Saturday, September 5, 2009

డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ జన్మదినం - ఉపాధ్యాయ దినోత్సవం - 5 సెప్టెంబరు

ఉపాధ్యాయ దినోత్సవం - 5 సెప్టెంబరు
డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ జన్మదినం ( 1888 - 1975 ) ఉపాధ్యాయుడు అంటే ... ఈ శతాబ్దం యొక్క దురదౄష్టం ఏమిటంటే నేర్చుకోవడం మానివేసినవాళ్ళు బోధించడం ప్రారంభిస్తున్నారు అని ఆనాడే అన్నాడు బెర్నార్డ్ షా. నేర్వడం తెలియని వాళ్ళే నేర్పుతున్నారు అని ఆస్కార్ వైల్డ్ అన్నాడు. ఉపాధ్యాయుడు నేర్చుకుంటూనే వుంటేతప్ప యదార్ధంగా చదువు చెప్పలేడు అన్నాడు ప్రముఖ కవి, గురువు రవీంద్రనాధ్ ఠాగూర్. ఆచార్యదేవోభవ! వౄత్తి, వ్యాపారం ఏదైనా మనిషి ప్రవౄత్తిని బట్టి దాని సార్ధకత నిరూపణ అవుతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మన సంస్కౄతి - ఆచార్యదేవోభవ - అని చాటిచెప్పింది. యింకా వివరంగా చెప్పాలంటే, 'గురువులో త్రిమూర్తులు త్రికాలాల్లో దర్శనీయమవడమే కాకుండా, గురువుని సాక్షాత్తుగా 'పరబ్రహ్మాగా వర్ణించడం, గురువుగా కీర్తింపబడుతున్న ఉపాధ్యాయునికి సమాజంలో అత్యంత ప్రాధాన్యం సంతారించుకుంది అన్న భావనలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఆ విలువ తెలియనివారు, 'బతకలేక బడిపంతులూ, 'ఏవో పాఠాలు చెబుతూంటాడుటా అని వర్ణించడంలో వారివారి సంకుచిత మనస్తత్వం బయటపెట్టుకోవడమే. ఉపాధ్యాయునికి ప్రత్యేకంగా - సెప్టెంబర్ 5 న దినోత్సవాలు ఉపాధ్యాయవౄత్తిలో వున్నవారు - వారికి ఒక మహనీయ ఆదర్శమూర్తి లభిస్తాడని, ఆయన జన్మదినం - ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి, వౄత్తికి సార్ధకత చేకూర్చుతారని, ఎంతమంది ఊహించారో చెప్పలేని పరిస్థితి. సెప్టెంబర్ 5 మాత్రం ప్రతీసంవత్సరం - ఉపాధ్యాయులకు గర్వదినం. శుభదినం. ఆరోజే, డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్, విశ్వవ్యాప్తంగా మానవజాతి గర్వించదగ్గ మహామేధావి జన్మదినం - మరువలేని మహనీయుల చరిత్రలో ఒక స్థానం, ప్రస్థానం లభించింది. భారతదేశం ఆయన ప్రముఖ ఆచార్యునిగా గుర్తించడం కూడ మన ఆచార్యసంస్కౄతికి నిదర్శనం, తార్కాణం. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ప్రతీ సంవత్సరం, గణనీయమైన సేవలను అందించి, ప్రఖ్యాతవహించిన ఉపాధ్యాయులను కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింది సన్మాన, సత్కారాలతో గౌరవించడం, ఒక సత్సంప్రదాయంగా, సదాచారంగా వస్తున్నది. ఈ ఉపాధ్యాయుడు - అధిష్ఠాత తత్వవేత్త, సౌమ్యుడు, మహామేధావి, గొప్ప గ్రంధకర్త, మనస్తత్వశాస్త్రంపై మక్కువ, సాధికారత, అసమాన వాగనుశాసనుడు, పాశ్చాత్య తత్వశాస్త్రాలపై అవగాహనాపరుడు, ఛలోక్తులను, హాస్యోక్తులను దొర్లించటంలో బహునేర్పరి, ప్రపంచదేశాల మన్ననలను పొందిన ప్రముఖవ్యక్తి, అవసాన దశలో కూడ వదలని తాత్వికబోధకుడు, చింతనాపరుడు, ఎవరోకాదు, ఆయనే, డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్. అంతేకాదు, సర్వేపల్లివారు - విదేశీరాయబారి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా, నిర్వహించిన పదవులు ప్రతిభాసోపానాలు. డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ జీవనయానం ఆనాటి మద్రాసు నగరానికి 40 మైళ్ళ దూరాన వున్న తిరుత్తణి లో జన్మించాడు మన సర్వేపల్లి వంశాకురం. తండ్రి వీరాస్వామయ్య ఒక జమిందారిలో తహసీల్దార్. ప్రాధమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిష్టియన్ కాలేజీలలో ముఖ్యంగా సాగిన చదువు యం.ఎ. వరకు చదివాడు. బాల్యంనుంచి అసాధారణమైన తెలివితేటలతో, విద్యార్ధిదశలోనే, మనస్తత్వశాస్త్రంపై ఉపన్యాసాలతో అనేకమందిని అలరించేవారట. కేవలం 21 ఏళ్ళకే మద్రాసు క్రిష్టియన్ కాలేజీలో తత్వశాస్త్రంలో సహాయ ప్రొఫెసర్ పదవిని ప్రతిభావంతంగా నిర్వహించారు. వేదాంత, తత్వశాస్త్రాల్లో పరిశోధనలను చేశారు. సర్వేపల్లి ప్రతిభను గమనించి, మైసూరు విశ్వవిద్యాలయంవారు ప్రొఫెసర్ పదవినిచ్చారు. 1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో, ఐదవ కింగ్ జార్జ్, మానసిక, నైతిక తత్వశాస్త్రంలో పరమాచార్య పదవిని, 1931లో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉపకులపతిగాను, విరాజిల్లారు. పుష్కరకాలంపాటు (1925-37) భారతీయ తత్వశాస్త్ర సమావేశానికి అధ్యక్షపదవిని సరిసములులేని ప్రతిభాపాటవాలతో నిర్వహించారు. 1939లో బ్రిటిష్ అకాడమీవారు ఫెలో గౌరవం, ఆ ఏటనే పండిట్ మదనమోహన్ మాలవ్య బెనారస్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించడం అమితగౌరవానికి తార్కాణమేకాక, ఆ పదవిని 1948 వరకూ నిర్వహించడం ఆయన ప్రతిభకు కలికితురాయి. నాలుగేళ్ళు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, మత, నీతి శాస్త్రాల్లో ఆచార్యపదవినిచ్చారు. 1946-52 మధ్య భారతీయ ప్రతినిధి బౄందం యునెస్కో యాత్రకు నాయకత్వం వహించారు. ఉన్నతవిద్యాసంస్కరణల సంఘానికి అధ్యక్షునిగా (1949), రష్యాకు భారత రాయబారిగా (1949-52) తనపదవిని అత్యంత కౌశలత్వంతో నిర్వహించిన సర్వేపల్లివారు, దశాబ్దికాలం భారతదేశం ఉపరాష్ట్రపతిగా కొనసాగారు. యునెస్కోలో జరిగే సాధారణ సమావేశానికి అధ్యక్షపదవిని (1952-54) నిర్వహించారు. మరొక ప్రతిభాపదవిని చెప్పాలంటే, పుష్కరకాలంపాటు (1953-62) ఢిల్లీ విశ్వవిద్యాలయం కులపతిగా కొనసాగడం, మరొక మలుపు, మైలురాయి. 1962-67 కాలంలో భారతదేశానికి ప్రధమ పౌరసత్వపు ప్రతినిధిగా, రాష్ట్రపతి పదవిని నిర్వహించారు. 1969లో అత్యున్నత గౌరవం, భారతరత్న వరించింది. ప్రముఖులైన మహాత్మాగాంధి, రవీంద్రనాధ్ ఠాగూర్, జవహర్ లాల్ నెహ్రూ లతో పరిచయం కల్గిన రాధాకౄష్ణన్ కు బ్రిటిష్ మహారాణి నుంచి గౌరవ ప్రతిభా సభ్యత్వాన్ని అందచేశారు. 