Wednesday, January 23, 2008

నేతాజీ సుభాష్ చంద్రబోస్ - విప్లవానికే నాయకుడు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ - విప్లవానికే నాయకుడు

చూపుకు చూపు విసరిన చతురుడు

ఆయన ఒక జాతీయనాయకుడు।చాలాకాలం కాంగ్రేసులో భాగస్యామ్యం, గాంధీజీ అహింసా విధానాలపైనా ప్రభావం చెందినవాడు. అయినా, తెల్లదొరల పరిపాలనా విధానాలను చూశాక, ప్రజలు పడిన యిబ్బందులను చూడలేక, ఊరందరిది ఒక దారి, ఉలిపికట్టెది మరోదారి అన్నట్లు, కొత్తపుంత తొక్కాడు. గాంధీజీ భావాలకు దూరంగా జరిగాడు. చూపుకు చూపు, పళ్ళునూరుతూ పటపటకు పటపట అని చెప్పేవాడు. తెల్లవారిని పారద్రోలడానికి, నూతన పథకాన్ని, భారతీయ జాతీయ సైన్యం, అజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించాడు. ఆయన ఎవరో కాదు, అందరికీ నేతాజీ గా సుపరిచితుడు - సుభాష్ చంద్రబోస్. గొప్ప జాతీయవాది, దేశపు స్వాతంత్ర్యం కోసం అకుంఠిత దీక్ష తో పోరాటం సలిపిన వ్యక్తి. గాంధి, నెహ్రూ లాంటి భారతప్రభుత్వానికి నాందీ బోస్

నాయకులకున్న భావాలకు భిన్నంగా, అవసరమైతే, దేశపు సైన్యం తిరగబడితేనే తప్ప, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం సాధ్యపడదు అని విశ్వసించిన విజ్ణాని। బి।ఎ. ఆనర్స్ పాసయి, ఐ.సి.యస్. లో కూడ ఉత్తీర్ణతను సాధించాడు. కాని, ఉద్యోగంలో చేరితే, బ్రిటి్ష్ పాలనలో ఉద్యోగం చేయడం మనసొప్పక, రాజీనామా చేశాడు. వెంటనే, జాతీయోద్యమంలోను, కాంగ్రేసులో కూడ చేరాడు. విప్లవభావాలకు, తత్సంబంధిత కార్యకలాపాల నిమిత్తం బోసు అనేకసార్లు అరెష్ట్ అయ్యాడు. కలకత్తాలోని తన యింటిలో నిర్భంధం నుంచి పారిపోవడం, కారాగారం లోకి రావడం కూడ బోసుకి పరిపాటే. అలా ఓ సారి పారిపోయి జపానుకు చేరుకున్నాడు. అక్కడ సహాయంతో, 'భారతీయ జాతీయ సైన్యం', 'తాత్కాలిక భారతప్రభుత్వం'ను ధైర్యంగా స్థాపించడం జరిగింది.


విశ్వవ్యాప్తంగా 'నేతాజీ'గానే గుర్తింపు

సుభాష్ చంద్రబోస్ గా తల్లిదండ్రులు పెట్టిన పేరు కాక, విశ్వవ్యాప్తంగా 'నేతాజీ'గానే సుపరిచితులు। ఒరిస్సా లోని కటక్ లో గౌరవ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన బోస్, యుక్తయవసులోనే జాతీయస్థాయిలోనే ఉద్యోగం లభించింది. 1943 లో ఆర్మీ ని స్థాపించి నిర్వహించడం జరిగింది. తెల్లదొరల పాలకులను నేతాజీ ఆర్మీ ఉత్తర-తూర్పు ప్రాంతాల్లోని వారి సైన్యాన్ని, బోస్ సైన్యం తరిమివేసే ప్రయత్నం సంపూర్ణంగా సఫలం కాకపోయినా, ఆ ప్రయత్నం చాలా ప్రభావం చూపించింది. భారతీయులకు అనుకున్న దానికన్న, త్వరితంగా స్వాతంత్ర్యం సంపాదించడానికి చాలా దోహదమయ్యింది.

నేతాజీ సైన్యవిభాగం రూపురేఖలు

సామాజిక సమానతకు మారుపేరు। అన్నిమతాలనుంచి ప్రాతినిధ్యం కనిపించాయి. దేశానికి స్వాతంత్ర్యం పొందడమే అందరి లక్ష్యం. బానిసత్వానికి భరతవాక్యం పలకడం మరొక సంకల్పం. సుభాష్ చదువుకొనేటప్పుడు, తెల్లదొరల పిల్లలు, తోటి భారతీయుల పిల్లల కన్నా తెలివైనవారుగా ప్రకటించుకోవడం నేతాజీ సహించుకోలేకపోయాడు. ఈ వివాదాన్ని, వివక్షతని భరించలేని బోస్ ఒకసారి అంగ్లబాలుడి పై చేయి చేసుకోవడం కూడ జరిగింది. ఆ రోజుల బానిసత్వన్ని విభజించు - పాలించు అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు తెల్లవారు. పదిహేనేళ్ళ వయసులో తన తల్లితో, భారతదేశం అత్యంత ప్రీతిపాత్రమైన దేశమన్నది నిజంగా నిజం. నేతాజీ ఆలోచనలని, ఎప్పుడూ తనలోనే గుంభనగా దాచుకొని, ఆచరణకు వాడుకొనేవాడు. గెడ్డం పెంచుకొని, గుర్తుపట్టలేకుండ, పఠాం గా వే్షం వేసుకొని పెషావర్ కు పారిపోయాడు. జర్మనీలో హిట్లర్ దూసుకుపోతూంటే, నేతాజీ మేధ చురుగ్గా, శతృవు శతృవు - మిత్రుడు అన్న ఆలోచనన మెరిసి, చక్రం తిప్పాడు. కాని, సాధ్యపడక, ఓడలో జపాన్ చేరుకున్నాడు. సింగపూర్, బర్మా లో స్థిరపడిన భారతీయల సహకారం దొరికింది. ఫి్బ్రవరి 1944 లో తొలివిజయాన్ని చవిచూశాడు. ప్రజలు త్యాగభావంతో ముందుకు దూసకుంటూ రాసాగారు . కాని, అటవీ ప్రాంతాల్లో సైన్యానికి మలేరియా సోకి కొన్ని యిబ్బందులు మాత్రం వచ్చాయి . అమెరికాకు జపాను లొంగడం, యూరోపు లో జర్మనీకి ఓటమి, ఫలితంగా, నేతాజీ సైన్యం యింఫాల్ కు చేరుకోగలిగారు. కాని, హిట్లర్ తో మిత్రత్వం వల్ల, స్వాతంత్ర్యం తన చేతుల్తో భారతదేశానికి తీసుకురావాలన్న ఆశయం నెరవేరలేదు.

1945 లో తైవాం లో ఒక విమానప్రమాదంలో నేతాజీ మరణించాడని ప్రగాఢవిశ్వాసాన్ని అధికంగా భావిస్తారు.
జై నేతాజీ - జైహింద్। సుభా్ష్ చంద్రబోస్ అమర్ రహే. ఘన నివాళిని సమర్పించుకుంటూ ...

1 comment:

Anonymous said...

gandhi valana BOSE GARU chanipoyarari..na nannakamu..e store write chasinanduku abinandanalu. please photos kuda pampandi