడం వినా తెలుగుజాతికి ముక్తి, మోక్షం లేవు.
అసలు భాష అంటే ఏమిటి?
భాషలు సముదాయంలో భావాభివ్యంజన సాధనంగా ఉపయోగపడేది భాష. భాష దౄశ్యశ్రవణ సంకేత రూపకమై ఉంటుంది. సారం జనవ్యవహారంలో రూడియై, అనుకరణ శిక్షణద్వారా, భాషా నైపుణ్యాలు అర్జింపబడుతున్నాయి. భావం భాషలో వ్యక్తరూపం సంతరించుకుంటుంది; అటు భాషద్వారా భావోదయమూ ప్రేరితమవుతుంది. ఈ విధంగా భాషాభావనలు పరస్పరాశ్రయాలు. వీటిల్లో భవన అధమమైంది; భాష ద్వితీయం, ఇతర ప్రాణికోటితో మానవుడు ఏయే అంశాల్లో భేదిస్తాడు - అనే చర్చ వచ్చినపుడు, భాష చాల ప్రముఖమైనదిగా స్ఫురిస్తుంది.
భేదాలు, వాదాలు
భాషలలో భేదాలా వేషములో భేదాలా, దేశములో భేదాలా దేహములో భేదాలా, పరస్పర విభేదాలా మరణాంతోన్మాదాలా, మతకలహ నినాదాలా మహామతుల వాదాలు - అని ప్రముఖకవి, వానమామలై వరదాచార్యులు భాషల్లోని భేదాలని, వాదాలని చెప్పకయే చెప్పారు.
తెలుగుభాష ప్రస్థానం
తీయని, వినసొంపైన పలుకు గల భాష తెలుగుభాష. 'ఆంధ్రత్వ మాంధ్ర భాషా చా ప్యాంధ్రదేశ: స్వజన్మభూ: తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపస: ఫలం' అని ప్రముఖ తమిళపండితుడు అప్పయ్య దీక్షితులచే కొనియాడబడిన భాష మనది. యూరపు దేశాల్లో ఇటలీ భాష ఎంత ప్రసిద్ధమైందో, ఆసియా ఖండంలో తెలుగు అంత ప్రశస్తమైంది. 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' గాఅ తెలుగుకు పెరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అజంతమైన భాష, సంగీతానికి ఎంతగానో అమరుతున్న భాష, ద్రావ్విడభాషల్లో అన్నింటికన్న అధికంగా మాట్లాడే భాష, ఏ విషయాన్నైనా వ్యక్తీకరించగలిగిన భాష, ఆZంధ్రభోజుడు తనకాలంలో రాజభాషగా సంగీత సాహిత్య రాజ్యపాలనా వ్యవహారాలకు అనువైనదిగా ప్రకటించిన భాష, యావత్తు దక్షిణదేశానికీ రాజభాషగా అధికకాలం అమలుపరచిన భాష, ముత్యాల కోవలాంటి అక్షరాలను అందించిన లిపిగల భాష, మిక్కిలి స్వతంత్రంగా పరిణమించిన భాష, కాలక్రమేణ, రూపుదిద్దుకుని, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, బౄహత్పలాయనులు, విష్ణుకుండినులు, చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజసార్వభౌములద్వారా కవిత్రియం కరకమలాలనుంచి, పరవస్తు చిన్నయసూరి, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, కందుకూరి వీరేశలింగం సంకల్ప దీక్షాకంకణబద్ధతవల్ల వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడచుకుంటూ నడతలు నేర్చుకుని విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతవంతమైన భాషగా పేరుపొందినది. ప్రముఖ దేశభక్తుడు కొండా వెంకటప్పయ్య పంతులు, బాపట్లలో జరిగిన ప్రధమ ఆంధ్ర మహాసభలో 1913) మాతౄభాషగా తెలుగు వైశిష్ట్యాన్ని చర్చించారు. తిరుపతి విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ కవిపింగళి లక్ష్మీకాంతంగారి ఆధ్వర్యాన జరిగిన గోష్టి(1964)లో అనేక విషయాలను చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. ఆధునిక భాష వినియోగం, తెలుగు మాధ్యమికం ప్రవేశం, తర్వాత తెలుగు అకాడమీ స్థాపనకు దారితీసాయి. ప్రముఖ మలుపు, 1966లో తెలుగును అధికారభాషగా అమలు చేయాలని చట్టం చేయడం జరిగింది. అమలుపాటుతనం మాట ఎలావున్నా, అధికారికంగా తెలుగుభాషను అధికారభాషగా ప్రకటన, చట్టం వచ్చాయి మన రాష్ట్రానికి, తెలుగునేలకు.
భాష మన శ్వాస
భాషలొక పది తెలిసిన ప్రభువు తరచు చూసి, మేల్బంతిగా కితాబిచ్చిన భాష, తెలుగు మన శ్వాస అన్నాడో ఒక యువకవి. వేల్వేల వత్సరాల ఘన తెలుగు చరితను స్వంతం చేసుకున్న తరతరాల భవ్య సంస్కౄతికి వారసులం మన తెలుగులం. భూనభోంతరాళ దిగంతాల పర్యంతం పరివ్యాప్తమైన తెలుగుజాతి యశ:పరిమళాన్ని ఆసాంతం ఆస్వాదించాలేకాని, వర్ణించనలవికానిది. ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, తల్లి భూమిభారతిని పొగడడమే, జాతి నిండు గౌరవాన్ని నిలుపడమే. ఏ సీమచేరినా, ఏగడ్డ మెట్టినా, 'తెలుగువాడూ అన్నది మనం తెల్లకాగితంపై నిత్యం వ్రాసుకునే చిరునామా. మూలాలను మరచిపోకూడని మూలధనం.
మహానుభావులను శిలాప్రతిమలుగా ...
ప్రతిభ మనిషి మననం చేసినన్నాళ్ళూ గుర్తింపుకు పూర్తిగా రాకపోవడం సహజంగా వస్తున్న రీతిరివాజు అయిపోయింది. ఒకవేళ ప్రతిభను గుర్తించినా, అది ఒక సన్మానం, దుశ్శాలువా, జ़్జాపికతో తిరిగిరాని మలుపు తిరుగుతోంది. అప్పుడప్పుడు శ్రీలు, భూషణలు, రత్నలు పేరునుపెంచుకొనేందుకు సహకరిస్తున్నాయి. ఎవరి ప్రతిభను వారే ప్రచురించుకునే స్వీయవిశ్లేషకులుగా మారుతున్న వైనం కూడ గమనిస్తున్నాం. మరీ కాదుకూడదు అనుకునే పరిస్థితి వస్తే, ఏ భాగ్యనగరంలోనో ఈ జంటనగరాలూ - సంస్కౄతీకళాచిహ్నప్రతిమలుగా ఘనప్రతిష్ఠను గావిస్తున్నారు. ఆ శిలావిగ్రహాలు వెలిసిపోతున్నా, వివర్ణమవుతున్నా, ప్రతిభకు పునరుద్ధరణ అనవసరం అనుకునే అమాత్యవర్గమే అధికతరం అవుతున్న అమానుషకాలంలో పబ్బం గడుపుతున్న అనివార్యపౌరులుగా అల్పజీవనంలో అలుక్కుపోతున్నాం. విద్వత్తుకు విగ్రహాలను కల్పించి, నిగ్రహాలను కోల్పోతూ, ఆగ్రహాన్ని పెంచుకుంటున్నాం. రాజకీయాలు ఎంత కళాత్మకంగా రాజిలుతున్నాయో చెప్పలేకపోతున్నాం కాని, కళారంగం మాత్రం రాజకీయరాచపుండు కుళ్ళి, ఘనరణంగా మారిపోతోంది. కాకాలు, బాకాలు పట్టినవారికే కవికోకిలలు, కళానిధి గౌరవాలు. జ़్జానపీఠపురస్కారాలకు లక్ష్యాలు, లక్షణాలు అన్యరూపం దాలుస్తున్నాయి. బిరుదలకోసం బిక్షాటన కార్యక్రమం అదౄశ్యపర్వంగా చెల్లుబడి అవుతున్న కలిఘోరను చవిచూస్తున్న వైనంలో పెనవేసుకున్నాం.
అమౄతశిఖరం నుంచి మౄతకుహరం లోతుల్లోకి!
ఒక్కొక్క భాషకు ఒక్కొక్క మర్యాదలుంటాయి. మాతౄభాష అంటే ఎవ్వరికైనా వ్యావహారికం అవుతుంది కాని, గ్రాంధికం కాదు. కాలమునుబట్టి, దేశమునుగాంచి, ప్రభుత్వమునెంచి, దేశభాషాలలితాంగి మారు అని ప్రముఖ పండితుడు చెళ్ళపిళ్ళవారు తమ అనుభూతిని అందించారు. సంఘంలో రంకెలేసుకుంటూ వస్తున్న విప్లవపంధాధోరణులు తెలుగు భాష విషయంలో అదేగమనం కనిపించుటలేదు. భాషను మార్చడానికి భావాలను మార్చాలి. జీవితపు పోకడలనే మార్చాలి. మన:ప్రపంచానికి బాహ్యరూపం భాష అన్నది సత్యమైనా, భాషవిప్లవమే భావవిప్లవంగా పరిగణించాలి. విప్లవాత్మకమైన మార్పులు - వసుధైవకుటుంబం, సమాచార సాంకేతిక విప్లవం విశ్వవ్యాప్తంగా హెచ్చువేతలు వేసుకుంటుంటే, మనభూమిలో భాష, వ్యవహారికం, క్రమేపీ సన్నగిల్లుతున్నాయి. భాషను భాషించడంలో సిగ్గుపడడంలా భావిస్తున్న తరుణంలో - ఒకే మాతౄభాష అయిన యిద్దరు అన్యభాషలో మాట్లాడుకునే సన్నివేశం, సంభాషణ ఎలా అవుతుంది? అందుకే, పరువుతూలిన ఈ అనాదరణ విధాన, మేటి నీ భాష పొలిమేర దాటలేదు అన్నాడు ప్రముఖ కవి గుర్రం ఝాషువా. అంతేకాదు, ఆగ్రహించిరేని ఆంగ్లమునతప్ప తెలుగుభాషలోన తిట్టరెవరు. మకరకుండలాల మహిత విద్వద్వర్యుడేని నాగరికత లేని పశువు, అని అంటాడు ఝాషువా, నాకధ రచనలో. నాభాష అమౄతసమానం అని బేషజాలు పలుకుతున్నా, వేష భావాలకు తగ్గట్టుగా భాషను ధరించటంలేదు. సమాజంలో ఒకరి భావాలు మరొకరికి తెలియటానికి వీలుగా ఏర్పడిన ధ్వని సంకేతాల నియతనిర్మాణం భాష అన్నారు. సమాజం దీన్ని సమిష్టిగా సౄష్టించుకుంది. సమిష్టి సాధనంగా వాడుకుంటూంది. సమాజంలో వివిధస్థాయిలున్నట్లుగానే, భాషలో కూడ వివిధ స్థాయిలుంటాయి. వివిధ రంగాల్లో పరిణామాలు వచ్చినట్లుగానే భాషలో కూడా పరిణామాలు వస్తూంటాయి. అంటే, పాతవి తొలగి పోతూండడం కొత్తవి చేరుతూండడం జరుగుతూ ఉంటుంది. ఈ పరిణామాల నన్నిటినీ స్వీకరిస్తూ సమకాలీన వాగ్వ్యవహారానికి అద్దంపట్టేదే జీవద్భాష. అట్లాలేనిది మౄతభాష. మన మాతౄభాష అయిన తెలుగు విషయంలో, దేశంలో అత్యధికంగా మాట్లాడే స్థాయి రెండవస్థానంలో వున్నాసరే, పాతని కాదనుకోవడంలో తుఫాన్ మెయిల్ గమనాన్ని పాటిస్తూ, కొత్తని ఆహ్వానించి, ఆదరించడం వొంటెద్దుబండి నడక, పల్లేరు నడక మాదిరి కుంటుతూ నడకను సాగిస్తోంది. యిలా అయితే, యునెస్కోవారు తస్మాత్!జాగ్రత్త! అని హెచ్చరికలు చేయక ఏం చేస్తారు?
భావం - భాష
భావాన్ని, భాషని సంథానిస్తూ, మహాకవి విశ్వనాధవారు - భావములు మానవ నిష్ఠములు; భాష జాతినిష్ఠం. ఈ జాతినిష్ఠమైన భాష భావములయందు కూడ విలక్షణత్వం సంపాదిస్తుంది. కనుక, భాషానిష్ఠమైన సంప్రదాయంతో కూడిన భావసంపత్తు వేఋరు. కలగూరగంపయైన భావాలపద్ధతి వేరు. అందుకనే, తనదేశభాషయందు సందిగ్ధమైన కవితాశక్తి కలవాడు వానినింగ్లీషుభాష లోనికి తర్జుమాచేసి గొప్పకవిగా అవుతున్నాడు. అవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని భావాలకు జాతీయతాముద్ర తక్కువ. వానికి దేశభాషాపాండిత్యం కంటే ఇంగ్లీషుభాషాపాండిత్యం ఎక్కువ - అని అంటారు. పరమ ఛాందసులు, పండితోత్తములు, సంప్రదాయవాది కనుక, భాషకు, భావాలకు జాతీయతాముద్ర గురించి అభిళషించారు. మనకు, మనమాతౄభాష అయిన 'తెలుగూ ప్రాంతీయ, రాష్ట్రీయవాదానికే నోచుకోకపోతే, జాతీయతాముద్ర అన్నది పరమ హాస్యాస్పదమే కదా.
కాలధర్మం
కాలాలు ఎన్ని అంటే, మన భాష విషయంలో చెప్పడం బహుశ కష్టమే అనుకోవాలి. యింక భాషారక్షకులు, భాషాప్రచారోద్యమ (వ్)నాయకుల విషయం చెప్పాలంటే, ప్రజాకవి కాళోజీ కవిత స్మరణకు వస్తుంది. - వెనుకకు చూస్తే భూతం, కనిపించును చూడకు అటు. లభ్యంకాని భవిష్యం లక్షిస్తూ రభసపడకు. వర్తమానం వ్యర్ధం చేయని కర్తవ్యం నీదని మరువకు. పశ్చాత్తప్తులు పూర్వతప్తులు, ప్రస్తుత మెరుగని వ్యక్తులు, వ్యర్ధులు - అని నిష్కర్షగా చెప్పాడు. అలాగే, భాష విషయంలో, దు:ఖాలు, బాధలు, యుద్ధాలగాధలను మరచిపోవాలి. కర్తవ్యాన్ని భావిస్తూ, ముందుకు దూసుకుపోవాలి.
తెలుగు భాషోద్యమ ప్రచార కౄషి
ఉద్యమాలు అధికంగా నినాదాలతో, వివాదాలతో, వాదవేదాలతో, వాడిగా వేడిగా, వడివడిగానే నడుస్తూంది. ఎటొచ్చీ, ముందుకో, వెనుకకో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎక్కడో నూటికొక్కటి విషయంలోనే త్వరితగతిని ముందుకు పోతూ, సాగిపోతూ, సాధనసిద్ధికోసం పయనిస్తుంది. కాని మన తెలుగుభాష విషయానికొస్తే, అందరూ, ఎప్పుడూ చెప్పుకునే, తెగులుతనమే స్ఫురిస్తుంది. తెలుగుభాషలో యింతవరకూ కేవలం యిద్దరినే వరించిన భారతీయ జ़్జానపీఠపురస్కృఆన్ని, రెండవసారె వరించిన సి.నారాయణరెడ్డెగారి కవితలో చెప్పాలంటే - ఎవరో నాటిన మొక్కలు ఇంకా వౄక్షాలు కాలేదు. ఎవరో చూపిన చుక్కలు ఇంకా ఇందుబింబాలు కాలేదు. ఎక్కడున్నావు గొంగడీ అంటే, అక్కడే ఉన్నానంటే సరిపోదు - అన్నారు. కాని సరిపోదు అంటే ఏం చేసేది. వేరే గత్యంతరం కనుచూపుమేరకు అంతగా కనిపించనప్పుడు.
ఈ దుస్థితికర అయోమయంలో, మనతెలుగుగడ్డపై, తెలుగుభాషాబ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆఖరిదశకు చేరుకుంటున్నాయి. నిర్వాహకుల నిర్వాకమెంతో, అంచనాలు ఏదిశలో, దశలో ఉన్నాయోమరి, వేచిచూద్దాం. భాషాప్రచారోద్యమ అధినాయకుల ఉత్సవాలు, సంబరాలు, సన్మానాలు, దుశ్శాలువల రెపరెపలు, అనుభూతులు, అనుభవాలు, కోకొల్లలుగా మాటల్లో కోటలు దాటుతున్నాయి. చేతలరూపం ఎలా దాలుస్తాయో. ఆంధ్రులకు దుర్యోధనుడిలా ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. కాని, నేటి సగటు తెలుగువాడిగా రెండూ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎటొచ్చీ, ఆచరణే కరువవుతోంది.
మన తెలుగుభాషను ముందుకు తీసుకుపోదాం. మాతౄమూర్తితో సరిసమానంగా గౌరవిద్దాం. తెలుగుభాషను ప్రాచీనభాష హోదాను పొందడానికి నేను సైతం అంటూ, ముందుకు దూసుకుపోదాం. ఆశయాన్ని, నిండు హౄదయంతో సఫలీకౄతం అయ్యేట్లు ఆచరణకు పూనుకుందాం. విజయకేతనాన్ని త్వరలోనే ఎగరేద్దం. మన తెలుగురధాన్ని వినువీధుల్లో సగర్వంగా, సునానాదాలతో, నడిపిద్దాం.
ఆశయసిద్ధికై, ప్రతీ తెలుగుపౌరుడిని తెలుగుజర్నల్ మనసావాచాకర్మణా అభినందనల్ని తెలుపుతోంది. అభివాదం చేస్తోంది. శుభ: భూయాత్.
కొంపెల్ల శర్మ
No comments:
Post a Comment