జానుతెనుగు కవితురంగం - గుర్రం జాషువా వర్ధంతి - 24 జూలై
( 1895 - 1971 )
మధుర శ్రీనాధుడు
బ్రతుకు బాధల చేదును ఆస్వాదించి మధురమైన కవిత ద్వారా సంకుచిత మతాతీతమైన కవితలను వెలువరించినవాడు. ప్రజల నాలుకలయందు జీవించిన సుకవి. సంస్కార ప్రియుల హౄదయాల్లో జీవిస్తున్న వ్యక్తిత్వం. కవిత్వాన్ని అతని వ్యక్తిత్వంనుంచి విడదీసి చూడలేని అవిభాజ్యస్థితి. ఉభయత్రా కారకాలు. ఎన్నో బిరుదుల్లోకి, సుస్థిరత్వంగా నిలచిపోయినది, కవికోకిల. కవితాదౄక్పధం, భావకవితానిరసనం, నిసర్గశైలి, సంఘసంస్కరణం, అభ్యుదయభావన, ప్రత్యర్ధులధిక్కారం, మచ్చుకు కొన్నిమాత్రమే, అయినా, వెరసి, మధుర శ్రీనాధుడు. ఎవరనుకుంటున్నారా - నవయుగ కవిచక్రవర్తి, జానుతెనుగు కవితురంగం, గుర్రం జాషువా.
వినుకొండ నివాసి విలక్షణతవిష్ణుకుండినుల అకుంఠిత ధర్మనిష్ఠానిర్మాణ నిపుణతకు, చండప్రచండ పవనాలకు ప్రఖ్యాతమైన వినుకొండ ప్రాంతమది. వికసితబాల్యప్రాయంలో వడిగా అడుగులేస్తున్న బుడత. మండువేసవిగాడ్పులను శీతలపవనవీచికలుగా భావించి నడుస్తున్నా, అతని చక్షువులను వీక్షిస్తేమాత్రం కలవరిస్తున్న హౄదయవేదన వెల్లడవుతున్నది. 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ పుణ్యదంపతులకు జన్మించిన పుత్రరత్నం. కులప్రస్తావన కుతకుతలా ఉడుకుతున్న ఉన్మాదపు రోజులవి. పైగా, తల్లిదండ్రులు, వేర్వేరు కులాల ప్రతినిధులు. తండ్రి యాదవుడైన క్రైస్తవమతస్వీకర్త, తల్లి ఆది ఆంధ్రజాతి. ఈ రెండు విషయాలు కలసి రగిలిన నిప్పురవ్వల తూటాలుగా మారాయి. బాల్యంలోనే హౄదయాన్ని దహించెవేశాయి. పచ్చపచ్చని పైరుపొలాల మధ్య పరుగులెడుతూ గడపిన బాల్యం, చదువుకోసం వెళ్ళే బడి విషయానికొస్తే, కష్టాలకడలి రివ్వున తరంగాలై తాకింది. విద్వత్తులో మునిగిన వినుకొండ, విలక్షణమైన వికటంగా మారింది. అగ్రవర్ణతత్వం, అస్పౄశ్యతామనస్తత్వం రాజ్యమేలుతున్న కాలానికి ఎదురీది, పుత్రాశ్రువులను తుడిచి తనను తాను తమాయించుకున్న జనని సంకల్ప దీక్షాకంకణబద్ధురాలై, బాలుని పాదయాత్రతో మేధాయానం కావించింది. యిన్ని యిబ్బందులు, అవమానాలు ఎదురైనా, అన్నింటినీ దిగమింగుకుని, ఉన్నత పాఠశాల చదువు ముగించుకుని, ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. రాజమండ్రిలో మూకీ చిత్రాల వ్యాఖ్యాతగా, చింతామణి నాటకమండలిలో నాటకకర్తగా పనిచేసిన జాషువా, 1919-1928 కాలంలో గుంటూరులోని లూధరన్ చరి ఉపాధ్యాయ శిక్షణాసంస్థలో అధ్యాపక వౄత్తిని చేపట్టారు. 1928-42 లో గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగుపండితపదవిని నిర్వహించిన ఉభయభాషాప్రావీణ్యుడు. ఆ తర్వాత, జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా, మద్రాసు ఆకాశవాణిలో నిర్మాతగాను ఉద్యోగం నిర్వహించారు. 1964లో ఆంధ్రప్రభుత్వం శాసనమండలి సభ్యత్వం కేటాయించింది. నిర్వహించే ఉద్యోగం ఏదైనా, జీవనసాధనంగానే భావించారు. జన్మత: కవి అయిన జాషువా, కవిగా కష్టతరమనుకున్న, జాషువా బడిపంతులు పదవిని ఎన్నుకున్నారు.
అవధానం కలిగించిన ప్రేరణవినుకొండలో జరిగిన సాహిత్యావధానంను గమనించి, అవధానిని ప్రశంసించాలని, బాలకవి పద్యాలతో వేదికనెక్కబోతే, అంటరానితనమని ఆడ్డుకొట్టడం, జాషువాని కౄంగదీసింది. అలా అవమానింపబడడం, జాషువాలో సంకల్పం సంతరించుకుంది. ఫలితంగా, 'నవ్యయుగోచితంబులై ఆకటి చిచ్చు లార్చు హౄదయ విదారక దయా కధాంశాలూ అని ప్రస్తావిస్తూ, విశ్వమానవ సౌభ్రాత్రత్వం, నిర్మలత్వం, నిర్జాతి సంఘస్థాపన కోసం కంకణబద్ధతని పాటించాడు. ఇంతై, బాలుడింతింతై, కవికోకిలై, నవయుగచక్రవర్తిగా, విశ్వనరుడైనాడు. అసమసమాజం బాకులు రువ్వినప్పుడు, అంటరానితనం విషాగ్నులు విసిరినప్పుడు, కటికదారిద్ర్యాన్ని అనుభవించవలసినప్పుడు, ఆవేదన గుండేల్లో కుతకుతలాడినప్పుడు, గుర్రంజాషువా గభాలున గుర్తుకు వస్తారు.
జాషువా కవిత్వంలో జానుతెనుగుమానవత్వం, హేతువాదమూలాధార కవనేతివౄత్తాలు, మధురోహలతో నిండినవి జాషువా ఖండకావ్యాలు. ఫిరదౌసి, గబ్బిలం, శ్మశానవాటికలాంటృఇ ఖండకౄతులు ఓంకౄతీ ప్రతిధ్వనిత ప్రతిఘటనలు. అవ్యక్తమధురిమ కుహూగీతాలాపనలు విశ్వాంతరాళాన మారుమ్రొతలా అన్నట్లు వుంటాయి ఆయన కౄతులు. సూటిగా, ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, ప్రాణసదౄశంగా చేసిన కవనప్రయోగాలు. దైన్య, ప్రబోధ, నిర్వేద, క్రోధ, జదఘ, ఉగ్రత, చింత, అమర్షాదులను ప్రత్యక్షీకరించిన విధానాలు, కరుణ, వీరరసభరితాలు. మతవైషమ్య, అసస్పౄశ్యత, అంధ విశ్వాసం, దారిద్ర్యం, నిరసనలాంటి అంశాలను పునాదిగా సంఘసంస్కరణలను కూడ ప్రతిబింబించేలా కవిత్వం గోచరిస్తుంది. మహాత్మపధం, మహాబోధి దౄక్పధం, యుగోచిత ప్రగతి దౄష్టిలను దౄష్టిలో పెట్టుకుని నిజాభ్యుదభావకవితలను అల్లాడు జాషువా. ముంతాజ్ మహల్, కాందిశీకుడు, స్వప్నకధ, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, ముషాఫర్లు, క్రీస్తుచరిత్రము, కొత్తలోకం, అవయము, అనసూయ, శివాజీ చరిత్రాది కావ్యఖండికలు దేశచరితావగాహనకు మచ్చుతునకలు. వీరాబాయి, తెరచాటు నాటకాలు, నా కఢ వెరసి రాశితోకూడిన వాసితనపు జానుతెనుగు కవితారసవంతాలు, జాషువా కలంనుంచి అందిన నజరాణాలు.రాజు మరణించె నొక తార రాలిపోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె, రాజు జీవించె రాతి విగ్రహములను, సుకవి జీవించి ప్రజల నాలుకలయందు, యని సుకవికి మరణమే లేదు అని చెప్పినతీరు అధ్బుతం.
అపర రవీంద్రశైలిరవీంద్రుని కవిత్వం గురించి చెప్పిన పద్యంలో, సహజరాజసం, కులుకుల పసందు, బిగువు, మెరుపులతోపాటు, మధురసమును కడుపును మాటుకున్నట్లు, ద్రాక్షఫలకుచ్చములయందములుకూడ గోచరిస్తున్నట్లుగాను, వరకవీంద్రుని కావ్యప్రపంచమందు ప్రతిపదంబున మదికి దర్శనమిస్తాయి అని సుందరంగా వర్ణించాడు. ఈ భావనే జాషువా కవితాదౄక్పధం కూడ గోచరిస్తుంది. కవితాస్వరూపానికి వర్ణాక్షరమాలగా భావించవచ్చు.
పద్యనిర్మాణపటిమ, పదాల అల్లిక లో ప్రత్యేకతలుజాషువాకు పద్యాన్ని చిత్రక పట్టడం తెలుసు. భావాన్ని చిత్ర చిత్రాలుగా కూర్చడమూ తెలుసు. సూటిగా, సెలయేటి ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, కవితలు చెప్పడం రుచితో, అభిరుచితో ప్రత్యేకగుణాన్ని అలవరచుకున్నాడు. అతని కవిత్వానికి ఆవేశం జీవం. అసలు ఏకళకైనా రసావేశమే ప్రాణసదౄశ్యం అంటారు, ప్రముఖ కవి నారాయణరెడ్డెగారు. ఈ రసావేశం లేనివారు, బుర్రతో చూస్తారు, బుద్ధితో వ్రాస్తారు. కాని జాషువా అనుభూతితో చూస్తాడు. ఆవేశంతో వ్రాస్తాడు. ఆ ఆవేశాన్ని వెల్లువలా కాకుండా, పిల్లకాలువలా ప్రవహింపచేస్తాడు. ప్రణాళికాబద్ధంగా ప్రవహింపచేసే ఉత్తమకవిత్వాన్ని సౄష్టించబడగలుగుతుంది.
జాషువా రసావేశానికి, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, గబ్బిలం,శ్మశానవాటి ని ఉదాహరించవచ్చు. రసావేశంతో పాటు తమాషా, చమత్కార ప్రయోగాలను చేయడం, జాషువా ప్రత్యేకత. పగలు - అంటే దినమని, విరోధాలని, ఏకాయేకా - కా ఆంటే ఏకా ఒక్కడేకదా అని, లాంటివి అక్షరలక్షలు బహువర్ణితాలు.
జాషువా నవ్వులు నవ్యాలునవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్ దెవ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు, కొన్ని విషప్రయుక్తముల్, మువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌధుల్, అంటాడు. అందుకే జంధ్యాల నవ్వలేకపోవడం ఒక రోగం అంటాడు.
శ్మశాన వాటిక - అనుభూతికి రసానుభూతికి ప్రతీకఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోకఋరగిపోయే అంటూ, రాజన్యుని అధికారముద్రిక, ఇల్లాలి నల్లపూసల సౌరు, చిత్రలేఖకుని కుంచి, ని చేరుస్తూ, చివరకు, ఇది మరణదూత తీష్ణము, అవని పాలించు భస్మ సింహాసనంబు అన్నాడు. ఈ భావనాపటిమ వేలకవులల్లో ఒకరిని చూడగలుగుతాము.
చివరికి ఎవ్వరేమన్ననండ్రు నాకేమి కొరత, అని ప్రత్యర్ధులను ధిక్కరించాడు అపర మధుర శ్రీనాధుడు.
కవులు వర్ణాతీతులు; వారి కవిత్వాలు వర్ణనాతీతాలు; ఈ జాబితాలో జాషువాని, ఆయన ఈ లోకంలోకి అందించిన భావవరప్రసాదగుళికలు జానుతెనుగుభరిత కవనఖండికలు, నిత్యస్మరణాలు, నిత్యపారాయణాలు.
సరిసములు లేని సన్మానాలు, సత్కారాలుకవిలో ప్రతిభాపాటవాలని బట్టి సన్మానాలు, సత్కారాలు వరకన్యకల్లా వస్తాయి. ఎన్ని కుల, జాత్యంహకారాలు, నిరసనలవెల్లువలు జాషువాపై ఆనాటి అసభ్యసమాజవర్గం ప్రయేగించినా, కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు, అగణిత సన్మానగౌరవాలు దొరికాయి మన జాషువాకి. పద్మభూషణ, కళాప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, నయయుగ కవిచక్రవర్తి బిరుదుల ప్రదానాలు చేయడం జరిగింది. అంటరానితనం, వెలివేయడం అన్నది జరిగినా, చివరకు ఆనాటి ప్రముఖాస్థానకవివర్యులు చెళ్ళపిళ్ళశాస్త్రీయ కరకమలాలతో గండపెండేరపు కీర్తి దిగ్దింగంతాలకు వ్యాప్తి చెందడం జరిగిందని మరువలేము; మరువరాదు. మహాకవులచే ప్రశంసించబడిన కవి మనకవి జాషువా. జాషువా, కవిత్వం ద్వారా తన పదునైన కలాన్ని ఉపయోగించాడని, తద్వారా జనితమైన వేదనావేశములను అనుభవించిన ఆయన శైలిలో వాటిని ప్రకటించడం జరిగిందన్న వాదన కూడ ఆనాడే బహుళ ప్రచారంలోనున్నట్లు పలు కవివర్యులు చెప్పడం జరిగింది. బహిష్కరణలు ఆనాడు సర్వసామాన్యం అనుకోవడం సబబు కాదని, ఆవేదనలకు,మనస్తాపాలకు కారణాలు అనేకం వుండవచ్చును అని, ఆ రోజుల్లోనే హరిజనులకు చాల గౌరవమర్యాదలు, సహవాస, సహపంక్తి వరుసలు కూడా పాటించారని, జాషువాతోటి సమకాలీన హితులు,కవులు అనేకులు తమ స్మౄతులను పలవరించిన సందర్భాలు అనేకం. జాషువా తాను కిరస్తాని మతాన్ని స్వీకరించినా, హిందూమతం, మతదేవతలను ఎన్నడూ విమర్శించలేదన్నది కూడ సత్యం.
విశ్వమానవ సౌభ్రాత్రత్వం, విశ్వశాంతి, మతవర్గరహిత సమ సమాజాన్ని కోరినవారిలో జాషువాను ప్రధమ పంక్తిలో గణించవలసిన ప్రతిభను తన కవిత్వం ద్వారా చూడగలగడమే సాక్ష్యం, సంకేతం.
మరణం లేని నిత్యనివాసి - గుర్రం జాషువాగిజిగాడి గూడు అల్లిక, సాలీడు వెలవేత, నెలబాలుడి వెన్నెలల విరజిమ్ములాటలు, ముక్తక ముత్కాఫలాల నీటి నిగనిగలు ఉన్నంతకాలం, గుర్రంవారి ప్రతి పద్యానికీ వెలుగే; ప్రతి పదానికీ మిగులే; గుర్రంవారు వ్రాసింది ఎంత? బాలికుల ప్రశ్న. అమరుకకవే: ఏక: శ్లోక: ప్రబంధ శతాయతే అన్నది సహౄదయ సూక్తితోను, 'ఏకపద్యం ప్రబంధ శతాయతే అన్న దేవులపల్లి కౄష్ణశాస్త్రివారి ఉవాచతో, జాషువాను భావిస్తూ, ఈ స్మౄతివ్యాసాన్ని ముగించడం ఔచిత్యమే కదా!
గుర్రం జాషువా కవిత్వం
సామాజిక స్పౄహలేని భావ కవిత్వం పై ఘాటు విమర్శకవి సమయంబు దప్పి, నుడికారపు సొంపును బాడుచేసి, నీవెవతుక కోసమో కుమిలి యేడ్చుచు జక్కని తెల్గుకైతకాయువులు గుదించి యేటికి కయోమయముం బొనరింతువీతు? నీకవనము పాడుగాను వెడగా! యిక నేనియు రమ్ముదారికిన్.
ప్రణయకవి యొకండు, పాషాణ కవి యొక్కడేడ్చు కవి యొకండు, నేకమగుచునొండొరులను జూచి యోదార్చుకొనుచున్నబాగుపడునె భావి భరత జాతి.
( వర్గస్ప్రుహ, హేతువాదం, రాజకీయ ఆర్ధిక దౄష్టి - జీవిత వేదనలోనుండి వికసించింది)
హరిజనుల దీనావస్థముసలివాడైన బ్రహ్మకు పుట్టినారునలువురు కుమారులట, విన్నాము కానిపసరమున కన్న హీను డభాగ్యుడైనఐదవ కులస్థుడెవ్వరమ్మా సవిత్రి? (భరతమాతను నిలదీసి ప్రశ్నించారు)
వర్ణవ్యవస్థ పై గర్హనఈ యభాగ్యుని రక్తంబు, నా హరించిఇనుప గజ్జెల తల్లి, జీవనము చేయుకొసరి బుసగొట్టు, నాతని గాలి సోకనాల్గు పడగల, హైందవ నాగరాజు.
గుర్రాలకు రెక్కలు గలవెర్రి యుగాల్ దాటిపోయె, విజ్ౙానంబున్బుర్ర గల గాంధి యుగమిదికర్రలు ఖడ్గంబు లేలగా లేవు ప్రజన్.
కలకల నవ్వెడు తాతయశిలయై, కలయై యనంత శిల్పంబునకున్బలమిచ్చి, మాయ యయ్యెన్కులమత తత్వములు పుంజుకొని తలయెత్తెన్.
జాషువా మార్గం కూడ గాంధీజీ అడుగుజాడ
ఆడినా మాట తప్పను, మహాత్ముని చెప్పులజాడలోన కాలాడ చరించెదన్, ప్రజల కన్నము బెట్టెద, వర్ణభేదపుంజీడ నణంచెదన్, గటిక చీకటి వాపెద, వెఋఋఇ నమ్మకాలూడని బాడ హస్తమున నూనెద శాతకళాకుఠారమున్.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపు రేఖాకమనీయ వైఖరులు గాంచి భళీ భళి? యన్నవాడె మీదేకులమన్న ప్రశ్నవెలయించి చివాలున లేచుపోవుచోబాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్.
భేష్! భేష్! మీ కవిత్వం అద్భుతం, మీది ఏ కులం? - నేను క్రైస్తవుణ్ణి. కవికిగాని, కళకుగాని కులమతాలున్నాయా?అయ్యయ్యో! వాణి అంటు పడ్డది.
పిరదౌసి (పరమేశ్వర స్మరణ)విత్తనంబున మహావౄక్షంబు నిమిడించి సౄష్టించి గారడీ చేయు వాడకడుపులో శిశివును గల్పించి పది నెలల్ మోయించి యూపిరి వోయు వాడసద్భక్త వరులకు సాక్షాత్కరించియు నున్నచో రెరిగింపకున్న వాడపొటమరింపక ముందె పుష్ప సంతతులకు వింతగా రంగులు వేయువాడచెలువ మొప్ప బుడమి సౄష్టించి మాకిచ్చిఅనుభవ వింపు డనుచు నాన తిచ్చినిలువ నీడలేక నిల్చిన కలవాడ!కడుపు నిండ నన్ను గన్నవాడ!
గోడ మీద గోడు - కవిత్వంముత్యముల కిక్కయైన సముద్రముననుబెక్కుమారులు ముంకలు వేసినాడభాగ్య హీనుడ ముత్యమ్ము బడయనైతివనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు.
గబ్బిలంఆలయంబున నీవు వ్రేలాడువేళశివుని చెవి నీకు గొంత చేరువుగ నుండుమౌని ఖగరాజ్ౙి! పూజారి లేనివేళనిన్నవింపుము నాదు జీవిత చరిత్ర.
ముంతాజ్ మహల్ - భరతవాక్యం, ముగింపు
రాణి విడిచిపోయె రాజు నొంటరి జేసిరాజు విడిచిపోయె రాజ్య రమనురాజ్య రమయు విడిచె రాజుల బెక్కండ్రతాజి విడువలేదు రాజసంబు.
షాజహాన్ కు వీడ్కోలు చూపులతో ముంతాజ్
ఆవిరి యోడలో జలధియాన మొనర్చిడి బాటసారు లోభూవర రేవులందు దిగిపోయెద రించుక వెంకముందుగాఈ వసుధా పణంబు పనియెల్ల ముగించి స్వదేశగాములైపోవుచు వచ్చుచుండ్రు సతమున్ బ్రజలీ నరజన్మవర్తకుల్.
క్రీస్తు చరిత్ర (1965 - కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి)శరదించు ప్రతిమానమై కరుణతో జాజ్వల్యమానంబుగాపరమ ప్రేమ సుధారసంబొలుకు నీ బంగారు నెమ్మోము నెత్తురు ముద్దయ్యెనె తండ్రి! యధ్బుతపు శక్తుల్ గల్గు నీకెట్లు దుర్మరణ ప్రాప్తి ఘటిల్లె, నా యనుగు పుత్రా! మౄత్యుసంహారకా!
క్రీస్తు చరిత్ర కావ్యంపై, వి.వి.యల్. నరసింహారావు గారి ప్రశంసముదురు తమస్సులో ఇనుప ముండ్ల కిరీటము నెత్తి కెత్తి, నెన్నుదుట నయశ్శలాక దిగనొక్కి తనుంగని తిట్టిపోయు దుర్మకులను కాచి ప్రోవగ పరాత్పరు వేడెడు క్రీస్తు గాథ నీసదమల వాణి గుండెయలజాల్కొనె గుర్రము జాషువా కవీ!
శ్మశాన వాటి - భావబంధురం, కరుణరసాప్లావితం, వైరాగ్యభాసురం"యిచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలమ్ము నిప్పులలోన గఋరగిపోయె!యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె!యిచ్చోటనే లేత యిల్లాలి నల్లపూసల సౌరు, గంగలో గలసిపోయె!యిచ్చోటనే నెట్టి పేరెన్నికం గనుగొన్న చిత్రలేఖకుని కుంచియ, నశించె! ఇది పిశాచులతో నిటలేక్షణుండుగజ్జె గదలించి యాడు రంగస్థలంబుఇది మరణదూత తీమౌక్ష్ణ దౄష్టులొలయనవని బాలించు భస్మ సింహాసనంబు."
"నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క గడన సేయుట కాసపడను నేనుఆలుబిడ్డలకునై యాస్తిపాస్తులు గూర్ప పెడత్రోవలో పాదమిడను నేనునే నాచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను లేనుసంసార యాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డి గవ్వయు గోరుకొనను నేను
కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చిపంజరాన గట్టువడను నేనునిఖిలలోక మెట్లు నిర్ణయించిన, నాకుతరుగులేదు, విశ్వనరుడ నేను."
జాషువా చెప్పే తీరులోకూడా నవ్యతను సాధించారు.
రాత్రి ఒంటిగంట అని చెప్పిన తీరు -"ఒకటి రెండు మారు లురలి నేలకు జారెకాపలా జవాను కరకు కత్తిసురటి విసరు చేటి మరచి నిద్దురవోయెఖంగుమనుచు నొంటి గంట కొట్టె."
ఉపమానాన్ని లోకం నుండి తీసుకోవడం, తెలుగుతనాన్ని వ్యక్తం చేసే విధానం -"మగడు కొట్టిన, రోదించి మానుకొన్నపెద్ద గయ్యాళివలె వాన వెలసిపోయెమమత లుడిగిన సన్యాసి మనసువోలెగగనమండలమెల్ల నిష్కలుషమయ్యె."
పెంపుడు కుక్క జాకీ చనిపోయినప్పుడు -నోరు లేదు గాని చేరి నీ వొనరించుపనులలోన వింత భాష గలదూనీవు నేను దప్ప నితరు లెరుంగరుకనులతోడ నవ్వగలవు నీవు."
రసహౄదయాలను ఆకర్షించడం అంటే యిదేకదా.
చదువవచ్చు గ్రంథ సముదాయ మంతయుకౄతులలోని నెరసు లేరవచ్చురసము సౄష్టి చేయు పజ్ౙా విశేషంబుసాధనమున రాదు చదువు గాదు."
ఓర్వలేని ప్రతిపక్షులకు సమాధానం -'గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత నన్నె వ్విధి దూరినన్ ననువరించిన శారద లేచి పోవునే?ఇవ్వ సుధా స్థలింబొడమరే రసలుబ్ధులు? గంట మూనెదన్రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్ర వాణికిన్."
వ్యాధులకు మహౌషధం నవ్వు - నవ్వులలోని రకాలను చెప్పిన తీరు -
"నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విష ప్రయుక్తముల్పువ్వులవోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు, సర్వ దు:ఖ దమనంబులు, వ్యాధులకున్ మహౌషధుల్."
మడమ త్రిప్పని యాంధ్ర పుత్రుడను నేనుగడన కెక్కిన యాంధ్ర పుత్రడను నేను.
"బహు దేశములను బేర్వడసి మీసము దీటు భరత ఖండంబు నా పాఠశాలస్తన యుగంబున గాన సాహిత్యములు గల్గు భాషావధూటి నా పంతులమ్మసాందీపని సమక్షమందు విద్య గడించు వనమాలి నా సహ పాఠకుండుభక్తి వైరాగ్య భావముల తావలమైనా భాగవతంబు నా బాలశిక్ష
గంటము ధరించి మోహానాక్షరము లెనయబ్రతిఫలించెడు నా మహోన్నత విభూతివ్రాసిస్కొందును దశ దిశా ఫలక పంక్తిగడన కెక్కిన యాంధ్ర పుత్రుడను నేను."
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్న సూక్తికి నిదర్శనమే కదా.అ
గుంటూరు సీమ గుణగణాలను వివరించిన తీరు -"పెట్టిన పేరు ముందడుగు వేయుటకెట్టి మహోద్యమంబులన్బెట్టిన పేరు మంజుల కవిత్వ పటుత్వరసైక పుష్టికిన్బెట్టిన పేరు గుండెగల వీరవరేణ్యజను: ప్రశస్తికిన్పెట్టిన పేరు గర్తపురి విద్యకు గానకళా ప్రసిద్ధికిన్."
"ఏస కొంచెము లేని హౄదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటుకట్టులో బొట్టులో కడమ సీమల యందు నగ్ర తాంబూలంబు నందు చోటుకంటి కింపైని చక్కని యందగత్తియ లింటింట విద్యుతు లీను చోటుఆవల పల్నాడు, కొండవీ డివల నిలిచిజననమెత్తిన చిరుతబాలునకు గూడగురువులై వీర గాథలు గరవు చోటువీర భాషాభిరామ, గుంటూరుసీమ."
జన్మస్థలం - వినుకొండ"గౌడ డిండిమ భట్టుని కంఛు ఢక్కపగుల గొట్టించు కవిసార్వభౌమునిల్లుభాస్కరుని కత్తి మెరసిన ప్రధన భూమిశిరము నెరసిన వినుకొండ సీమ మాది."
చెళ్ళపిళ్ళ వారిచే గండపెండేర సత్కారం"చెళ పిళా సత్కవీశుడు, ప్రసిద్ధుడు, వీర శతావధాని, యాంధ్రుల శుభ రక్తనాళముల రూపము నెత్తిన బ్రాహ్మణుండు, నాపలుకుల రాణి పాదమును బంగరు గగ్గెరతో నలంకౄతుల్సలిపె, నికేమి కావలె ప్రశస్తి? కవిత్వ కళావధూటికిన్."
నవయుగ కవిచక్రవర్తి, దళితవర్గజ్వలస్ఫూర్తి, జానుతెనుగు కవితురంగం - మన గుర్రం జాషువా.
మధురకవి, అపరశ్రీనాథకవి అయిన గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా తెలుగురధం జానుతెనుగు నివాళులను గర్వంగా సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
( 1895 - 1971 )
మధుర శ్రీనాధుడు
బ్రతుకు బాధల చేదును ఆస్వాదించి మధురమైన కవిత ద్వారా సంకుచిత మతాతీతమైన కవితలను వెలువరించినవాడు. ప్రజల నాలుకలయందు జీవించిన సుకవి. సంస్కార ప్రియుల హౄదయాల్లో జీవిస్తున్న వ్యక్తిత్వం. కవిత్వాన్ని అతని వ్యక్తిత్వంనుంచి విడదీసి చూడలేని అవిభాజ్యస్థితి. ఉభయత్రా కారకాలు. ఎన్నో బిరుదుల్లోకి, సుస్థిరత్వంగా నిలచిపోయినది, కవికోకిల. కవితాదౄక్పధం, భావకవితానిరసనం, నిసర్గశైలి, సంఘసంస్కరణం, అభ్యుదయభావన, ప్రత్యర్ధులధిక్కారం, మచ్చుకు కొన్నిమాత్రమే, అయినా, వెరసి, మధుర శ్రీనాధుడు. ఎవరనుకుంటున్నారా - నవయుగ కవిచక్రవర్తి, జానుతెనుగు కవితురంగం, గుర్రం జాషువా.
వినుకొండ నివాసి విలక్షణతవిష్ణుకుండినుల అకుంఠిత ధర్మనిష్ఠానిర్మాణ నిపుణతకు, చండప్రచండ పవనాలకు ప్రఖ్యాతమైన వినుకొండ ప్రాంతమది. వికసితబాల్యప్రాయంలో వడిగా అడుగులేస్తున్న బుడత. మండువేసవిగాడ్పులను శీతలపవనవీచికలుగా భావించి నడుస్తున్నా, అతని చక్షువులను వీక్షిస్తేమాత్రం కలవరిస్తున్న హౄదయవేదన వెల్లడవుతున్నది. 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ పుణ్యదంపతులకు జన్మించిన పుత్రరత్నం. కులప్రస్తావన కుతకుతలా ఉడుకుతున్న ఉన్మాదపు రోజులవి. పైగా, తల్లిదండ్రులు, వేర్వేరు కులాల ప్రతినిధులు. తండ్రి యాదవుడైన క్రైస్తవమతస్వీకర్త, తల్లి ఆది ఆంధ్రజాతి. ఈ రెండు విషయాలు కలసి రగిలిన నిప్పురవ్వల తూటాలుగా మారాయి. బాల్యంలోనే హౄదయాన్ని దహించెవేశాయి. పచ్చపచ్చని పైరుపొలాల మధ్య పరుగులెడుతూ గడపిన బాల్యం, చదువుకోసం వెళ్ళే బడి విషయానికొస్తే, కష్టాలకడలి రివ్వున తరంగాలై తాకింది. విద్వత్తులో మునిగిన వినుకొండ, విలక్షణమైన వికటంగా మారింది. అగ్రవర్ణతత్వం, అస్పౄశ్యతామనస్తత్వం రాజ్యమేలుతున్న కాలానికి ఎదురీది, పుత్రాశ్రువులను తుడిచి తనను తాను తమాయించుకున్న జనని సంకల్ప దీక్షాకంకణబద్ధురాలై, బాలుని పాదయాత్రతో మేధాయానం కావించింది. యిన్ని యిబ్బందులు, అవమానాలు ఎదురైనా, అన్నింటినీ దిగమింగుకుని, ఉన్నత పాఠశాల చదువు ముగించుకుని, ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. రాజమండ్రిలో మూకీ చిత్రాల వ్యాఖ్యాతగా, చింతామణి నాటకమండలిలో నాటకకర్తగా పనిచేసిన జాషువా, 1919-1928 కాలంలో గుంటూరులోని లూధరన్ చరి ఉపాధ్యాయ శిక్షణాసంస్థలో అధ్యాపక వౄత్తిని చేపట్టారు. 1928-42 లో గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగుపండితపదవిని నిర్వహించిన ఉభయభాషాప్రావీణ్యుడు. ఆ తర్వాత, జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా, మద్రాసు ఆకాశవాణిలో నిర్మాతగాను ఉద్యోగం నిర్వహించారు. 1964లో ఆంధ్రప్రభుత్వం శాసనమండలి సభ్యత్వం కేటాయించింది. నిర్వహించే ఉద్యోగం ఏదైనా, జీవనసాధనంగానే భావించారు. జన్మత: కవి అయిన జాషువా, కవిగా కష్టతరమనుకున్న, జాషువా బడిపంతులు పదవిని ఎన్నుకున్నారు.
అవధానం కలిగించిన ప్రేరణవినుకొండలో జరిగిన సాహిత్యావధానంను గమనించి, అవధానిని ప్రశంసించాలని, బాలకవి పద్యాలతో వేదికనెక్కబోతే, అంటరానితనమని ఆడ్డుకొట్టడం, జాషువాని కౄంగదీసింది. అలా అవమానింపబడడం, జాషువాలో సంకల్పం సంతరించుకుంది. ఫలితంగా, 'నవ్యయుగోచితంబులై ఆకటి చిచ్చు లార్చు హౄదయ విదారక దయా కధాంశాలూ అని ప్రస్తావిస్తూ, విశ్వమానవ సౌభ్రాత్రత్వం, నిర్మలత్వం, నిర్జాతి సంఘస్థాపన కోసం కంకణబద్ధతని పాటించాడు. ఇంతై, బాలుడింతింతై, కవికోకిలై, నవయుగచక్రవర్తిగా, విశ్వనరుడైనాడు. అసమసమాజం బాకులు రువ్వినప్పుడు, అంటరానితనం విషాగ్నులు విసిరినప్పుడు, కటికదారిద్ర్యాన్ని అనుభవించవలసినప్పుడు, ఆవేదన గుండేల్లో కుతకుతలాడినప్పుడు, గుర్రంజాషువా గభాలున గుర్తుకు వస్తారు.
జాషువా కవిత్వంలో జానుతెనుగుమానవత్వం, హేతువాదమూలాధార కవనేతివౄత్తాలు, మధురోహలతో నిండినవి జాషువా ఖండకావ్యాలు. ఫిరదౌసి, గబ్బిలం, శ్మశానవాటికలాంటృఇ ఖండకౄతులు ఓంకౄతీ ప్రతిధ్వనిత ప్రతిఘటనలు. అవ్యక్తమధురిమ కుహూగీతాలాపనలు విశ్వాంతరాళాన మారుమ్రొతలా అన్నట్లు వుంటాయి ఆయన కౄతులు. సూటిగా, ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, ప్రాణసదౄశంగా చేసిన కవనప్రయోగాలు. దైన్య, ప్రబోధ, నిర్వేద, క్రోధ, జదఘ, ఉగ్రత, చింత, అమర్షాదులను ప్రత్యక్షీకరించిన విధానాలు, కరుణ, వీరరసభరితాలు. మతవైషమ్య, అసస్పౄశ్యత, అంధ విశ్వాసం, దారిద్ర్యం, నిరసనలాంటి అంశాలను పునాదిగా సంఘసంస్కరణలను కూడ ప్రతిబింబించేలా కవిత్వం గోచరిస్తుంది. మహాత్మపధం, మహాబోధి దౄక్పధం, యుగోచిత ప్రగతి దౄష్టిలను దౄష్టిలో పెట్టుకుని నిజాభ్యుదభావకవితలను అల్లాడు జాషువా. ముంతాజ్ మహల్, కాందిశీకుడు, స్వప్నకధ, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, ముషాఫర్లు, క్రీస్తుచరిత్రము, కొత్తలోకం, అవయము, అనసూయ, శివాజీ చరిత్రాది కావ్యఖండికలు దేశచరితావగాహనకు మచ్చుతునకలు. వీరాబాయి, తెరచాటు నాటకాలు, నా కఢ వెరసి రాశితోకూడిన వాసితనపు జానుతెనుగు కవితారసవంతాలు, జాషువా కలంనుంచి అందిన నజరాణాలు.రాజు మరణించె నొక తార రాలిపోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె, రాజు జీవించె రాతి విగ్రహములను, సుకవి జీవించి ప్రజల నాలుకలయందు, యని సుకవికి మరణమే లేదు అని చెప్పినతీరు అధ్బుతం.
అపర రవీంద్రశైలిరవీంద్రుని కవిత్వం గురించి చెప్పిన పద్యంలో, సహజరాజసం, కులుకుల పసందు, బిగువు, మెరుపులతోపాటు, మధురసమును కడుపును మాటుకున్నట్లు, ద్రాక్షఫలకుచ్చములయందములుకూడ గోచరిస్తున్నట్లుగాను, వరకవీంద్రుని కావ్యప్రపంచమందు ప్రతిపదంబున మదికి దర్శనమిస్తాయి అని సుందరంగా వర్ణించాడు. ఈ భావనే జాషువా కవితాదౄక్పధం కూడ గోచరిస్తుంది. కవితాస్వరూపానికి వర్ణాక్షరమాలగా భావించవచ్చు.
పద్యనిర్మాణపటిమ, పదాల అల్లిక లో ప్రత్యేకతలుజాషువాకు పద్యాన్ని చిత్రక పట్టడం తెలుసు. భావాన్ని చిత్ర చిత్రాలుగా కూర్చడమూ తెలుసు. సూటిగా, సెలయేటి ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, కవితలు చెప్పడం రుచితో, అభిరుచితో ప్రత్యేకగుణాన్ని అలవరచుకున్నాడు. అతని కవిత్వానికి ఆవేశం జీవం. అసలు ఏకళకైనా రసావేశమే ప్రాణసదౄశ్యం అంటారు, ప్రముఖ కవి నారాయణరెడ్డెగారు. ఈ రసావేశం లేనివారు, బుర్రతో చూస్తారు, బుద్ధితో వ్రాస్తారు. కాని జాషువా అనుభూతితో చూస్తాడు. ఆవేశంతో వ్రాస్తాడు. ఆ ఆవేశాన్ని వెల్లువలా కాకుండా, పిల్లకాలువలా ప్రవహింపచేస్తాడు. ప్రణాళికాబద్ధంగా ప్రవహింపచేసే ఉత్తమకవిత్వాన్ని సౄష్టించబడగలుగుతుంది.
జాషువా రసావేశానికి, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, గబ్బిలం,శ్మశానవాటి ని ఉదాహరించవచ్చు. రసావేశంతో పాటు తమాషా, చమత్కార ప్రయోగాలను చేయడం, జాషువా ప్రత్యేకత. పగలు - అంటే దినమని, విరోధాలని, ఏకాయేకా - కా ఆంటే ఏకా ఒక్కడేకదా అని, లాంటివి అక్షరలక్షలు బహువర్ణితాలు.
జాషువా నవ్వులు నవ్యాలునవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్ దెవ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు, కొన్ని విషప్రయుక్తముల్, మువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌధుల్, అంటాడు. అందుకే జంధ్యాల నవ్వలేకపోవడం ఒక రోగం అంటాడు.
శ్మశాన వాటిక - అనుభూతికి రసానుభూతికి ప్రతీకఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోకఋరగిపోయే అంటూ, రాజన్యుని అధికారముద్రిక, ఇల్లాలి నల్లపూసల సౌరు, చిత్రలేఖకుని కుంచి, ని చేరుస్తూ, చివరకు, ఇది మరణదూత తీష్ణము, అవని పాలించు భస్మ సింహాసనంబు అన్నాడు. ఈ భావనాపటిమ వేలకవులల్లో ఒకరిని చూడగలుగుతాము.
చివరికి ఎవ్వరేమన్ననండ్రు నాకేమి కొరత, అని ప్రత్యర్ధులను ధిక్కరించాడు అపర మధుర శ్రీనాధుడు.
కవులు వర్ణాతీతులు; వారి కవిత్వాలు వర్ణనాతీతాలు; ఈ జాబితాలో జాషువాని, ఆయన ఈ లోకంలోకి అందించిన భావవరప్రసాదగుళికలు జానుతెనుగుభరిత కవనఖండికలు, నిత్యస్మరణాలు, నిత్యపారాయణాలు.
సరిసములు లేని సన్మానాలు, సత్కారాలుకవిలో ప్రతిభాపాటవాలని బట్టి సన్మానాలు, సత్కారాలు వరకన్యకల్లా వస్తాయి. ఎన్ని కుల, జాత్యంహకారాలు, నిరసనలవెల్లువలు జాషువాపై ఆనాటి అసభ్యసమాజవర్గం ప్రయేగించినా, కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు, అగణిత సన్మానగౌరవాలు దొరికాయి మన జాషువాకి. పద్మభూషణ, కళాప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, నయయుగ కవిచక్రవర్తి బిరుదుల ప్రదానాలు చేయడం జరిగింది. అంటరానితనం, వెలివేయడం అన్నది జరిగినా, చివరకు ఆనాటి ప్రముఖాస్థానకవివర్యులు చెళ్ళపిళ్ళశాస్త్రీయ కరకమలాలతో గండపెండేరపు కీర్తి దిగ్దింగంతాలకు వ్యాప్తి చెందడం జరిగిందని మరువలేము; మరువరాదు. మహాకవులచే ప్రశంసించబడిన కవి మనకవి జాషువా. జాషువా, కవిత్వం ద్వారా తన పదునైన కలాన్ని ఉపయోగించాడని, తద్వారా జనితమైన వేదనావేశములను అనుభవించిన ఆయన శైలిలో వాటిని ప్రకటించడం జరిగిందన్న వాదన కూడ ఆనాడే బహుళ ప్రచారంలోనున్నట్లు పలు కవివర్యులు చెప్పడం జరిగింది. బహిష్కరణలు ఆనాడు సర్వసామాన్యం అనుకోవడం సబబు కాదని, ఆవేదనలకు,మనస్తాపాలకు కారణాలు అనేకం వుండవచ్చును అని, ఆ రోజుల్లోనే హరిజనులకు చాల గౌరవమర్యాదలు, సహవాస, సహపంక్తి వరుసలు కూడా పాటించారని, జాషువాతోటి సమకాలీన హితులు,కవులు అనేకులు తమ స్మౄతులను పలవరించిన సందర్భాలు అనేకం. జాషువా తాను కిరస్తాని మతాన్ని స్వీకరించినా, హిందూమతం, మతదేవతలను ఎన్నడూ విమర్శించలేదన్నది కూడ సత్యం.
విశ్వమానవ సౌభ్రాత్రత్వం, విశ్వశాంతి, మతవర్గరహిత సమ సమాజాన్ని కోరినవారిలో జాషువాను ప్రధమ పంక్తిలో గణించవలసిన ప్రతిభను తన కవిత్వం ద్వారా చూడగలగడమే సాక్ష్యం, సంకేతం.
మరణం లేని నిత్యనివాసి - గుర్రం జాషువాగిజిగాడి గూడు అల్లిక, సాలీడు వెలవేత, నెలబాలుడి వెన్నెలల విరజిమ్ములాటలు, ముక్తక ముత్కాఫలాల నీటి నిగనిగలు ఉన్నంతకాలం, గుర్రంవారి ప్రతి పద్యానికీ వెలుగే; ప్రతి పదానికీ మిగులే; గుర్రంవారు వ్రాసింది ఎంత? బాలికుల ప్రశ్న. అమరుకకవే: ఏక: శ్లోక: ప్రబంధ శతాయతే అన్నది సహౄదయ సూక్తితోను, 'ఏకపద్యం ప్రబంధ శతాయతే అన్న దేవులపల్లి కౄష్ణశాస్త్రివారి ఉవాచతో, జాషువాను భావిస్తూ, ఈ స్మౄతివ్యాసాన్ని ముగించడం ఔచిత్యమే కదా!
గుర్రం జాషువా కవిత్వం
సామాజిక స్పౄహలేని భావ కవిత్వం పై ఘాటు విమర్శకవి సమయంబు దప్పి, నుడికారపు సొంపును బాడుచేసి, నీవెవతుక కోసమో కుమిలి యేడ్చుచు జక్కని తెల్గుకైతకాయువులు గుదించి యేటికి కయోమయముం బొనరింతువీతు? నీకవనము పాడుగాను వెడగా! యిక నేనియు రమ్ముదారికిన్.
ప్రణయకవి యొకండు, పాషాణ కవి యొక్కడేడ్చు కవి యొకండు, నేకమగుచునొండొరులను జూచి యోదార్చుకొనుచున్నబాగుపడునె భావి భరత జాతి.
( వర్గస్ప్రుహ, హేతువాదం, రాజకీయ ఆర్ధిక దౄష్టి - జీవిత వేదనలోనుండి వికసించింది)
హరిజనుల దీనావస్థముసలివాడైన బ్రహ్మకు పుట్టినారునలువురు కుమారులట, విన్నాము కానిపసరమున కన్న హీను డభాగ్యుడైనఐదవ కులస్థుడెవ్వరమ్మా సవిత్రి? (భరతమాతను నిలదీసి ప్రశ్నించారు)
వర్ణవ్యవస్థ పై గర్హనఈ యభాగ్యుని రక్తంబు, నా హరించిఇనుప గజ్జెల తల్లి, జీవనము చేయుకొసరి బుసగొట్టు, నాతని గాలి సోకనాల్గు పడగల, హైందవ నాగరాజు.
గుర్రాలకు రెక్కలు గలవెర్రి యుగాల్ దాటిపోయె, విజ్ౙానంబున్బుర్ర గల గాంధి యుగమిదికర్రలు ఖడ్గంబు లేలగా లేవు ప్రజన్.
కలకల నవ్వెడు తాతయశిలయై, కలయై యనంత శిల్పంబునకున్బలమిచ్చి, మాయ యయ్యెన్కులమత తత్వములు పుంజుకొని తలయెత్తెన్.
జాషువా మార్గం కూడ గాంధీజీ అడుగుజాడ
ఆడినా మాట తప్పను, మహాత్ముని చెప్పులజాడలోన కాలాడ చరించెదన్, ప్రజల కన్నము బెట్టెద, వర్ణభేదపుంజీడ నణంచెదన్, గటిక చీకటి వాపెద, వెఋఋఇ నమ్మకాలూడని బాడ హస్తమున నూనెద శాతకళాకుఠారమున్.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపు రేఖాకమనీయ వైఖరులు గాంచి భళీ భళి? యన్నవాడె మీదేకులమన్న ప్రశ్నవెలయించి చివాలున లేచుపోవుచోబాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్.
భేష్! భేష్! మీ కవిత్వం అద్భుతం, మీది ఏ కులం? - నేను క్రైస్తవుణ్ణి. కవికిగాని, కళకుగాని కులమతాలున్నాయా?అయ్యయ్యో! వాణి అంటు పడ్డది.
పిరదౌసి (పరమేశ్వర స్మరణ)విత్తనంబున మహావౄక్షంబు నిమిడించి సౄష్టించి గారడీ చేయు వాడకడుపులో శిశివును గల్పించి పది నెలల్ మోయించి యూపిరి వోయు వాడసద్భక్త వరులకు సాక్షాత్కరించియు నున్నచో రెరిగింపకున్న వాడపొటమరింపక ముందె పుష్ప సంతతులకు వింతగా రంగులు వేయువాడచెలువ మొప్ప బుడమి సౄష్టించి మాకిచ్చిఅనుభవ వింపు డనుచు నాన తిచ్చినిలువ నీడలేక నిల్చిన కలవాడ!కడుపు నిండ నన్ను గన్నవాడ!
గోడ మీద గోడు - కవిత్వంముత్యముల కిక్కయైన సముద్రముననుబెక్కుమారులు ముంకలు వేసినాడభాగ్య హీనుడ ముత్యమ్ము బడయనైతివనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు.
గబ్బిలంఆలయంబున నీవు వ్రేలాడువేళశివుని చెవి నీకు గొంత చేరువుగ నుండుమౌని ఖగరాజ్ౙి! పూజారి లేనివేళనిన్నవింపుము నాదు జీవిత చరిత్ర.
ముంతాజ్ మహల్ - భరతవాక్యం, ముగింపు
రాణి విడిచిపోయె రాజు నొంటరి జేసిరాజు విడిచిపోయె రాజ్య రమనురాజ్య రమయు విడిచె రాజుల బెక్కండ్రతాజి విడువలేదు రాజసంబు.
షాజహాన్ కు వీడ్కోలు చూపులతో ముంతాజ్
ఆవిరి యోడలో జలధియాన మొనర్చిడి బాటసారు లోభూవర రేవులందు దిగిపోయెద రించుక వెంకముందుగాఈ వసుధా పణంబు పనియెల్ల ముగించి స్వదేశగాములైపోవుచు వచ్చుచుండ్రు సతమున్ బ్రజలీ నరజన్మవర్తకుల్.
క్రీస్తు చరిత్ర (1965 - కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి)శరదించు ప్రతిమానమై కరుణతో జాజ్వల్యమానంబుగాపరమ ప్రేమ సుధారసంబొలుకు నీ బంగారు నెమ్మోము నెత్తురు ముద్దయ్యెనె తండ్రి! యధ్బుతపు శక్తుల్ గల్గు నీకెట్లు దుర్మరణ ప్రాప్తి ఘటిల్లె, నా యనుగు పుత్రా! మౄత్యుసంహారకా!
క్రీస్తు చరిత్ర కావ్యంపై, వి.వి.యల్. నరసింహారావు గారి ప్రశంసముదురు తమస్సులో ఇనుప ముండ్ల కిరీటము నెత్తి కెత్తి, నెన్నుదుట నయశ్శలాక దిగనొక్కి తనుంగని తిట్టిపోయు దుర్మకులను కాచి ప్రోవగ పరాత్పరు వేడెడు క్రీస్తు గాథ నీసదమల వాణి గుండెయలజాల్కొనె గుర్రము జాషువా కవీ!
శ్మశాన వాటి - భావబంధురం, కరుణరసాప్లావితం, వైరాగ్యభాసురం"యిచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలమ్ము నిప్పులలోన గఋరగిపోయె!యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె!యిచ్చోటనే లేత యిల్లాలి నల్లపూసల సౌరు, గంగలో గలసిపోయె!యిచ్చోటనే నెట్టి పేరెన్నికం గనుగొన్న చిత్రలేఖకుని కుంచియ, నశించె! ఇది పిశాచులతో నిటలేక్షణుండుగజ్జె గదలించి యాడు రంగస్థలంబుఇది మరణదూత తీమౌక్ష్ణ దౄష్టులొలయనవని బాలించు భస్మ సింహాసనంబు."
"నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క గడన సేయుట కాసపడను నేనుఆలుబిడ్డలకునై యాస్తిపాస్తులు గూర్ప పెడత్రోవలో పాదమిడను నేనునే నాచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను లేనుసంసార యాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డి గవ్వయు గోరుకొనను నేను
కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చిపంజరాన గట్టువడను నేనునిఖిలలోక మెట్లు నిర్ణయించిన, నాకుతరుగులేదు, విశ్వనరుడ నేను."
జాషువా చెప్పే తీరులోకూడా నవ్యతను సాధించారు.
రాత్రి ఒంటిగంట అని చెప్పిన తీరు -"ఒకటి రెండు మారు లురలి నేలకు జారెకాపలా జవాను కరకు కత్తిసురటి విసరు చేటి మరచి నిద్దురవోయెఖంగుమనుచు నొంటి గంట కొట్టె."
ఉపమానాన్ని లోకం నుండి తీసుకోవడం, తెలుగుతనాన్ని వ్యక్తం చేసే విధానం -"మగడు కొట్టిన, రోదించి మానుకొన్నపెద్ద గయ్యాళివలె వాన వెలసిపోయెమమత లుడిగిన సన్యాసి మనసువోలెగగనమండలమెల్ల నిష్కలుషమయ్యె."
పెంపుడు కుక్క జాకీ చనిపోయినప్పుడు -నోరు లేదు గాని చేరి నీ వొనరించుపనులలోన వింత భాష గలదూనీవు నేను దప్ప నితరు లెరుంగరుకనులతోడ నవ్వగలవు నీవు."
రసహౄదయాలను ఆకర్షించడం అంటే యిదేకదా.
చదువవచ్చు గ్రంథ సముదాయ మంతయుకౄతులలోని నెరసు లేరవచ్చురసము సౄష్టి చేయు పజ్ౙా విశేషంబుసాధనమున రాదు చదువు గాదు."
ఓర్వలేని ప్రతిపక్షులకు సమాధానం -'గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత నన్నె వ్విధి దూరినన్ ననువరించిన శారద లేచి పోవునే?ఇవ్వ సుధా స్థలింబొడమరే రసలుబ్ధులు? గంట మూనెదన్రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్ర వాణికిన్."
వ్యాధులకు మహౌషధం నవ్వు - నవ్వులలోని రకాలను చెప్పిన తీరు -
"నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విష ప్రయుక్తముల్పువ్వులవోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు, సర్వ దు:ఖ దమనంబులు, వ్యాధులకున్ మహౌషధుల్."
మడమ త్రిప్పని యాంధ్ర పుత్రుడను నేనుగడన కెక్కిన యాంధ్ర పుత్రడను నేను.
"బహు దేశములను బేర్వడసి మీసము దీటు భరత ఖండంబు నా పాఠశాలస్తన యుగంబున గాన సాహిత్యములు గల్గు భాషావధూటి నా పంతులమ్మసాందీపని సమక్షమందు విద్య గడించు వనమాలి నా సహ పాఠకుండుభక్తి వైరాగ్య భావముల తావలమైనా భాగవతంబు నా బాలశిక్ష
గంటము ధరించి మోహానాక్షరము లెనయబ్రతిఫలించెడు నా మహోన్నత విభూతివ్రాసిస్కొందును దశ దిశా ఫలక పంక్తిగడన కెక్కిన యాంధ్ర పుత్రుడను నేను."
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్న సూక్తికి నిదర్శనమే కదా.అ
గుంటూరు సీమ గుణగణాలను వివరించిన తీరు -"పెట్టిన పేరు ముందడుగు వేయుటకెట్టి మహోద్యమంబులన్బెట్టిన పేరు మంజుల కవిత్వ పటుత్వరసైక పుష్టికిన్బెట్టిన పేరు గుండెగల వీరవరేణ్యజను: ప్రశస్తికిన్పెట్టిన పేరు గర్తపురి విద్యకు గానకళా ప్రసిద్ధికిన్."
"ఏస కొంచెము లేని హౄదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటుకట్టులో బొట్టులో కడమ సీమల యందు నగ్ర తాంబూలంబు నందు చోటుకంటి కింపైని చక్కని యందగత్తియ లింటింట విద్యుతు లీను చోటుఆవల పల్నాడు, కొండవీ డివల నిలిచిజననమెత్తిన చిరుతబాలునకు గూడగురువులై వీర గాథలు గరవు చోటువీర భాషాభిరామ, గుంటూరుసీమ."
జన్మస్థలం - వినుకొండ"గౌడ డిండిమ భట్టుని కంఛు ఢక్కపగుల గొట్టించు కవిసార్వభౌమునిల్లుభాస్కరుని కత్తి మెరసిన ప్రధన భూమిశిరము నెరసిన వినుకొండ సీమ మాది."
చెళ్ళపిళ్ళ వారిచే గండపెండేర సత్కారం"చెళ పిళా సత్కవీశుడు, ప్రసిద్ధుడు, వీర శతావధాని, యాంధ్రుల శుభ రక్తనాళముల రూపము నెత్తిన బ్రాహ్మణుండు, నాపలుకుల రాణి పాదమును బంగరు గగ్గెరతో నలంకౄతుల్సలిపె, నికేమి కావలె ప్రశస్తి? కవిత్వ కళావధూటికిన్."
నవయుగ కవిచక్రవర్తి, దళితవర్గజ్వలస్ఫూర్తి, జానుతెనుగు కవితురంగం - మన గుర్రం జాషువా.
మధురకవి, అపరశ్రీనాథకవి అయిన గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా తెలుగురధం జానుతెనుగు నివాళులను గర్వంగా సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
2 comments:
జాషువా గారి గురించి చాలా బాగా వ్రాసారు.కొన్ని కొన్ని చోట్ల అచ్చుతప్పులు లేకుండా శ్రద్ధ తీసుకొంటే ఇంకా బాగా వుండేది.
due to various telugu fonts and softwares being used, the spelling mistakes are invitable, despite best efforts. the content of article only should be taken. i donot know, many people concentrate on spellings only and not on contents. thanks for the opinion which is encouraging for me. kompella sarma
Post a Comment