1964లో ఆరవ పోప్ జాన్ పాల్, దేశాధినేతనుంచి వాటికన్ అత్యంత ఉన్నతగౌరవాన్ని పొందడం జరిగింది. 1975లో టెంప్లెటన్ పురస్కారం - పొందిన క్రైస్తవేతరుల్లో మొదటివాడు మన సర్వేపల్లి ప్రతిభారత్నం. ఈ పురస్కారం ద్వారా లభించిన 96000 డాలర్ల నగదును ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయసంస్కౄతి ప్రసంగాలకై విరాళంగా అందజేయడం, ప్రముఖులు కె.యం.మున్షీ తో కలసి భారతీయ విద్యాభవన్ ను స్థాపించడం సర్వేపల్లి జీవితంలో మరో మలుపులు, మెరుపులు. ప్రతిభావంతమైన రచయిత కేవలం ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, ఉప-కులపతి, రాయబారి కాదు. భారతదేశపు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను నిర్వహించిన సర్వేపల్లి రాధాకౄష్ణన్ ప్రతిభావంతమైన రచయిత. 150కి పైగా తన రచనలతో భారతీయతను, సంస్కౄతీవైభవాల్ని చాటిచెప్పిన తత్త్వవేత్త, తత్వమసి. భారతీయ తత్వశాస్త్రం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ధమ్మపాదకు విశ్లేషనాత్మక వ్యాఖ్యానాలు మరపురాని మధురగుళికలు. హిందుజీవనశైలి, మతతత్వధోరణి, మతం-సమాజం, ఠాగూర్ తత్వవిధానం, భావినాగరికత, యిత్యాది అంశాలపై ఉద్గ్రంధరచనలు సర్వేపల్లిని ఉన్నతశిఖరాలకు తీసుకెళ్ళాయి. రాధాకౄష్ణన్ వ్యక్తిత్వాన్ని తపోమునిగాను, మానవత తన మతంగాను ఏకాభిప్రాయంగా వర్ణించబడ్డాడు. రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసి, 1967 నుంచి చివరిరోజు వరకు (17.4.1975) మద్రాసులోని తమ నివాసంలో, తాత్వికచింతనతో కాలం గడిపారు. పరమాచార్యునిగా గుర్తించిన భారతదేశం, రాధాకౄష్ణన్ జన్మదినాన్ని, ఉపాధ్యాయదినంగా దేశం యావత్తూ ప్రతీ ఏట జరుపుకోవడం మనకు పెద్దపండుగగా భావించవచ్చు. సర్వేపల్లివారి వ్యక్తిత్వం - ప్రముఖుల ప్రశంసలు నన్ను రాక్షసునిగా కాక, మనిషిగా గుర్తించిన వారు మీరొక్కరే; మీరు త్వరలో స్వదేశానికి తిరిగి వెళ్తున్నట్లు విన్నాను; అందుకు విచారిస్తున్నాను. - స్టాలిన్ - రష్యాధినేత. మీ రచనలు చాలా గొప్పవి; కాని నా అభిప్రాయం వినండి; నేను మీ అర్జునిణ్ణి. మీరు నా కౄష్ణభగవాన్. - మహాత్మాగాంధి. గురుశిష్యుల హౄదయ, ప్రేమానుబంధాలు కలకత్తా విశ్వవిద్యాలయపు ఆచార్యపదవిని చేపట్టమని రవీంద్రనాధ్ ఠాగూర్, డా.అశుతోష్ ముఖర్జీ లు కోరగా - మైసూర్ విశ్వవిద్యాలYఅం నుంచి కలకత్తా వెళ్ళేముందు - మైసూర్ లోని యింటిముందు గుర్రపుబండి సిద్ధం అయింది. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పేందుకు విద్యార్ధులు ఆయన యింటికి వచ్చారు. బండికి కట్టిన గుర్రాలను వదలించి, రైల్వేస్టేషన్ వరకూ గుర్రంలేని గుర్రంబండిని ఆ విద్యార్ధులే స్వయంగా లాక్కొని వెళ్ళారు. అది విద్యార్ధులకు ఆయన పట్ల వున్న ప్రేమ, గౌరవ, భక్తి, శ్రద్ధల మీద అపూర్వసంకేతాలు. అది గమనించిన రాధాకౄష్ణన్ హౄదయం ద్రవించడామే కాదు - కళ్ళుకూడ చెమ్మరించాయి. గురుశిష్యుల, హౄదయానుబంధం, ప్రేమానుబంధం ఒక్కసారి పెల్లుబికాయి. ఈనాటి గురువులు, శిష్యులు యిద్దరిలో కనపడని వస్తువులు, దౄశ్యాలు. గురుదేవోభవ అన్న ఆర్యోక్తి ఆయనపట్ల నిజమయింది. సహవిద్యార్ధికి జ్ణానోదయం సర్వేపల్లివారు స్కూలులో చిన్నవిద్యార్ధిగా వున్నప్పుడు, క్లాసులో ఒక విద్యార్ధి, అధ్యాపకుడి కుర్చీకి తారుపూసి, గురువునే ఏడిపించే ప్రయత్నం చేయగా, ఆ తప్పుచేసిన విద్యార్ధి తనపేరును అడిగినాకూడ క్లాసు మొత్తం చెప్పలేదు. అప్పుడు రాధాకౄష్ణన్ ఆ తప్పుచేసిన పిల్లవాడి పేరును చెప్పి, కుర్చీని తాను స్వయంగా శుభ్రం చేసి, ఆ విద్యార్ధిని శిక్షించవద్దని ప్రార్ధించాడట. నేరం చేసిన ఆ విద్యార్ధిని క్లాసు బయట తన్నబోతే - నేను చెప్పకబోతే ఇదే తప్పును నువ్వు మళ్ళీ చేస్తావు - అంటూ ఆ విద్యార్ధికి జ్ణానోదయం చేశాడు. అభిళషనీయాలు భారతీయౌన్నత్యంపై తనకున్న ఆత్మవిశ్వాసాన్ని - నేను ఆక్స్ఫర్డ్ వెళ్తే, అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను; కాని, విద్యార్ధిగామాత్రం వెళ్ళను అన్నది సంకల్ప దీక్షాకంకణ బద్ధతకి నిదర్శనం. సర్వేపల్లి వారి అభిలాషను చెప్పాలంటే - మానవజీవితంలో మంచిని పెంపొందించడం, ఉత్తమ సమాజాన్ని రూపొందించడం, మతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలని బోధించడం, మానవుల్లోని మమతానురాగాలను పెంచుటకు ప్రపంచవ్యాప్తంగా కౄషి, అహింసావిధానం ద్వారా ప్రపంచ దేశాలన్నింటిలో శాంతిని పెంచడం లాంటి మహనీయ, బౄహత్తర ప్రణాలికలను, ఆశయాలను ఆశాపూరితంగా ప్రచారం చేసి ప్రతిభావంతంగా సత్ఫలితాలను పొందగలిగిన ౠషితుల్యుడు. పంచసూత్రాలు ప్రజ్ణానం, కుశలత, సమగ్రావగాహన, సుస్ఫష్ట సమన్వయం, సహౄదయత, సంపూర్ణమానవునికి వుండవలసిన సల్లక్షణాలు. మొదటి జత మేధస్సు పరమైతే, మిగతావి హౄదయసంబంధితాలు. ఈ లక్షణసారం శ్రీ రాధాకౄష్ణన్ గారిలో పుష్కళంగా నిబిడీకౄతమైవున్నాయి. సర్వేపల్లి వారి భావపరంపర సైన్స్, టెక్నాలజీ, కేవలం ఉద్యోగదౄష్టితో అందిస్తున్న కౌశలత్వపు విద్యావిధానం - విలువలులేని విద్య, విద్యాలయాలమయంగా మారిపోయింది. ఈనాటి విద్యకు విలువలు విషయంలో దౄష్టిపెట్టలేని ఉపద్రవ పరిస్థితిలో సాగుతోంది అన్నది నగ్నసత్యం. విద్యావిధానం ముఖ్య సూత్రాలను బోధించే దిశలో అమలు జరగాలి. దేశభక్తిపూరితమైన గతచారిత్రాత్మక విషయావగాహన, గతకాలపు విధానాలకు బానిసలు కాకుండా కలిగించాలి. సంకుచిత మనస్తత్వధోరణి ప్రేరేపించక, దీర్ఘప్రణాళిక దౄష్టిని పెంపొందించాలి. మతవాదం, అతివాద ధోరణికి దారితీయనీయక, నూతనస్ఫూర్తిని కలిగించాలి. మహమ్మారి లక్షణాలైన, అసూయాద్వేషాలు, అసహనం, హింసాత్మకచర్యలు అరికట్టే నిష్కళాత్మకమైన సంస్కరణాత్మక చర్యలు, సంస్కౄతీభావాన్ని అలవరచుకోవడం, సర్వమతసహన, సమానదౄష్టిని పెంపొందించుకునే కార్యక్రమాలు ఆచరణకు రావాలి. మనస్తత్వ శాస్త్రవేత్తలు మానవమేధస్సుని విశదంగా విశ్లేషించి, కుడి ఎడమైతే పొరబాటు బాబోయ్ అని నిర్ధారించారు. నూతనత్వం, శ్రద్ధాసక్తులు, ఊహాగానం, విశ్వాసం, అభిమానం, దానగుణం, సహాయం, సహనాది లక్షణాలు, ఒకవైపున, తర్కం, న్యాయనిర్ణయశక్తి, సద్విమర్శనాధీమంతుడు, ప్రశ్నించే హక్కు, జవాబు చెప్పగల కలేజా, మరోప్రక్కన మేధస్సు నిర్వహణాప్రక్రియలో పరికరాలు అని చెప్పడం జరుగుతోంది. ఈ రెండు వర్గాల సమన్వయ సమీకౄత సంహారమే, విద్యయొక్క విలువలను నిర్ణయించేది; మానవ వ్యక్తిత్వానికి పరిపూర్ణత, సార్ధకత, అప్పుడే సంతరించేది అని చెప్పవచ్చు. పై లక్షణాల్ని, ప్రత్యక్ష, పరోక్షాలుగా డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ గారి లో సంతరించుకున్నాయి అన్నది విశ్వవ్యాప్తంగా అంగీకరించిన సత్యం. అందుకే ఆయన మహామహోపాధ్యాయుడు. ఆయన జన్మదినాన్ని, ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాధాకౄష్ణన్ ఛలోక్తులు రాజ్యసభలో సభ్యుల గురించి అధ్యక్షపీఠంలో వున్న సర్వేపల్లి - ఈ వేళ మనతో సీత, సావిత్రి, పార్వతి వున్నారు అని సభ్యులపేర్లు క్లుప్తంగా పేర్కొనగా, మహావీర్ త్యాగి సమాధానంగా - సార్, వీరితోపాటు, మాతో రాధాకౄష్ణులూ స్వయంగా వున్నారు అని చెప్పారుట. భూపేష్ గుప్తా గురించి రాజ్యసభలో నెహ్రూ యిచ్చే సమాధానంలో కల్పించుకుని, భూపేష్గుప్తా, సమయోచితమైన ప్రశ్న అడగడానికి రాష్ట్రపతి రాధాకౄష్ణన్ అనుమతిని కోరాడట. దానికి సమాధానంగా - ఈయన మొదటిసారిగా రాజ్యసభలో సమయోచితమైన ప్రశ్న వేస్తున్నారు! అందరూ సావధానంగా వినండి - అని ఛలోక్తిని విసిరారు. విదేశంలో జరిగిన కంటి శస్త్రచికిత్సపై పత్రికావిలేఖరుల ప్రశ్న ఏం సార్! భారతదేశంలో, ఈపాటి కంటి శుక్లం తీసే నేత్రవైద్య ప్రముఖులు లేరా? అన్న విమర్శాత్మక ప్రశ్నకు సమాధానంగా సర్వేపల్లివారు - లేకేం వున్నారు! ఒకసారి ఒక కంటికి శుక్లం తీసారు, వాళ్ళ పుణ్యాన నేను శుక్రాచారినయ్యాను! యిక రెండోకంటికి ఆపరేషను చేయించుకుంటే ఈసారి ధౄతరాష్ట్రుడినయ్యాననుకోండి! ఇబ్బందిలో పడిపోతాను కదా! అన్నారట. డా. సర్వేపల్లివారు ఎంత పండితుడో, అంతకు మించిన వేదాంతి. గంభీరతను పుణికిపుచ్చుకున్న ఘనాపాటి. ఆయన పైకి ఎంత గంభీరంగా వుంటారో, సమయం వస్తే, చెణుకులు విసరటంలో, ఆయనకు ఆయనేసాటి. ఆయన అంటించే చురకలో ఎంత వ్యంగ్యం వుంటుందంటే - ఆ వ్యంగ్య వైభవానికి అందరూ నవ్వవలసిందే. ఆచార్య దేవో భవ: గురవే నమ:


ప్రముఖ తాత్త్వికుడు, పండితుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవంకూడా జరుపుకునే సత్సంప్రదాయాన్ని పాటించే నేటిరోజున విశ్వవ్యాప్తంగా ఉపాధ్యాయులను, ఆచార్యులను, అయ్యవారలను నిత్యం విద్యాబిక్షని ప్రసాదించే గురుపరంపరకు నాంది పలికిన సందర్భంగా తెలుగు రథం శతథా, సహస్రధా ప్రణామాల్ని సపర్పిస్తున్నాము. ఉపాధ్యాయులందరికీ ప్రణామాలు, అబినందనలు తెలుపుకుంటూ -


కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: