Tuesday, January 20, 2009

అన్నమయ్య - లక్షగళ సంకీర్తనార్చన - సిలికానాంధ్ర


సిలికానాంధ్ర, తిరుమల తిరుపతి దేవస్థానములు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,సాంస్కౄతిక శాఖసంయుక్త ఆధ్వర్యంలో


అంతర్జాతీయ అన్నమాచార్య 601వ జయంత్యుత్సవం
లక్షగళ సంకీర్తనార్చన
ఆదివారం, మే 10, 2009, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్

సిలికానాంధ్ర తెలుగు, సాహితీ, సాంస్కౄతిక సంప్రదాయ స్ఫూర్తితో గత 7 సంవత్సరాలుగా అమెరికాలోనూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అచ్చమైన తెలుగుదనం ప్రతిబింబించే అనేక కార్యక్రమాలని చేపడుతోంది. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది యువతీ యువకులు పాల్గొని తెలుగు సంస్కౄతి గొప్పతనాన్ని చాటుతున్నారు.
600ల ఏళ్ళనాడు తెలుగు నాట జన్మించి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని తన వేలాది కీర్తనలతో అర్చించి తరించిన ధన్య చరితుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు. ప్రతి ఏటా అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని సిలికానాంధ్ర అపూర్వమైన రీతిలో నిర్వహిస్తున్నది. అన్నమయ్య జయంతిని ఒకసారి రాష్ట్రమంతటా, మరోసారి దేశమంతటా, ఇంకొకసారి ప్రపంచమంతటా ఒకేరోజున ఒకే రీతిలో నిర్వహించి, అన్నమయ్య సంకీర్తనా వైభవాన్ని చాటిచెప్పింది. ఇప్పుడు అన్నమయ్య 601వ జయంతిని ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో నిర్వహించ తలపెట్టింది.
లక్షమంది గాయనీ గాయకులు చిన్నా పెద్దా తేడా లేకుండా యువత ప్రధానపాత్ర వహించి అన్నమయ్య సప్తగిరి సంకీర్తనలు -
1. భావములోన 2. బ్రహ్మకడిగిన పాదము 3. ఎంతమాత్రమున 4. పొడగంటిమయ్య 5. కొండలలో నెలకొన్న 6. నారాయణతే నమో నమో 7. ముద్దుగారె యశోద
ఏకకాలంలో, ఏకస్వరంగా ఆలపించి గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పబోతున్నారు.
ఆదివారం మే 10, 2009 నాడు జరిగే ఈ "లక్షగళ సంకీర్తనార్చన" కు సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ వేదిక కానుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని చూసి రికార్డు నమోదు చేయబోతున్నారు. అన్నమయ్య సంకీర్తనావైభవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పే ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గాయనీ గాయకులను మనసారా ఆహ్వానిస్తున్నాము. ఇందులో పాల్గొనదలచిన వారు 100/- రూపాయలు తమ దగ్గరలోని ఆంధ్రాబ్యాంక్ సాఖలో చెల్లించి తమ అపేరును నమోదు చేసుకోగలరు. లక్షగళ సంకీర్తనార్చనలో నమోదు చేసుకొని పాల్గొను గాయనీ గాయకులకు రైల్వే కన్సెషన్ ఇవ్వబడుతుంది. ఈ అపూర్వమైన కార్యక్రమ వివరాలు మీ బంధుమిత్రులందరికీ తెలియపరచి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించండి.
మరిన్ని వివరాలకు :మొబైల్ : 99892 95939. లాండ్ లైన్ : 040 - 2717 1876. ఈ-మైయిల్:
సందేహాలకు, సంప్రదించవలసిన చిరునామా:సిలికానాంధ్ర, ఫ్లాట్ నెం. 203, శ్రీ హర్ష రెసెడెన్సీ, రోడ్ ణొ.6, హబ్సిగుడా, హైదరాబాద్-500 007.
మీరు తెలుగురథం నిర్వాహకులను కూడ సంప్రదించవచ్చును.
కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురథం.

ఫోన్: +91 40 65975574/2768 5351. మొబైల్: +91 97017 31333. +91 90007 31333.

No comments: