Saturday, February 16, 2008

విశ్వగురువు, నిత్య సత్యాన్వేషి - 'జిడ్డు కౄష్ణమూర్తీ

విశ్వగురువు, నిత్య సత్యాన్వేషి - 'జిడ్డు కౄష్ణమూర్తీ ( 1895 - 1986 )
అష్టమగర్భసంజాతుడు - అపర శ్రీ 'కృౠష్ణమూర్తీ

అద్భుతమైన సౌందర్యంతో నిండిన జీవితాన్ని మనిషి ఎందుకు సమస్యలమయం చేసుకుంటున్నాడనే ఆవేదనతో ఈ భాధలకు, దు:ఖాలకు మూలకారణాలను అన్వేషించి చూపిన మహామనీషి. ఆయన మనసులోని చేతన, అచేతన పొరలను ఒక అపూర్వమైన తీరులో ఆవిష్కరించి చూపి, శ్రోతల చేత స్వయంగా తమ తమ అంతరంగాల శోధన చేయించిన తత్వవేత్త. మానవాళిని బాధాతుల్యులుగా కీర్తించబడిన వారి ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా విఖ్Yఆతి పొందాయి. నిత్య సత్యాణ్వేషి. మానవుడిని సమస్త బంధనాలనుండి విముక్తి చేయడమే తమ ఆశయమని, మతాల, సంస్థల, గురువుల ఆధిపత్యంలో కాకుండా స్వీయజ్ణానంగల స్వతంత్రజీవిగా మనిషి పయనించాలనీ ఉద్భోధించిన ఉత్తమోత్తముడు. ఆయనే జిడ్డు కృౠష్ణమూర్తిగారు. 'జికే గా నిరంతరం పిలువబడే ఈ ప్రజ్జానమూర్తి, 1895 లో మే 11న మదనపల్లిలో జన్మించారు. నారాయణయ్య - సంజీవమ్మ దంపతులకు, పదకోడుగురు సంతానంలో ఎనిమిదవవాడు, అష్టమగర్భసంజాతుడు, కనుక కౄష్ణమూర్తి అని సార్ధకనామధేయం నిశ్చయించారు. బాల్యావస్థలో ఆట పాట చదువుల్లో వెనుకబడడం, శారీరక దుర్బలత్వం, మానసికపుమందగొడితనం, బడిలో గోడకుర్చీలువేయడం, బెత్తందెబ్బలుతినడం, వగైరాది సంఘటనలు, జీవితాంతం సాంప్రదాయిక విద్యాభ్యాసం పట్ల విముఖిడిని చేశాయి. పెద్ద, పేద సంసారం, జికే కు దశాబ్దకాలం నిండకుండానే, తల్లి మరణించడం, కుటుంబపోషణకు చాలా యిబ్బందులను ఎదుర్కొనవలసివచ్చినది.

దివ్యజ్ణాణాసమాజం, అనిబిసెంట్ ల ప్రభావప్రేరణలు

సోదరుడు నిత్యానంద, మిత్రులతో ఆనాటి మద్రాసు, అడయార్ సముద్రతీరంలో, యువకులకు జరిగే అనుభవం కన్న విన్నూత్న అనుభవం 1909 లో జరిగింది. దివ్యజ్ణానసమాజపు అగ్రనాయకులు, చార్లెస్ వెబ్ స్టర్ లెడ్ బీటర్ దౄష్టి లో పడ్డాఋడు మన కౄష్ణుడు. అతీంద్రియ శక్తులు, మనిషిని చూడగానే పుట్టుపూర్వాలు గతం, భావి, కనిపెట్టగలడని ఘనవిశ్వాసం ఉన్న ఈతనికి 'జికే అసాధారణ బాలుడిగా కనిపించాడు. అప్పట్లో దివ్యసమాజం వారు భావి జగద్గురువు అవతరణ కోసం అన్వేషించడం, ఆ లక్షణాలను జికె లో దర్శనం కావ్వడం మూలాన, జగద్గురువు భూమికకు, అనిబిసెంట్ అంగీకారంతో,తండ్రి ఒప్పొందంతో, యిద్దరిని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ అపూర్వ సంఘటన, పదునాలుగు వర్షాల బాలుడికి, సరైన అవగాహన కూడ లేని పరిస్థితి. తండ్రి నుంచి కొన్ని సమస్యలు ఎదురైనా, సోదరుల అంగీకారం మేరకు, అనిబిసెంట్ బాధ్యత కింద పోషణ చేయడం, మాతౄభాషను మరచిపోయినా, సంపూర్ణ యూరోపియన్ వేషభాషాసంస్కౄతీసంస్కారాల్ని అలవరచుకొని, ఫ్రెంచ్ భాషాధ్యయనం కావించుకున్నారు. 1923 లో దివ్యసమాజం వారు హాలెండ్ లోని ఒమెన్ పట్టణంలో 'జిడ్డు కౄష్ణమూర్తీని జగద్గురువు (మైత్రేయబోధిసత్వుడు) గా ప్రకటించారు. జికె అధినేతగా 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈష్ట్' (ప్రాచ్యతార) సంస్థను స్థాపించడం, ఖండాంతరాల నుంచి సహాయసహకారాలు లభించాయి.
జగద్గురువుకుకి బ్రహ్మరధం
భోగభాగ్యాలమధ్య పెరిగిన రాకుమారుడిలా, అందంతో సమ్మోహపరచిన అయస్కాంతపుశక్తితో ఆకర్షింపబడడం, అంత అందగాడిని తను ఎన్నడూ చూడలేదని, బెర్నాడ్ షా, చెప్పడం, హాలివుడ్ సంస్థ జికె నాయకత్వంలో గౌతమబుద్ధ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధపడినా, ఆ ప్రయత్నానికి జికె తిరస్కౄతి, వేష, భాష, నడక, ప్రవర్తనల్లో నూతనశైలితో జికె ఒక ప్రత్యేకశైలెలో ఆకర్షితుడయ్యేవాడు. 1925 లో మద్రాసులో అడయార్ లో ప్రవక్తలా తన మొదటి ప్రసంగం యిచ్చాడు. కౄష్ణమూర్తి అంగ్లకవితాసౌందర్యం, విధ్వంసానికి దూరంగా, విచ్చిన్నధోరణిరహిత నిర్మాణతకు ముందుకు వచ్చినట్లు విశదమవుతుందని పలువురి అభిప్రాయం. ఆంగ్లకవితాసౌందర్యంతో సమ్మోహితులను చేసే, జికె 1927 లో వ్రాసిన ది కింగడం ఒఫ్ హాపినెశ్ (1944) తన కాలేజీ రోజుల్లో చదివి వినిపించేవారు. జికెలాగున అతని వచన రచన కూడ అందంగానే వుండేదిట. తమ్ముడు నిత్యానంద క్షయవ్యాధితో మరణించడం, జికె జీవితంలో అశాంతి, అసంతౄప్తి ఎక్కువైనాయి. దివ్యసమాజం వారు సౄష్టించిన జగద్గురువు పాత్రను అభినయించడానికి తనను వినియోగించబడుతున్నాడని జికె క్రమేపీ భావించాడు. బంగారుపంజరంలోని చిలక అని నిర్ధారించుకున్నాడు. తాను జగద్గురువు కాదని, సామాన్యమానవుడనని, ప్రకటించి, క్రమేపీ దివ్యసమాజానికి దూరంగా వుండడం జరిగింది. కాని అనిబెసెంటుకు తన దత్తపుత్రునిపై ప్రేమానురాగాలు, జగద్గురుత్వంపై విశ్వాసాలు మాత్రం సడలలేదు. అయితే, 82 ఏళ్ళ వౄద్ధురాలు మనస్తాపంతో జబ్బుపడడమే కాకుండ, దౌర్జన్య, క్రౌర్య, కపటసహితమైన లోకంలో జికె ఒంటరివాడయిపోతాడనే దిగులు పడింది. కొందరు దివ్యసమాజపు సభ్యులు జికె వైపు వచ్చి, అండయిచ్చారు.
కౄష్ణమూర్తి ఫౌండేషన్, మద్రాసు

దివ్యసమాజంనుంచి దూరమైనా, నూతన అనుచరవర్గం పెరుగుతూ వచ్చింది. ప్రపంచ పర్యటనలు, ప్రసంగాలు, అనుచరుల సందేహాలను తీర్చడం, ముఖ్యంగా 'కౄష్ణమూర్తి ఫౌండేషన్, మద్రాసు, ఋౠషివ్యాలి (మదనపల్లి), వారణాసి, డిల్లీ, యింగ్లండు, అమెరికా మొదలైన చోట్ల విద్యాసంస్థలు, ప్రచురణసంస్థలు, ట్రష్టులు ప్రారంభమై, జికె సందేశాలు, తత్వధోరణి,కార్యక్రమాలను విస్తారంగా నడపడం ప్రారంభమైనవి. ద్వితీయ ప్రపంచయుద్ధం మూలాన, జికె కాలిఫోర్నియాలో సుస్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నాడు. యుద్ధానంతరం 1947 లో యిండియా పున:ప్రయాణం, తరచుగా యిండియా రావడం, ఆయన విద్యాసంస్థల కార్యక్రమాల్ని విశ్లేషించేవాడు. విద్యాసంస్థలను తనిఖీచేయడం, ప్రసంగాలను అందించడం, విదేశ పయనాలు, ముఖ్యకార్యక్రమాలుగా వుండేవి.
ఘనులతో సుపరిచయాలు


ప్రపంచ పర్యటనలు సుప్రసిద్ధ వ్యక్తులతో సద్గోష్టులు, సజ్జనసాంగత్యాలు, సుపరిచయాలు జరిగాయి. ప్రముఖుల్లో, బెర్నాడ్ షా, ఆల్డస్ హక్స్ లీ, సోమర్ సెట్ మాం, హెన్రీ మిల్లర్ లాంటి వారు అతని స్నేహితులుగా మారారు. ఎందరో కళాకారులు, రాజకీయనాయకులు, అతిసన్నిహితులుగా మారిపోయారు. జవహర్ లాల్ నెహ్రూ, యిందిరాగాంధి, అచ్యుత్ పట్వర్ధన్ లకు జికె పై అమితగౌరవం కలిగింది.
విలక్షణ ఆకర్షణ్

వెండిజుట్టు, స్వేతవస్త్రధారణ, శిల్పికళాసౄష్టిలా అందమైన ఆజానుభాహవిగ్రహం, ముఖగాంభీర్యత, ప్రశాంతతల మిశ్రమశైలి, ఆవిగ్రహాన్నే చూస్తూ కూర్చునే అభిమానశ్రోతలు, ఉపన్యాసాలు, సందేహాలకు సమాధానాలు, మధ్యలో చమత్కారాలు, చలోక్తులు, పిట్టకధలు, ఉపమానాలు, ప్రకౄతివింతలు, అనుభవాలు, కవిత్వాలు, జీవితాలు, హితబోధలు, మందలింపులు, మానవ మనస్తత్వ పరిశీలనలు, దిట్టకవుల అష్టావధానప్రక్రియలా, తత్వ, జ్ణానబోధనలు ప్రవచించబడేవి. వినేకొద్ది వినాలని, ఆలోచించేకొద్ది ఆలోచించాలని, అంతులేనికధనాలుగా అలరించబడే వేదికలపై, జికె తన ప్రతిభావ్యుత్పత్తులని ప్రకటించేవారు. తన ప్రసంగాలలో - ప్రముఖ అంశాలుగా, సత్యం, శివం, సుందరం, న్యాయం, స్వేచ్చ, విద్య, విచ్హినత, ధ్యానం, శాంతియుతజీవనం, జీవితపరిపూఋర్ణత్వం, భయభ్రాంతులు, అధిమానసికస్థితి, హింస, స్వీయజ్ణానం, ఆలోచనాలహరి, బాంధవ్యాలు, మరణం, స్వయం అవగాయన, దు:ఖం, ఆరాటం, భద్రత, కోపం, నిబద్ధీకరణం, స్వాభిమానం, మన:ప్రకంపన, మానవాళి భవిష్యత్తు, అంతర్వీక్షణ, అనుగ్రహం, ఆగ్రహం, బాధ, పారమార్ధిక జీవనం, పరిత్యాగం, కంతిదర్శనం, 'నేనూ అన్న ఆంశంపై సుదీర్ఘవిశ్లేషణ, మానవజీవితాలు, యిత్యాది అనేక అంశాలపై భాష్యాన్ని, భావసౌందర్యసహితంగా ప్రవచ్ఫనాల్ని, నభూతో నభవిష్యతి అన్న మాదిరి ఒక తలమానికమైన శైలిని, తత్వాన్ని అందించారు.

No comments: