Saturday, November 7, 2009

ఎంకిపాటల నిర్మాత - నండూరి వెంకట సుబ్బారావు

ఎంకిపాటల నిర్మాత - నండూరి వెంకట సుబ్బారావు (1884 - 1957)

ప్రజల గుండెల్లో పదిలగీతాలు
క్షాత్కరించిన కవితను అందుకోవడంలో బంధాలను తెంచిన వ్యక్తి. నియమాలను మహాసాహసంతో త్రోసిపార వేయగలిగిన ధైర్యశాలి. గుండెలలోనుంచి సూటిగా, వెచ్చగా ప్రవహించే గీతాలు ఆయనివి. స్వఛ్ఛమైన భూసారంనుంచి ఉత్తేజమందిన సంస్కారం ఆ మనిషిది. హౄదయంతో భావించి, చూపుతో మాట్లాడి, ఊపిరితో తెనిగించే నిపుణమూర్తి. భావాన, భాషలో అన్నిటా సాహసంతో ఎర్రబావుటా పాతడం, ఆ తిరుగుబాటు కొందరకు 'గాలిదుమారం'గా మారడం ఆయన సాహితీజీవనపర్వంలో ముఖ్యాధ్యాయాలు. ప్రతీవారి గుండెలలోనుంచి సూటిగా వెచ్చగా ప్రవహించే గీతాలను రచించి, భావకవితాగగనవీధుల్లోకి వదలిన వదాన్యుడు - నండూరి సుబ్బారావుగారు.

సావాడుక భాష తొంగిచూస్తున్న కాలం
ాడుక, వేడుక భాషల సమరకాలం అది. సాహితీసంస్థలు కేవలం చెప్పుకోడానికే కాని, భాషాపరమైన సేవలను అందించేందుకు నేడే కాదు, ఆనాడే నత్తనడకలు నడిచాయి అనడానికి నిదర్శనం 'ఆంధ్రసాహిత్య పరిషట్. ఆంధ్ర భాషాసాహిత్యాలను ఆధునిక రీతుల్లో అభివృౠద్ధి చేయడానికి కలసిరాదని తీర్మానించుకుని, ఉత్సాహవంతులు కొంతమంది సాహితీసమితి సంస్థను ప్రారంభించారు. సాహితి అనే పత్రిక (1920) లో ప్రారంభించగా, దేవులపల్లి, విశ్వనాధ, మొక్కపాటి నరసింహశాస్త్రి (బారిష్టర్ పార్వతీశ్వం), నాయని సుబ్బారావు ప్రభౄలతోపాటు, ప్రముఖ కవి నండూరి సుబ్బారావు గారు ఒకరు. గిడుగురామమూర్తివారి భాషావాదాన్ని బలపరిచే సంఘం యిది. కాశీనాధుని నాగేశ్వరరావు గారు 'భారతీ (1924) స్థాపించారు.

వా
గురజాడ వారసుల్లో ప్రముఖులు
్రబంధకవి పూర్వబాణీలనుండి వచ్చిన కవిత్వానికి పయనిస్తున్నప్పుడు శబ్దం పై మక్కువ ఎక్కువ చూపడం సహజమే. భావానికి పట్టం కట్టినా, దాని చుట్టూరావున్న ప్రౌఢిమ పట్టు పరదాలు చుట్టబెట్టే ప్రయత్నంలో, గురజాడ వారసత్వ పరంపరలో భాషాసారళ్యానికి ప్రయత్నించిన వారిలో ప్రముఖులుగా - బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు గార్లను చెప్పుకోవాలి.

ప్ర
భావగీతకవితావాహినిలో నండూరి - ఎంకి
ర్డ్స్ వర్త్ ను గురజాడ ఆదర్శంగా చేసుకుని బహుళ ప్రచారం చేశారు. ఆధునిక కవులు సామాన్య ప్రజల సుఖదు:ఖాలన్నీ ఒక్కలాంటివే అనీ, మానవుల్లో ఎక్కువతక్కువలు లేవనీ, ధనిక బీద తేడాలుండవనీ, ఏ యితివౄత్తాన్నైనా తీసుకుని కవిత్వం చెప్పవచ్చనే భావన వున్న కాలం అది. సర్వసామాన్యులైన పాటల ద్వారా ప్రజల అనురాగాలు, అభిలాషలు, అభిమానాలు, అందచందాలు, భావానుభావాలను భావయుక్తంగా ప్రకటించే ప్రయత్నంలో తనదైన ప్రతిభను ప్రదర్శించి, గురజాడ ఆశయాలలో ఆచరణలోకి తెచ్చిన భావకవితామూర్తి - నండూరి సుబ్బారావు. నండూరి వారు వ్రాసిన 'ఎంకిపాటలూ మరోసౄష్టిని కలిగించాయి. గురజాడ - పున్నమ, విశ్వనాధ - కిన్నెర లాగా నండూరి - ఎంకి పాటలద్వారా కదంతొక్కింది. ఆనాడు గాలి దుమారం రేగినా, ఆ గొడవలు చల్లారి, చక్కని పాటలు మాత్రం నేటికీ నిత్యనూతనంగా అలరిస్తూనేవున్నాయి.

నండూరి వ్యక్తిత్వం
ండూరి వెంకట సుబ్బారావుగారు 9 నవంబర్ 1884 లో జన్మించారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుకున్నారు. ఆరోజుల్లోనుంచే కవిత్వం వ్రాయడం మొదలయ్యింది. న్యాయవాదవౄత్తిని చేపట్టారు. న్యాయవాదంతోనే కవితావాదం చేశారు.

నం
నండూరి గొంతునుంచి విన్న శ్రీశ్రీ
ావ కవిత్వ స్వభావ, ప్రభావాల ప్రాభవం వెలిగిపోతున్నకాలంలో వయసుకి తగ్గ వైఖరి, ఆశ్చర్యం లేని స్ఫురణలు, భావకవులను ఆవహించాయి. ప్రముఖ భావకవులు అంతా, 1891-1900 మధ్య కాలంలోనే జన్మించారు. ఆరుద్రగారు 18 మంది ప్రముఖ భావకవులను వివరించారు. సనాతనుల దూషణలు, సమకాలికుల సహౄదయ దీవెనలు వర్షిస్తున్న కాలం. అయితే, వీరందరి భావకవిత్వ సమగ్ర స్వరూప దర్శనం అపురూపంగా పరిగణించబడింది. ముద్దుకౄష్ణ భావకవులపై 'వైతాళికులూ సంకలనాన్ని తీసుకువచ్చారు. మహాకవి శ్రీశ్రీ కూడ కొంపెల్ల జనార్దనరావు ద్వారా మద్రాసులో తొలిసారిగా ఎందరో వాంగ్మయమూర్తులను కలుసుకోవడం జరిగిందని చెప్పినవారిలో నండూరి వారు ప్రముఖులే కాక, మొదటిసారి నండూరి సుబ్బారావు గారి ముఖతా 'ఎంకిపాటలూను వినడం జరిగిందని చెప్పాడు.

భా
నండూరి భావకవితలకు అడవి బాపిరాజుగారి భావనాచిత్రాలు
నాటి విశ్వనాధ కిన్నెరపాటలకి, నండూరి ఎంకిపాటలకి, ప్రముఖ కవి, చిత్రకారుడు, అడవి బాపిరాజుగారు చిత్రాలని వేయడం పాటలకి మరింత సొగసుని కలిగించాయి.

జానపద సొగసు గుబాళింపులు
ానపదుల్ పురీజనుల్ సంతసముం బ్రమదం బెలర్పనీదైన శుభోదయంబ హౄదయంబుల గోరుచునున్న వారు - అని ఎర్రన అంటాడు. అటువంటి జానపద పరిమళశోభితమైన భావగీతాలు, నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు. అదే తీరులో నడుస్తాయి ఎంకిపాటలు.

జా
ఎంకివొంటీ పిల్ల లేదోయ్!
ఎంకీని సరైన భావంతో ఊహించడం బహు దుర్లభం. సుబ్బారావుగారి భావనతో భావించడం యింకా క్లిష్టతరం. ఎంకి ఆకారం నండూరి వారి భాషలోనే చెప్పాలంటే - మెళ్ళో పూసలపేరు, తల్లో పూవులసేరు, కళ్ళెత్తితే కనకాభిషేకాలు, చెక్కిట చిన్నమచ్చ, వొక్క నవ్వే యేలు వొజ్జిర వొయిడూరాలు, పదమూ పాడిందంటే పాపాలూ పోవాల!, కతలూ సెప్పిందంటే కలకాల ముండాల! రాసోరింటికైన రంగు తెచ్చే పిల్ల అని వర్ణిస్తారు. సరిగ్గా, అలాగే, ఎంకిపాటలు కలకాలం ఉండేలానే రచించి, చిరస్థాయిగా భద్రపరచుకునేలా

' చేశారు మన నండూరి సుబ్బారావుగారు.
నాయకి 'ఎంకీ
ంకి నాయకి మనకు అడుగడుగునా పఠితల్లోకి దూసుకు వస్తుంది. సుబ్బారావుగారు పాటల శీర్షిక గమనిస్తే, ఎంకి పేరుతోనే చాలా పాటలు ఉన్నాయి. అవి, ఎంకితనం, ఎంకితో భద్రాద్రి, ఎంకికళ, ముద్దుల నా యెంకి, ఆ కాలపు నా యెంకి, ఎంకికల, సత్తెకాలపు నా ఎంకి, కటిగ్గుండెల నా ఎంకి, యెంకిపయనం, యెంకిసూపు, యెంకిరాణి, దూరాననాయెంకి, యేటిదరి నా యెంకి, నమిలిమింగిన నా ఎంకి, ఎంకితో తిరుపతి, ఎర్రినాఎంకి, ఎంకి ముచ్చట్లు, గమనిస్తే, ఒక వ్యక్తి సాధారణ మానవజీవితంలో నిత్యం కదలాడే సంగతులు, విషయాలు మనకు ఈ శీర్షికలా స్ఫురిస్తాయి.

ఎం
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!
ండూరి వారు రచించిన ఎంకిపాటలు 'ముద్దుల నా యెంకీ అన్న పాట 'గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ' అన్న పల్లవితో శ్రీకారం చుట్టడమేకాదు, అదే పేరుతో ఎంకి పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. మద్రాసులో కాలేజీనుండి వస్తూ ట్రాంబండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలవోకగా స్ఫురించిన సాహిత్యం ఎంకిపాటలకు నాందీప్రస్తావనలు పలకడం జరిగింది. ఈ పాటల్లో విశేషం ఏమిటంటే, కేవలం పాటలను రచించడమే కాక, ప్రతీపాటకు సంప్రదాయంగా సంగీత స్వరబద్ధం చేయడం మరొక విశేషం.

నం
ఎంకి పాటలు
్రతీ కవి హౄదయం వున్న వ్యక్తీ, నండూరిని, ఎంకిపాటలని తలచుకొన్నప్పుడు, నా సొమ్ము నా గుండె నమిలి మింగిన పిల్ల, యెంకివొంటీపిల్ల లేదోయ్ అని నిత్యమంత్రజపం చేయాల్సిందే.

ప్ర
ురూడా! అన్న పాటలో, యెంకి! మన మిద్దరమె యెవ్వరొద్దన్నాడు, కలకాల మీ దినమె నిలుసు మనకన్నాడు, గాలికైనా తాను కవుగిలీనన్నాడు, నను సూసి నవ్వేవు-నాయమా నాముద్దు, మద్దె సెంద్రుడె మనకు పెద్దమనిసన్నాడు, అన్న పదాలలో పొదిగిన శౄంగారరసం యింతకన్న మధురంగా ఎక్కడ కనిపిస్తుందో చెప్పేవాళ్ళకి ఒక సవాలు అనే చెప్పాలి. సత్తెకాలపు నాయెంకి అన్న పాటలో, 'నీతోటే వుంటాను నాయుడు బావా' అన్న పాట, తెలుగుసినీమాలో నీతోటి వుంటాను శేషగిరిబావా' అని పెట్టి పేరుపొందారు. యెర్రి నాయెంకి అన్న పాటలో - యెనక జన్మములోన యెవరమో నంటి, సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకీ అన్నపాటలో, సిగ్గొచ్చి నవ్వింది అన్నది మంచి ప్రయోగం. దీ
చెం
దుపావళి సందర్భంగా గుర్తుచేసుకోవలసిన పాట, దీపం లో - ఆరిపేయవే దీపమా, యెలుగులో నీమీద నిలపలేనే మనసు, ఆరిపేయవె దీపమా, అన్నపాటలో, వెలిగున్న దీపం సరసశౄంగారపర్వానికి అడ్డువస్తోంది కనుక ఆరిపేయవె అని మంచి పరోక్షంగా దంపతులమధ్య అన్యోన్యతను తెలిపే పాట. దీప సుందరితోటి సామత్యమా నాకు, దీప సుకుమారి దరిదావు చనగలవా (దీపసుందరి) కూడ వెలుగులమయం. ఎక్కవే కొండ నెక్కవే, నా పక్క నెంకి యెక్కవే, కొండనెక్కవే, అని ముందుగతి పాట మంచి ఊపునిచ్చింది.
మలిదశగా కొత్తపాటలు
ండూరి వారు ఎంకి పాటలను, మలిదశగా కొత్త పాటలని రచించారు. కోటిగొంతులు కలసి పాటపాడే తీరు, వెలుగు నీడల నడుమ నిలిచి ఆలింతు - అని చీకటి వెలుగులు అన్న పాటతో పున:ప్రారంభం కావించారు. పూలబాసలు తెలుసు యెంకికీ తోటపూల మనసు తెలుసు యెంకికీ, యింతేనటే సంద్రమెంతో యనుకొంటి మనకూ సూరీడుకూ మద్దెనుండేనా!, పూవు నేనైతే నీ వలపునౌదు - పూనిన్నె జగమంత ధ్యానింపజేతు,

నం
ూరి వారు ఎంకిపాటలని - 'ముద్దుల నా ఎంకీ అన్న సరస పరిచయంతోటి శ్రీకారం చుట్టి, ఉత్తమాటలు అన్న పాటతో మొదటిభాగాన్ని రచించారు. రెండవభాగాన్ని, 'వెలుగునీడలూ అని ఎంకిని తత్వధోరణిలోకి దింపి, తన పాటల రచనను తపస్సుగా భావించారో ఏమో, 'తపస్సూ అన్న పాటలో - సాగరుని సల్లాపమాఅ అల చందురుని ఉల్లాసమా సిక తాతలాల విలాసమా, ఆ పగిది బంధించు నీకనుపాప నెయ్యది తాపసీ? అని సుమనోల్లాసంగా, జనరంజకంగా స్వస్తి పలికారు.
నం
డూ'నండూరీ ఎంకి పాటలు - ఎనలేని అమౄత ఘుటికలు
ిరవై శతాబ్దికాలం తెలుగుసారస్వతంలో నండూరి వారి ఎంకి పాటలను, పండితులకు సైతం రూపింప శక్యము కాని రసస్వరూపాలు, భావనాశక్తి గల ప్రతీవారికీ గోచరించి మూర్తీభవింపజేసే అమౄత ఘుటికలు అని చెప్పబడ్డాయి.

యి
పాటల షీర్షికల్లో 'ఎంకీ మమైకం
ండూరి వారు ఎంకి పాటలకు నిర్థారించిన షీర్షికలు కూడ కడు నూతనత్వంతో దర్షనమిస్తాయి. ముద్దుల నా యెంకి, యెంకి ముచ్చట్లు, యెంకితో తిరపతి, సత్తెకాలపు నాయెంకి, దూరాన నాయెంకి, యేటిదరి నా యెంకి, నమిలి మింగిన నా యెంకి, కటిగ్గుండెల నా యెంకి, యెంకితో బద్రాద్రీ, యెంకిసూపు, యెర్రి నా యెంకి, యెంకి పయనం, ఆ కాలపు నా యెంకి అని మొదటి దషలోని పాటల్లో కనిపిస్తాయి.

నం అలాగే మలిదషలో వ్రాసిన కొత్త పాటల్లో కూడ, యెంకిరాణి, ఎంకి కళ, ఎంకి కల అంటూ నామకరణం చేస్తూ, చక్కని ఔచిత్యాన్ని ప్రదర్షిస్తూ, "ఎంకితనము" అంటారు.
ముద్దుకౄష్ణ ప్రషంస
ైతాళికులు అన్న కవితల సంపుటిని సంకలనం చెసిన ముద్దుకౄష్ణ గారు, నండూరి వారిని పరిచయం చేసిన తీరు మనల్ని పరవషుల్ని చేస్తుంది. "తనకు సాక్షాత్కరించిన కవితను అందుకోడంలో బంధాలను తెంచివేషాడు. నియమాలను తోసిపారవేషాడు. మహా సాహసంతో ఈయన గీతాలు గుండెలలో నుంచి సూటిగా, వెచ్చగా ప్రవహిస్తవి. ఈయన సంస్కారం స్వఛ్ఛమైన భూసారం నుంచి ఉత్తేజమందింది. మహా సున్నితమైన హౄదయంతో భావిస్తాడు. 'చూపుతో మాటాడీ 'ఊపిరితో తెనిగించే' నిపుణుడు. భావంలో, భాషలో, అన్నిటా సాహసంతో ఎర్రబావుటా యెత్తినాడు. ఈ తిరుగుబాటు కొందరికి 'గాలి దుమారా మైంది. కొందరికి నవయుగ ప్రభాతవాయు ప్రసరణమైంది." ఈ మాటలు మాత్రం అక్షరాలా నూటికి నూరుపాళ్ళు సత్యం. ముద్దుకౄష్ణ తన వైతాళికుల సంపుటిలో - నండూరి వారి యెంకి పాటలను - పూలబాసలు, పిలుపు, ముందుగతి, దీపం, సుక్క, నమిలిమింగిన నా యెంకి, కలత నిదుర, ఆ కాలపునా యెంకి, ఆనాటి నావోడు, కలలోన నా యెంకి, కోయిల, పడవ, జంట నా యెంకి అన్న పాటలను ఎన్నుకున్నాడు.

వై
నారాయణ రెడ్డి భావకవిత్వం పై నండూరి వారిపై విష్లేషణ

ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయములు, ప్రయోగములు అన్న సూదీర్ఘ పరిషోధన గ్రంథంలో ఆరవ అధ్యాయంగా భావకవిత్వానికి కేటాయిస్తూ, భావకవిత్వ షాఖలను - ప్రణయ, దేషభక్తి, ప్రకౄతి, సంఘ సంస్కరణ, భక్తి, స్మౄతికావ్యములని విభజించి విషిష్టమైన విష్లేషణను అందించారు. ప్రప్రథమంగా ప్రస్తావించబడ్డ ప్రణయకవిత్వం గురించి వివరిస్తూ -వస్త్వాష్రయరీతి, ఆత్మాష్రయరీతి అని విభజిస్తూ, ఆత్మాష్రయరీతిని - స్వఛ్ఛంద ప్రణయం, పూర్వభాగం, సంయోగదష, ఆశాభంగం-విప్రలంభం, విషాదస్థితి, పలాయనతత్త్వము-నిరాషావాదము, విషాద మాధురి, ఊహా ప్రేయసి సౄష్టి, ప్రేయసీ పూజ్యత, కులపాలికా ప్రణయం, అని కావించిన ప్రస్తావనలు నండూరి యెంకిపాటలకు ఎక్కడో అక్కడ అన్వయం చేసుకోవచ్చునని యెంకి పాటలను చదివిన వారికి అనిపించక మానదు. నారాయణ రెడ్డిగారు శౄంగార నాయకుల ప్రస్తావన తెస్తూ, కవులు-వారి ప్రేయసుల గురించి విష్లేషిస్తూ 'హౄదయేష్వరి, ఊర్వషి(కౄష్ణషాస్త్రి), వత్సల(నాయని), షషికళ(బాపిరాజు), కిన్నెర (విష్వనాథ) తోపాటు, నండూరి వారి ప్రణయ నాయికను ప్రత్యేక ప్రస్తావన చేషారు. మిగతా నాయికలతో పోలిస్తే, యెంకి అడవి మల్లె వంటిది అన్నారు నారాయణరెడ్డిగారు.
ఎంకిపాటలకు ఎంతెంత ఆదరణాభిమానాలు!
ేవలం పదాలతో రచనలు చేసి పాటలుగా పొందిక చేయడమే కాక, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పారుపల్లి రామకౄష్ణయ్యగారు ఎంకిపాటలకి స్వరరచనలను కూర్చడం, నండూరివారే స్వీయగళంతో వాటిని పాడడం జరిగిన గతవైభవపరంపరకు స్మౄతిచిహ్నాలు.

కే
ి పాటలను ప్రత్యక్ష పరోక్షాలుగా ఆదరించిన ప్రముఖుల్లో - మంచాల జగన్నాధరావు, కట్టమంచి రామలింగారెడ్డి, వేదం వెంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, గిడుగు రామమూర్తిపంతులు, మల్లంపల్లి సోమసేఖరశర్మ, బూర్గుల రామకౄష్ణరావు, యం.చలపతిరావు, బుచ్చిబాబు, రజని, ఆడవి బాపిరాజు, ద్వారం వెంకటస్వామి నాయుడు, నటరాజ రామకౄష్ణ, విశ్వనాధ సత్యనారాయణ, దేవులపల్లి కౄష్ణశాస్త్రి, గుడిపాటి వెంకటాచలం, శ్రీశ్రీ, శివశంకరస్వామి, జరుక్క్ శాస్త్రి లాంటి సాహితీకళాకారులతోపాటు, ఆకాశవాణి, చిత్రరంగం, సాంస్కౄతీసంస్థలు, గాయనీగాయకులు, ఎందరో మహానుభావులు, అందరూ ఎంకిపాటలకు బ్రహ్మరధం పట్టించారు. న
ఎం
కిడూరి సుబ్బారావు గారి 'ఎంకి పాటలూ - నాటినుంచీ నేటివరకూ, ఎన్నటికీ, ఎప్పటికీ, అక్షరాలున్నంతకాలం, సంగీతస్వరాలు పల్లవిస్తున్నంతకాలం, మనకు ప్రతినిత్యం, మనజీవితాల్లో, దర్శనం అవుతూనేవుంటాయి. ప్రతివారి గుండెలెలోనుంచి సూటిగా వెచ్చగా ప్రవహించే గీతాలు - ఎంకి పాటలు - నండూరి వారి నవగీతాలు,నవ్యగీతాలు.
నండూరి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా తెలుగురథం సాహితీగీతసంగీతనీరాజనాల్ని వినమ్రంగా సమర్పించుకుంటూ ...
ొంపెల్ల షర్మ - తెలుగురథం.

కొం

1 comment:

Anonymous said...

కొంపెల్ల శర్మ గారు,
your blog is excellent.